Nedurumalli Ram Kumar Reddy: మంత్రి లోకేష్ కూడా ప్రభుత్వ బడులను చూసి ఆశ్చర్యపోయారు!
- వైసీపీ హయాంలో విద్యకు అధిక ప్రాధాన్యం
- పవన్ కళ్యాణ్ ప్రభుత్వ పాఠశాలలు చూసి ఆశ్చర్యపోయారు
- మంత్రి లోకేష్ కూడా ప్రభుత్వ బడులను పొగిడారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీ హయాంలో విద్యకు అధిక ప్రాధాన్యం ఇచ్చారని వెంకటగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అన్నారు. ‘నాడు-నేడు’ కింద ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలను మాజీ సీఎం వైఎస్ జగన్ మార్చారన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రభుత్వ పాఠశాలలు అక్కడ వసతులు చూసి ఆశ్చర్యపోయారన్నారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి లోకేష్ కూడా ప్రభుత్వ బడులను పొగిడారన్నారు. సీఎం చంద్రబాబు అంతా ప్రైవేట్ రంగానికి లబ్ది కలిగిస్తారని నేదురుమల్లి మండిపడ్డారు.
నెల్లూరులో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… ‘వైసీపీ హయాంలో విద్యకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ప్రాథమిక స్థాయిలో ఎన్రోల్మెంట్ పెరిగేందుకు అమ్మఒడి పథకాన్ని అమలు చేశారు. నాడు-నేడు కింద పాఠశాలల రూపు రేఖలు మార్చారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రభుత్వ పాఠశాలలు, అక్కడ వసతులు చూసి ఆశ్చర్యపోయారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి లోకేష్ కూడా ప్రభుత్వ బడులను పొగిడారు. విద్య అనేది మానవ వనరుల అభివృద్ధి. సీఎం చంద్రబాబు మాత్రం సంక్షేమ పథకంగా చూస్తూ.. ఎన్నికల్లో ఒక్కో విద్యార్థికి 18 వేలు ఇస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు డేటా అవసరమని చెబుతూ.. దాన్ని దాట వేస్తున్నారు. రాష్ట్ర వృద్ధి రేటు 14 శాతానికి చేరితే అన్ని పథకాలు అమలు చేస్తామని ఇప్పుడు అంటున్నారు. అంటే పథకాలను అమలు చేయబోమని పరోక్షంగా చెబుతున్నారు’ అని మండిపడ్డారు.
Also Read
- CM Chandrababu: టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు క్లాస్.. సమన్వయంపై ప్రత్యేక దృష్టి
- EPFO గుడ్ న్యూస్.. PF ఖాతాల్లో వడ్డీ జమ.. మీ ఖాతాలో పడిందా? వెంటనే చెక్ చేసుకోండి
- Anna Lezhneva: అప్పుడు కొడుకు కోసం.. ఇప్పుడు భర్త కోసం.! కాలినడకన తిరుమల కొండెక్కిన డిప్యూటీ సీఎం భార్య.!
- Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
‘పిల్లలకు చదువు ఎంతో ముఖ్యం.. దానికి గండి కొట్టడం సరికాదు. వైఎస్ జగన్ హయాంలో ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వలేదు.. ఇప్పుడు ఎందుకు ఇవ్వాలనే ధోరణిలో మంత్రి లోకేష్ వున్నారు. 2019 నాటికి టీడీపీ ప్రభుత్వం పెట్టిన బకాయిలను జగన్ అధికారంలోకి వచ్చి చెల్లించారు. జగన్ వచ్చిన తరువాత విద్యకు జీడీపీలో రెట్టింపు నిధులు ఇచ్చారు. 2047 విజన్ అంటున్నారు.. ఇప్పుడు విద్యా రంగాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. విద్యార్థులు లేకుండా విజన్ 2047 ఎలా సాధిస్తారు?. చంద్రబాబు అంతా ప్రైవేట్ రంగానికి లబ్ది కలిగిస్తారు. అందుకే హెరిటేజ్ లాభాల్లో ఉండగా.. ప్రభుత్వ రంగానికి చెందిన విజయడైరీ మాత్రం నష్టాల్లో ఉంది. ఇదీ చంద్రబాబు పాలన. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు, తగిన నిర్ణయం తీసుకుంటారు’ అని రామ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
PV Sindhu: సెమీస్లో అదరగొట్టిన పీవీ సింధు.. జపాన్ ఓపెన్ టైటిల్కు ఒక్క అడుగు దూరంలో
-
CM Chandrababu: టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు క్లాస్.. సమన్వయంపై ప్రత్యేక దృష్టి
-
Malayalam Thriller: థియేటర్లలో వణికించిన మలయాళ థ్రిల్లర్ ఓటీటీలోకి… తెలుగులోనూ స్ట్రీమింగ్!
-
RBI Polymer Notes: దేశంలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. రూ.10, రూ.20 నోట్లపై ఆర్బీఐ భారీ సన్నాహాలు
-
EPFO గుడ్ న్యూస్.. PF ఖాతాల్లో వడ్డీ జమ.. మీ ఖాతాలో పడిందా? వెంటనే చెక్ చేసుకోండి
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!