Proddatur: బుట్టలో పడ్డారా.. అంతే సంగతులు! క్షణాల్లో బురిడీ కొట్టించి ఉడాయింపు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Proddatur: మోసపోయేవాడు ఉంటే.. మన దేశంలో మోసం చేసే వాడికి కొదవే లేదు. డబ్బు మీద అత్యాశ ఉంటే చాలు.. అలాంటి వాళ్లను టార్గెట్ చేస్తున్నారు కేటుగాళ్లు. వారి డబ్బు యావను దృష్టిలో పెట్టుకుని పలు రకాలుగా మోసం చేస్తున్నారు. వారిని అమాయకులను చేసి.. అందిన కాడికి దోచేస్తున్నారు. డబ్బు ఇస్తే.. ఖాతాకు నగదు బదిలీ ద్వారా రెట్టింపు సొమ్ము ఇస్తామని చెబితే.. అట్లాంటి వారిని ఎవరైనా నమ్ముతారా? అలాంటి వారిని నమ్మితే ఏం జరుగుతుంది? సింపుల్.. మోసం చేసి సొమ్ము కొట్టేస్తారు. సరిగ్గా కడప జిల్లా ప్రొద్దుటూరులో ఇదే జరిగింది. రెట్టింపు సొమ్ముకు ఆశపడితే అసలు ఎసరొచ్చింది.
ఎంత ముద్దుగున్నావే.. Maroon కలర్లో Realme Narzo 90x 5G లాంచ్.. ఫీచర్స్ ఏంటంటే?
Also Read
- Arms Theft: మద్రాస్ రెజిమెంట్లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Shamli Encounter: అంకిత్ బలియాన్ హత్య కేసులో కీలక మలుపు.. పోలీసుల ఎన్కౌంటర్లో ఇద్దరు నిందితులు హతం
డబ్బు ఇస్తే.. కొద్ది క్షణాల్లోనే రెట్టింపు సొమ్ము ఇస్తాం. అది కూడా ఆన్లైన్లో చెల్లిస్తాం. ఇలా చెప్పి అమాయకులకు వల వేస్తారు నేరగాళ్లు. తమ బుట్టలో పడ్డారా.. అంతే సంగతులు వారిని క్షణాల్లో బురిడీ కొట్టించి ఉన్న సొమ్ము కొట్టేసి ఉడాయిస్తారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఇలాగే జరిగింది. అలా రెట్టింపు డబ్బు ఇస్తామని నమ్మబలికి 33 లక్షల రూపాయల సొమ్ము కాజేసిన అంతర్రాష్ట్ర ముఠాను ప్రొద్దుటూరు పోలీసులు అరెస్ట్ చేశారు.
ప్రొద్దుటూరుకు చెందిన గంగా ప్రసాద్ తన స్నేహితుడి ద్వారా పరిచయమైన పులివెందులకు చెందిన గంగులయ్య మరో నలుగురు కలిసి అంతర్రాష్ట్ర ముఠాను కలిశారు. రూ. 33 లక్షలు నగదు ఇస్తే 50 లక్షల రూపాయలు బ్యాంకు ఖాతాకు వేస్తామని నమ్మబలికారు ముఠా సభ్యులు. గంగా ప్రసాద్ వద్ద నుంచి 33 లక్ష రూపాయలు నగదు తీసుకొని డబ్బు ఒక బ్యాగులో పెట్టి ఆ బ్యాగును ఒక డబుల్ డోర్ బ్రీఫ్ కేస్లో పెట్టారు. బ్యాంకు ఖాతాకు డబ్బు ట్రాన్స్ఫర్ చేయడానికి కుదరలేదని తిరిగి నీ డబ్బు తీసుకొమని చెప్పి అప్పటికే బ్రీఫ్ కేస్లో ఉంచిన చిత్తుకాగితాలు ఉన్న బ్యాగు ఇచ్చారు. తనను మోసం చేస్తున్నారని గమనించిన గంగా ప్రసాద్ తన డబ్బు తిరిగి ఇచ్చేయాలని అడగడంతో కత్తితో బెదిరించి డబ్బుతో ముఠా సభ్యులు ఉడాయించారు.
Dhurandhar OTT Record: ఓటీటీలో ‘ధురంధర్’ జాతర.. వ్యూస్లో దూసుకుపోతున్న యాక్షన్ థ్రిల్లర్!
గత సంవత్సరం జనవరిలో జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముఠా సభ్యులను ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డులో అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 8 లక్షల 50 వేలు నగదు, ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఒక్క రోజులోనే.. లేదా కొన్ని గంటల్లోనే డబ్బు రెట్టింపు అవుతుందంటే ఎవరూ నమ్మవద్దని.. డబ్బు మీద అత్యాశను చూసే నేరగాళ్లు మోసం చేస్తారనే విషయం గుర్తుంచుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Toxic: సొంత గడ్డపైనే యశ్కు షాక్.. ‘టాక్సిక్’ వసూళ్లు చూసి ట్రేడ్ వర్గాలు అవాక్కు!
-
Sonu Sood: నేపాల్ విధ్వంసం చూసి చలించిపోయిన సోనూ సూద్.. బాధితులకు అండగా నిలవాలని విజ్ఞప్తి
-
Pawan Kalyan Birthday: అమలాపురం గడ్డ పవన్ అభిమానుల అడ్డా.. పవర్ స్టార్ పుట్టినరోజు మాకు పండుగే!
-
Emmy Awards 2026: ఈ నెలలోనే 78వ ఎమ్మీ అవార్డ్స్ .. ఎక్కువ నామినేషన్లు అందుకున్న షోలు ఇవే!
-
Congress 1000 Days: కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్షీట్..!
ట్రెండింగ్
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!