CPM AP Conference: నెల్లూరులో రేపటి నుంచి సీపీఎం రాష్ట్ర మహాసభలు..
- రేపటి నుంచి సీపీఎం ఏపీ 27వ రాష్ట్ర మహాసభలు..
- ఫిబ్రవరి 1వ తేదీ నుండి 3వ తేదీ వరకు మహాసభలు..
- హాజరుకానున్న 500 మంది ప్రతినిధులు, అతిథులు..
- 45 ఏళ్ల తర్వాత మహాసభలకు ఆతిథ్యమిస్తోన్న నెల్లూరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CPM AP Conference: భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు).. సీపీఐ(ఎం).. వరుసగా వివిధ రాష్ట్రాల్లో మహాసభలను నిర్వహిస్తూ.. రాష్ట్ర కార్యదర్శులను ఎన్నుకుంటూ వస్తుంది.. అన్ని రాష్ట్రాల్లో మహాసభలు ముగిసిన తర్వాత జాతీయ మమహాసభలు నిర్వహించనున్నారు.. ఇప్పటికే తెలంగాణలో మహాసభల్లో జాన్ వెస్లీని రాష్ట్ర కార్యదర్శి ఏకగ్రీవంగా ఎన్నుకున్న విషయం విదితమే కాగా… ఇప్పుడు మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.. సీపీఎం మహాసభలకు ముస్తాబైంది.. రాష్ట్ర 27వ మహాసభలు ఫిబ్రవరి 1వ తేదీ నుండి 3వ తేదీ వరకు నెల్లూరులో జరుగుతున్నాయి. ఈ మహాసభలకు రాష్ట్రం నలుమూలల నుండి 500 మంది ప్రతినిధులు, అతిథులు హజరవుతున్నారు. ఆలిండియా నాయకులు శ్రీమతి బృందాకరత్, ఎంఏ బేబి, బీవీ రాఘవులు, ఆర్.అరుణ్కుమార్ తదితరులు హాజరవుతున్నారు. ఫిబ్రవరి 1వ తేదీన మహాసభ ప్రారంభ సభ జరుగుతుందని.. ఆలిండియా నాయకులు, రాష్ట్ర నాయకత్వంతోపాటు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి పాల్గొంటారు. ఈ ప్రారంభ సభకు ప్రతినిధులతో పాటు నెల్లూరు ప్రముఖులు కూడా పాల్గొంటారనీ ఓ ప్రటనలో పేర్కొంది సీపీఎం రాష్ట్ర కార్యాలయం..
Read Also: Champions Trophy 2025: పీసీబీకి మరో తలనొప్పి.. తొలగించడం లేదంటూ వివరణ!
Also Read
- CM Chandrababu: తీరం మనదే.. బోటు మనదే.. వేట కూడా మనదే.. ఎవరైనా వస్తే వేటాడుతాం.. వెంటాడుతాం..
- Lemon Price Hike : నిమ్మ రైతుల పంట పండింది.. కిలో రూ.200
- YS Jagan: దేవుడు అన్నీ చూస్తున్నాడు.. కళ్లు మూసుకుని తెరిచేలోపే మన ప్రభుత్వం వస్తుంది..!
- YS Jagan to Visit Juvvaladinne Fishing Harbour: నేడు జువ్వలదిన్నెకు వైఎస్ జగన్
ఇక, ఫిబ్రవరి 3వ తేదీన సాయంత్రం 3 గంటలకు ఆత్మకూరు బస్టాండ్ నుండి ప్రదర్శన ప్రారంభమై.. సాయంత్రం 4 గంటలకు వీఆర్ హైస్కూలు గ్రౌండ్స్లో బహిరంగ సభ జరుగుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రకటించారు.. ఇక, సీపీఎం మహాసభల ప్రాంగణానికి సీతారామ్ ఏచూరి పేరును ఖరారు చేశారు. నెల్లూరు వేదికగా ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో సీపీఎం మహాసభలు జరగనున్నాయి. రాష్ట్రంలోని ఐదు ప్రాంతాల నుంచి పలు అంశాల మీద ఐదు యాత్రలతో ప్రజలు కదిలివస్తారని శ్రీనివాసరావు తెలిపారు. అయితే, సీపీఎం రాష్ట్ర మహాసభలు 45 ఏళ్ల తర్వాత మరోసారి నెల్లూరులో జరగనున్నాయి.. దక్షిణ భారత కమ్యూనిస్టు నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య సారథ్యంలో నెల్లూరులో 1978లో 13వ రాష్ట్ర మహాసభలు జరగగా.. 45 ఏళ్ల తర్వాత మరోసారి నెల్లూరు సీపీఎం మహాసభలకు ఆతిథ్యమిస్తోంది.
తాజావార్తలు
-
Red Chili Test: వంటగదిలో వాడే ఎండు మిర్చి కారం నకిలీదా..? అసలుదా..? సింపుల్గా తెలుసుకోండిలా..
-
Britain Heatwave: భారత్లో 45°C ఉన్నా ఏం కాదు.. బ్రిటన్లో 35°Cకే ప్రజలు ఎందుకు అల్లాడుతున్నారు?
-
NBK 112: కొరటాల సినిమా కోసం రూల్స్ బ్రేక్ చేసిన బాలయ్య
-
Laundry Tips: వర్షాకాలంలో బట్టలు వాసన వస్తున్నాయా? సింపుల్గా ఇలా చేసేయండి!
-
Smartphone Restart Benefits: స్మార్ట్ఫోన్ను రీస్టార్ట్ చేయాలా?.. టెక్ నిపుణులు చెబుతున్న సీక్రెట్స్..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!