Minister Narayana: తప్పులు చేసిన వారిపైనే ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది..
- తప్పులు చేసిన వారిపైనే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది..
- గత వైసీపీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను సర్వ నాశనం చేసింది..
- మరో ఆరు నెలల్లో అభివృద్ధి ఊపందుకుంటుంది: మంత్రి నారాయణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Narayana: నెల్లూరులో వివిద శాఖల అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలపై కక్ష సాధింపుతో వ్యవహరించారు.. అందులో నేను కూడా బాధితుడినే అన్నారు. కానీ, ఇప్పుడు తప్పులు చేసిన వారిపైనే ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది చెప్పారు. గతంలో మాదిరిగా అర్ధరాత్రి అరెస్టులు చేయడం లేదన్నారు. రాష్ర్ట అభివృద్ధికి శాంతి భద్రతలు ఎంతో ముఖ్యం.. దానిపైనే ప్రభుత్వం దృష్టి పెట్టింది.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అన్నింటినీ అమలు చేస్తామని తేల్చి చెప్పారు. కొన్ని రోజులు ఆగితే అన్నే వస్తాయి.. తల్లికి వందనం పథకం కూడా అమలు చేస్తారు.. ప్రతిపక్ష హోదా లేని వాళ్ళు మాట్లాడుతున్నారు అంటూ మంత్రి నారాయణ విమర్శలు గుప్పించారు.
Read Also: Vijayawada: ట్రాఫిక్ సీఐతో వాహనదారుడు వితండ వాదం.. ఐడీ కార్డు చూపించాలంటూ..!
Also Read
- CM Chandrababu: తీరం మనదే.. బోటు మనదే.. వేట కూడా మనదే.. ఎవరైనా వస్తే వేటాడుతాం.. వెంటాడుతాం..
- Lemon Price Hike : నిమ్మ రైతుల పంట పండింది.. కిలో రూ.200
- YS Jagan: దేవుడు అన్నీ చూస్తున్నాడు.. కళ్లు మూసుకుని తెరిచేలోపే మన ప్రభుత్వం వస్తుంది..!
- YS Jagan to Visit Juvvaladinne Fishing Harbour: నేడు జువ్వలదిన్నెకు వైఎస్ జగన్
ఇక, అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ బడ్జెట్ రూపొందించామని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. మున్సిపాలిటీలకు వివిధ రకాలుగా వచ్చే ఆదాయాన్ని ఆయా మున్సిపాలిటీల అభివృద్ధికే వెచ్చిస్తామన్నారు. ఏప్రిల్ 1 నుంచి ఇది అమలులోకి వస్తుంది.. గత ప్రభుత్వ హయాంలో నిధులన్నీ సీఎఫ్ఎంఎస్ కు వెళ్ళేవి.. దీని వల్ల చిన్న పనులకు కూడా ఇబ్బంది పడ్డారు.. 15వ ఆర్థిక సంఘం నిధులను కూడా దారి మళ్లించారు అని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలోని అన్ని ఇళ్లకూ మంచి నీటి కుళాయిని ఇస్తాం.. మూడేళ్ళలో ఈ పథకాన్ని పూర్తి చేస్తామన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను బ్రష్టు పట్టించింది అని వెల్లడించారు. తమ ప్రభుత్వం దాన్ని గాడిలో పెడుతుంది.. మరో ఆరు నెలల్లో అభివృద్ధి ఊపందుకుంటుంది అని నారాయణ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
-
Family Suicide: ఇంత ఘోరమా? ముక్కుపచ్చలారని పసిబిడ్డల పట్ల విలన్గా మారిన తండ్రి
-
TCS Engineer Suicide: TCSలో సీనియర్ల వేధింపులు.. ఉద్యోగి ఆత్మహత్య..
-
Fenya: ‘అమమ్మ’ అంటే డబ్బు, ‘చెత్త’ అంటే పోలీసులు..! దొంగలకు ఆయుధంగా మారిన రహస్య భాష..
-
Netanyahu: నేను ప్రధానిగా ఉన్నంత కాలం ఇరాన్ అణ్వస్త్రంగా మారదు.. నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!