అప్పులు చేస్తేనే సంక్షేమ పథకాలు అమలు చేసే పరిస్థితి వచ్చిందన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. నెల్లూరు జిల్లా కందుకూరులో మాట్లాడిన ఆయన.. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది.. అప్పులు చేస్తేనే కానీ సంక్షేమ పథకాలు అమలు చేసే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు..
మహిళలు, బాలికల రక్షణ కోసం ప్రభుత్వం ఎన్ని చట్టాలు తెచ్చినా వారికి మాత్రం రక్షణ లేకుండాపోతుంది. యేడాదికేడాది హత్యలు, అత్యాచారాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. జిల్లాలోని మారుమూల గ్రామాల్లో సైతం మహిళలు, బాలికలకు వేధింపులు తప్పడం లేదు. పురుషాధిక్య సమాజంలో ఆమె ఒక సమిధగా మారుతున్నది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మైనర్ బాలికలపై అత్యాచార ఘటనలు భయాందోళనలకు గురి చేస్తున్నాయి. తాజాగా నెల్లూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది..
ఎన్డీఏపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు సీపీఎం సీనియర్ నేత బృందాకారత్.. నెల్లూరులో సీపీఎం రాష్ట్ర మహాసభల ముగింపు సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ.. నెల్లూరు నుంచి పుచ్చలపల్లి సుందరయ్య పార్టీ కోసం పని చేశారు.. పార్టీ కోసం ఎంతో కష్ట పడిన సీతారాం ఏచూరిని కోల్పోయాం.. నెల్లూరులో పార్టీకి చెందిన వైద్యులు ఏర్పాటు చేసిన ఆసుపత్రి కి వచ్చాను.. నెల్లూరులో ఎన్నో పోరాటాలు జరిగాయని గుర్తుచేశారు.. అయితే, కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను…
భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్ట్).. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా తిరిగి ఎన్నికయ్యారు వి. శ్రీనివాసరావు.. నెల్లూరులో 27వ ఏపీ రాష్ట్ర మహాసభల్లో నూతన రాష్ట్ర కార్యదర్శిగా వి శ్రీనివాసరావు తిరిగి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.. ఇక, 49 మందితో కూడిన నూతన రాష్ట్ర కమిటీని మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. మరోవైపు.. 15 మందితో నూతన కార్యదర్శివర్గాన్ని ఎన్నుకున్నారు..
సీపీఎం ఏపీ రాష్ట్ర 27వ మహాసభలు ఫిబ్రవరి 1వ తేదీ నుండి 3వ తేదీ వరకు నెల్లూరులో జరుగుతున్నాయి. ఈ మహాసభలకు రాష్ట్రం నలుమూలల నుండి 500 మంది ప్రతినిధులు, అతిథులు హజరవుతున్నారు. ఆలిండియా నాయకులు శ్రీమతి బృందాకరత్, ఎంఏ బేబి, బీవీ రాఘవులు, ఆర్.అరుణ్కుమార్ తదితరులు హాజరవుతున్నారు. ఫిబ్రవరి 1వ తేదీన మహాసభ ప్రారంభ సభ జరుగుతుందని.. ఆలిండియా నాయకులు, రాష్ట్ర నాయకత్వంతోపాటు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి పాల్గొంటారు.
నెల్లూరులోని శ్రీనివాస్ నగర్లో మహబూబ్ బాషా అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మహబూబ్ బాషా కుమార్తెను సాదిక్ అనే వ్యక్తి గత కొద్ది సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాడు. ఈ నేపథ్యంలో వీరి ప్రేమను మహబూబ్ బాషా అంగీకరించకపోవడంతో సాదిక్ ఆగ్రహానికి గురయ్యాడు.
అర్హులైన వారికి 18 అంకణాల ఇంటి నివాస స్థలాలు ఇస్తామని తెలిపారు సర్వేపల్లి ఎమ్మెల్యే, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి.. నెల్లూరు జిల్లా ముత్తుకూరులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నూతనంగా నిర్మించిన అదనపు భవనాన్ని ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రూ.50 లక్షలతో అదనపు భవనాన్ని నిర్మించాం.
డిప్యూటీ సీఎం అనే పదానికి జనసేన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ వన్నెతెచ్చారు గానీ.. పవన్ గారికి డిప్యూటీ సీఎం పదవి వల్ల ప్రత్యేక చరిష్మా రాలేదని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల అంటున్నారు. గత సంవత్సరాల అనుభవంలో డిప్యూటీ సీఎంలుగా ఎవరున్నారో తనతో పాటు చాలామందికి తెలియని పరిస్థితి అని, ఈ రోజున దేశం మొత్తం ఏపీ డిప్యూటీ సీఎం గురించి చర్చిస్తున్నారన్నారు. ఇంతితై వటుడింతై…
ఇవాళ తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన నేతలతో వైసీపీ అధినేత జగన్ సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్పర్సన్లు, మేయర్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరవుతారు. సమావేశంలో భాగంగా జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి చేపట్టాల్సిన చర్యలపై వైసీపీ అధినేత జగన్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.
నెల్లూరులో నగర పాలక సంస్థ కార్యాలయంలో వివిధ విభాగాలు, కార్పొరేటర్లతో మంత్రి నారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో జగన్ అరాచక పాలన చేశారని.. ఐదేళ్లపాటు నియంత పాలన కొనసాగిందని ఆయన విమర్శించారు.