Proddatur: బుట్టలో పడ్డారా.. అంతే సంగతులు! క్షణాల్లో బురిడీ కొట్టించి ఉడాయింపు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Proddatur: మోసపోయేవాడు ఉంటే.. మన దేశంలో మోసం చేసే వాడికి కొదవే లేదు. డబ్బు మీద అత్యాశ ఉంటే చాలు.. అలాంటి వాళ్లను టార్గెట్ చేస్తున్నారు కేటుగాళ్లు. వారి డబ్బు యావను దృష్టిలో పెట్టుకుని పలు రకాలుగా మోసం చేస్తున్నారు. వారిని అమాయకులను చేసి.. అందిన కాడికి దోచేస్తున్నారు. డబ్బు ఇస్తే.. ఖాతాకు నగదు బదిలీ ద్వారా రెట్టింపు సొమ్ము ఇస్తామని చెబితే.. అట్లాంటి వారిని ఎవరైనా నమ్ముతారా? అలాంటి వారిని నమ్మితే ఏం జరుగుతుంది? సింపుల్.. మోసం చేసి సొమ్ము కొట్టేస్తారు. సరిగ్గా కడప జిల్లా ప్రొద్దుటూరులో ఇదే జరిగింది. రెట్టింపు సొమ్ముకు ఆశపడితే అసలు ఎసరొచ్చింది.
ఎంత ముద్దుగున్నావే.. Maroon కలర్లో Realme Narzo 90x 5G లాంచ్.. ఫీచర్స్ ఏంటంటే?
Also Read
డబ్బు ఇస్తే.. కొద్ది క్షణాల్లోనే రెట్టింపు సొమ్ము ఇస్తాం. అది కూడా ఆన్లైన్లో చెల్లిస్తాం. ఇలా చెప్పి అమాయకులకు వల వేస్తారు నేరగాళ్లు. తమ బుట్టలో పడ్డారా.. అంతే సంగతులు వారిని క్షణాల్లో బురిడీ కొట్టించి ఉన్న సొమ్ము కొట్టేసి ఉడాయిస్తారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఇలాగే జరిగింది. అలా రెట్టింపు డబ్బు ఇస్తామని నమ్మబలికి 33 లక్షల రూపాయల సొమ్ము కాజేసిన అంతర్రాష్ట్ర ముఠాను ప్రొద్దుటూరు పోలీసులు అరెస్ట్ చేశారు.
ప్రొద్దుటూరుకు చెందిన గంగా ప్రసాద్ తన స్నేహితుడి ద్వారా పరిచయమైన పులివెందులకు చెందిన గంగులయ్య మరో నలుగురు కలిసి అంతర్రాష్ట్ర ముఠాను కలిశారు. రూ. 33 లక్షలు నగదు ఇస్తే 50 లక్షల రూపాయలు బ్యాంకు ఖాతాకు వేస్తామని నమ్మబలికారు ముఠా సభ్యులు. గంగా ప్రసాద్ వద్ద నుంచి 33 లక్ష రూపాయలు నగదు తీసుకొని డబ్బు ఒక బ్యాగులో పెట్టి ఆ బ్యాగును ఒక డబుల్ డోర్ బ్రీఫ్ కేస్లో పెట్టారు. బ్యాంకు ఖాతాకు డబ్బు ట్రాన్స్ఫర్ చేయడానికి కుదరలేదని తిరిగి నీ డబ్బు తీసుకొమని చెప్పి అప్పటికే బ్రీఫ్ కేస్లో ఉంచిన చిత్తుకాగితాలు ఉన్న బ్యాగు ఇచ్చారు. తనను మోసం చేస్తున్నారని గమనించిన గంగా ప్రసాద్ తన డబ్బు తిరిగి ఇచ్చేయాలని అడగడంతో కత్తితో బెదిరించి డబ్బుతో ముఠా సభ్యులు ఉడాయించారు.
Dhurandhar OTT Record: ఓటీటీలో ‘ధురంధర్’ జాతర.. వ్యూస్లో దూసుకుపోతున్న యాక్షన్ థ్రిల్లర్!
గత సంవత్సరం జనవరిలో జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముఠా సభ్యులను ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డులో అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 8 లక్షల 50 వేలు నగదు, ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఒక్క రోజులోనే.. లేదా కొన్ని గంటల్లోనే డబ్బు రెట్టింపు అవుతుందంటే ఎవరూ నమ్మవద్దని.. డబ్బు మీద అత్యాశను చూసే నేరగాళ్లు మోసం చేస్తారనే విషయం గుర్తుంచుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
ENG W vs SL W: శతకంతో ‘డ్యానీ వ్యాట్’ వీరవిహారం.. మహిళల టీ20 ప్రపంచకప్లో ఇంగ్లండ్ బోణి.!
-
Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్లో కలకలం.. 22 మంది అధికారుల సస్పెన్షన్
-
Astrology: జూన్ 13 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
-
CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
-
Family Suicide: ఇంత ఘోరమా? ముక్కుపచ్చలారని పసిబిడ్డల పట్ల విలన్గా మారిన తండ్రి
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!