CPM AP Conference: నెల్లూరులో రేపటి నుంచి సీపీఎం రాష్ట్ర మహాసభలు..
- రేపటి నుంచి సీపీఎం ఏపీ 27వ రాష్ట్ర మహాసభలు..
- ఫిబ్రవరి 1వ తేదీ నుండి 3వ తేదీ వరకు మహాసభలు..
- హాజరుకానున్న 500 మంది ప్రతినిధులు, అతిథులు..
- 45 ఏళ్ల తర్వాత మహాసభలకు ఆతిథ్యమిస్తోన్న నెల్లూరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CPM AP Conference: భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు).. సీపీఐ(ఎం).. వరుసగా వివిధ రాష్ట్రాల్లో మహాసభలను నిర్వహిస్తూ.. రాష్ట్ర కార్యదర్శులను ఎన్నుకుంటూ వస్తుంది.. అన్ని రాష్ట్రాల్లో మహాసభలు ముగిసిన తర్వాత జాతీయ మమహాసభలు నిర్వహించనున్నారు.. ఇప్పటికే తెలంగాణలో మహాసభల్లో జాన్ వెస్లీని రాష్ట్ర కార్యదర్శి ఏకగ్రీవంగా ఎన్నుకున్న విషయం విదితమే కాగా… ఇప్పుడు మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.. సీపీఎం మహాసభలకు ముస్తాబైంది.. రాష్ట్ర 27వ మహాసభలు ఫిబ్రవరి 1వ తేదీ నుండి 3వ తేదీ వరకు నెల్లూరులో జరుగుతున్నాయి. ఈ మహాసభలకు రాష్ట్రం నలుమూలల నుండి 500 మంది ప్రతినిధులు, అతిథులు హజరవుతున్నారు. ఆలిండియా నాయకులు శ్రీమతి బృందాకరత్, ఎంఏ బేబి, బీవీ రాఘవులు, ఆర్.అరుణ్కుమార్ తదితరులు హాజరవుతున్నారు. ఫిబ్రవరి 1వ తేదీన మహాసభ ప్రారంభ సభ జరుగుతుందని.. ఆలిండియా నాయకులు, రాష్ట్ర నాయకత్వంతోపాటు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి పాల్గొంటారు. ఈ ప్రారంభ సభకు ప్రతినిధులతో పాటు నెల్లూరు ప్రముఖులు కూడా పాల్గొంటారనీ ఓ ప్రటనలో పేర్కొంది సీపీఎం రాష్ట్ర కార్యాలయం..
Read Also: Champions Trophy 2025: పీసీబీకి మరో తలనొప్పి.. తొలగించడం లేదంటూ వివరణ!
Also Read
- AO M*urder Case: ఏవో శ్రీహరి హత్య కేసులో ఊహించని ట్విస్ట్.. నిందితుడి ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య..
- CM Chandrababu: 'మావిగన్ అంటే నాకే అర్థం కావడం లేదు'.. జగన్పై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు..
- Nellore: కోడూరు బీచ్లో విషాదం.. ముగ్గురు గల్లంతు.. బాలుడి మృతి
- CM Chandrababu: తీరం మనదే.. బోటు మనదే.. వేట కూడా మనదే.. ఎవరైనా వస్తే వేటాడుతాం.. వెంటాడుతాం..
ఇక, ఫిబ్రవరి 3వ తేదీన సాయంత్రం 3 గంటలకు ఆత్మకూరు బస్టాండ్ నుండి ప్రదర్శన ప్రారంభమై.. సాయంత్రం 4 గంటలకు వీఆర్ హైస్కూలు గ్రౌండ్స్లో బహిరంగ సభ జరుగుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రకటించారు.. ఇక, సీపీఎం మహాసభల ప్రాంగణానికి సీతారామ్ ఏచూరి పేరును ఖరారు చేశారు. నెల్లూరు వేదికగా ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో సీపీఎం మహాసభలు జరగనున్నాయి. రాష్ట్రంలోని ఐదు ప్రాంతాల నుంచి పలు అంశాల మీద ఐదు యాత్రలతో ప్రజలు కదిలివస్తారని శ్రీనివాసరావు తెలిపారు. అయితే, సీపీఎం రాష్ట్ర మహాసభలు 45 ఏళ్ల తర్వాత మరోసారి నెల్లూరులో జరగనున్నాయి.. దక్షిణ భారత కమ్యూనిస్టు నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య సారథ్యంలో నెల్లూరులో 1978లో 13వ రాష్ట్ర మహాసభలు జరగగా.. 45 ఏళ్ల తర్వాత మరోసారి నెల్లూరు సీపీఎం మహాసభలకు ఆతిథ్యమిస్తోంది.
తాజావార్తలు
-
Samantha Baby Shower: ‘సమంత’ సీమంతం.! ఫోటోలు వైరల్.. నిజమేనా?
-
Apple: ఆపిల్ ‘బ్యాక్ టు స్కూల్’ సేల్ ప్రారంభం.. మ్యాక్బుక్, ఐప్యాడ్లపై భారీ డిస్కౌంట్లు.. ఫ్రీగా AirPods, Apple Pencil
-
Volvo EX90: వోల్వో EX90 ఎలక్ట్రిక్ SUV.. 602KM రేంజ్, 5-స్టార్ సేఫ్టీ, లగ్జరీ ఫీచర్లతో రానున్న ఫ్లాగ్షిప్ EV
-
Akshay Kumar : ‘వెల్కమ్ టుది జంగిల్’ థియేటర్లలో ఉండగానే మరో సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన అక్షయ్ కుమార్
-
Speaker Ayyanna Patrudu: ఉచిత పథకాలపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!