Proddatur: బుట్టలో పడ్డారా.. అంతే సంగతులు! క్షణాల్లో బురిడీ కొట్టించి ఉడాయింపు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Proddatur: మోసపోయేవాడు ఉంటే.. మన దేశంలో మోసం చేసే వాడికి కొదవే లేదు. డబ్బు మీద అత్యాశ ఉంటే చాలు.. అలాంటి వాళ్లను టార్గెట్ చేస్తున్నారు కేటుగాళ్లు. వారి డబ్బు యావను దృష్టిలో పెట్టుకుని పలు రకాలుగా మోసం చేస్తున్నారు. వారిని అమాయకులను చేసి.. అందిన కాడికి దోచేస్తున్నారు. డబ్బు ఇస్తే.. ఖాతాకు నగదు బదిలీ ద్వారా రెట్టింపు సొమ్ము ఇస్తామని చెబితే.. అట్లాంటి వారిని ఎవరైనా నమ్ముతారా? అలాంటి వారిని నమ్మితే ఏం జరుగుతుంది? సింపుల్.. మోసం చేసి సొమ్ము కొట్టేస్తారు. సరిగ్గా కడప జిల్లా ప్రొద్దుటూరులో ఇదే జరిగింది. రెట్టింపు సొమ్ముకు ఆశపడితే అసలు ఎసరొచ్చింది.
ఎంత ముద్దుగున్నావే.. Maroon కలర్లో Realme Narzo 90x 5G లాంచ్.. ఫీచర్స్ ఏంటంటే?
Also Read
- Kambham Road Accident: పెళ్లి ఇంట్లో పెను విషాదం.. ఇద్దరు అన్నలు సహా నలుగురు మృతి.. పెళ్లి కూతురుకి తీవ్రగాయాలు..
- Murder Case: 'నీలాంటి భర్తలు వెయ్యి మంది దొరుకుతారు'.. ఆ ఒక్క మాటతో జరిగిన ఘోరం, హైకోర్టు కీలక తీర్పు
- Rajasthan: బాలికపై అత్యాచార ఘటనలో బుల్డోజర్ యాక్షన్.. 4 హోటళ్లు ధ్వంసం
- Chennai Crime: ప్రియురాలికి ఐఫోన్ గిఫ్ట్ కోసం చైన్ స్నాచింగ్.. పోలీసుకు పట్టించిన చొక్కా..!
డబ్బు ఇస్తే.. కొద్ది క్షణాల్లోనే రెట్టింపు సొమ్ము ఇస్తాం. అది కూడా ఆన్లైన్లో చెల్లిస్తాం. ఇలా చెప్పి అమాయకులకు వల వేస్తారు నేరగాళ్లు. తమ బుట్టలో పడ్డారా.. అంతే సంగతులు వారిని క్షణాల్లో బురిడీ కొట్టించి ఉన్న సొమ్ము కొట్టేసి ఉడాయిస్తారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఇలాగే జరిగింది. అలా రెట్టింపు డబ్బు ఇస్తామని నమ్మబలికి 33 లక్షల రూపాయల సొమ్ము కాజేసిన అంతర్రాష్ట్ర ముఠాను ప్రొద్దుటూరు పోలీసులు అరెస్ట్ చేశారు.
ప్రొద్దుటూరుకు చెందిన గంగా ప్రసాద్ తన స్నేహితుడి ద్వారా పరిచయమైన పులివెందులకు చెందిన గంగులయ్య మరో నలుగురు కలిసి అంతర్రాష్ట్ర ముఠాను కలిశారు. రూ. 33 లక్షలు నగదు ఇస్తే 50 లక్షల రూపాయలు బ్యాంకు ఖాతాకు వేస్తామని నమ్మబలికారు ముఠా సభ్యులు. గంగా ప్రసాద్ వద్ద నుంచి 33 లక్ష రూపాయలు నగదు తీసుకొని డబ్బు ఒక బ్యాగులో పెట్టి ఆ బ్యాగును ఒక డబుల్ డోర్ బ్రీఫ్ కేస్లో పెట్టారు. బ్యాంకు ఖాతాకు డబ్బు ట్రాన్స్ఫర్ చేయడానికి కుదరలేదని తిరిగి నీ డబ్బు తీసుకొమని చెప్పి అప్పటికే బ్రీఫ్ కేస్లో ఉంచిన చిత్తుకాగితాలు ఉన్న బ్యాగు ఇచ్చారు. తనను మోసం చేస్తున్నారని గమనించిన గంగా ప్రసాద్ తన డబ్బు తిరిగి ఇచ్చేయాలని అడగడంతో కత్తితో బెదిరించి డబ్బుతో ముఠా సభ్యులు ఉడాయించారు.
Dhurandhar OTT Record: ఓటీటీలో ‘ధురంధర్’ జాతర.. వ్యూస్లో దూసుకుపోతున్న యాక్షన్ థ్రిల్లర్!
గత సంవత్సరం జనవరిలో జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముఠా సభ్యులను ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డులో అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 8 లక్షల 50 వేలు నగదు, ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఒక్క రోజులోనే.. లేదా కొన్ని గంటల్లోనే డబ్బు రెట్టింపు అవుతుందంటే ఎవరూ నమ్మవద్దని.. డబ్బు మీద అత్యాశను చూసే నేరగాళ్లు మోసం చేస్తారనే విషయం గుర్తుంచుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Tollywood : అక్టోబర్లో రజనీ vs చిరు vs వెంకీ.. గెలుపెవరిది
-
HP HyperX Omen 16: హెచ్ పీ హైపర్ఎక్స్ ఓమెన్ 16 వాలరెంట్ లిమిటెడ్ ఎడిషన్ గేమింగ్ ల్యాప్టాప్ లాంచ్..
-
Hyderabad: ఘట్కేసర్లో విషాదం.. రైలు కిందపడి దంపతుల ఆత్మహత్య!
-
EPFO కొత్త రూల్ .. PF డిపాజిట్పై కీలక మార్పు.. ఎవరికి లాభం?
-
Jupally Krishna Rao: “లెక్క తప్పు ఐతే రాజీనామా చేస్తా”.. కేసీఆర్, కేటీఆర్లకు మంత్రి జూపల్లి సవాల్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!