CPM AP Conference: నెల్లూరులో రేపటి నుంచి సీపీఎం రాష్ట్ర మహాసభలు..
- రేపటి నుంచి సీపీఎం ఏపీ 27వ రాష్ట్ర మహాసభలు..
- ఫిబ్రవరి 1వ తేదీ నుండి 3వ తేదీ వరకు మహాసభలు..
- హాజరుకానున్న 500 మంది ప్రతినిధులు, అతిథులు..
- 45 ఏళ్ల తర్వాత మహాసభలకు ఆతిథ్యమిస్తోన్న నెల్లూరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CPM AP Conference: భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు).. సీపీఐ(ఎం).. వరుసగా వివిధ రాష్ట్రాల్లో మహాసభలను నిర్వహిస్తూ.. రాష్ట్ర కార్యదర్శులను ఎన్నుకుంటూ వస్తుంది.. అన్ని రాష్ట్రాల్లో మహాసభలు ముగిసిన తర్వాత జాతీయ మమహాసభలు నిర్వహించనున్నారు.. ఇప్పటికే తెలంగాణలో మహాసభల్లో జాన్ వెస్లీని రాష్ట్ర కార్యదర్శి ఏకగ్రీవంగా ఎన్నుకున్న విషయం విదితమే కాగా… ఇప్పుడు మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.. సీపీఎం మహాసభలకు ముస్తాబైంది.. రాష్ట్ర 27వ మహాసభలు ఫిబ్రవరి 1వ తేదీ నుండి 3వ తేదీ వరకు నెల్లూరులో జరుగుతున్నాయి. ఈ మహాసభలకు రాష్ట్రం నలుమూలల నుండి 500 మంది ప్రతినిధులు, అతిథులు హజరవుతున్నారు. ఆలిండియా నాయకులు శ్రీమతి బృందాకరత్, ఎంఏ బేబి, బీవీ రాఘవులు, ఆర్.అరుణ్కుమార్ తదితరులు హాజరవుతున్నారు. ఫిబ్రవరి 1వ తేదీన మహాసభ ప్రారంభ సభ జరుగుతుందని.. ఆలిండియా నాయకులు, రాష్ట్ర నాయకత్వంతోపాటు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి పాల్గొంటారు. ఈ ప్రారంభ సభకు ప్రతినిధులతో పాటు నెల్లూరు ప్రముఖులు కూడా పాల్గొంటారనీ ఓ ప్రటనలో పేర్కొంది సీపీఎం రాష్ట్ర కార్యాలయం..
Read Also: Champions Trophy 2025: పీసీబీకి మరో తలనొప్పి.. తొలగించడం లేదంటూ వివరణ!
Also Read
- Venkaiah Naidu: ఉచితాలకు నేను వ్యతిరేకం.. ఉచితంగా ఇవ్వాల్సింది విద్య, వైద్యం మాత్రమే..!
- AO M*urder Case: ఏవో శ్రీహరి హత్య కేసులో ఊహించని ట్విస్ట్.. నిందితుడి ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య..
- CM Chandrababu: 'మావిగన్ అంటే నాకే అర్థం కావడం లేదు'.. జగన్పై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు..
- Nellore: కోడూరు బీచ్లో విషాదం.. ముగ్గురు గల్లంతు.. బాలుడి మృతి
ఇక, ఫిబ్రవరి 3వ తేదీన సాయంత్రం 3 గంటలకు ఆత్మకూరు బస్టాండ్ నుండి ప్రదర్శన ప్రారంభమై.. సాయంత్రం 4 గంటలకు వీఆర్ హైస్కూలు గ్రౌండ్స్లో బహిరంగ సభ జరుగుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రకటించారు.. ఇక, సీపీఎం మహాసభల ప్రాంగణానికి సీతారామ్ ఏచూరి పేరును ఖరారు చేశారు. నెల్లూరు వేదికగా ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో సీపీఎం మహాసభలు జరగనున్నాయి. రాష్ట్రంలోని ఐదు ప్రాంతాల నుంచి పలు అంశాల మీద ఐదు యాత్రలతో ప్రజలు కదిలివస్తారని శ్రీనివాసరావు తెలిపారు. అయితే, సీపీఎం రాష్ట్ర మహాసభలు 45 ఏళ్ల తర్వాత మరోసారి నెల్లూరులో జరగనున్నాయి.. దక్షిణ భారత కమ్యూనిస్టు నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య సారథ్యంలో నెల్లూరులో 1978లో 13వ రాష్ట్ర మహాసభలు జరగగా.. 45 ఏళ్ల తర్వాత మరోసారి నెల్లూరు సీపీఎం మహాసభలకు ఆతిథ్యమిస్తోంది.
తాజావార్తలు
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
King 100 Glimpse: నాగార్జున 100వ సినిమా ఫస్ట్ గ్లింప్స్కు డేట్ ఫిక్స్.. ఆ రోజు అసలు సర్ప్రైజ్
-
Nepal Floods: నేపాల్లో వరద బీభత్సం.. కొట్టుకుపోయిన గ్రామాలు.. 1,000 మందికి పైగా గల్లంతు!
-
Pavan Sadineni Arrest: టాలీవుడ్ డైరెక్టర్ పవన్ సాదినేని అరెస్ట్.. లైంగికంగా వాడుకున్నాడని ఫిర్యాదు!
-
Fanta: ఒకే బ్రాండ్.. రెండు దేశాలు.. కానీ చక్కెరలో భారీ తేడా!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!