Minister Narayana: తప్పులు చేసిన వారిపైనే ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది..
- తప్పులు చేసిన వారిపైనే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది..
- గత వైసీపీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను సర్వ నాశనం చేసింది..
- మరో ఆరు నెలల్లో అభివృద్ధి ఊపందుకుంటుంది: మంత్రి నారాయణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Narayana: నెల్లూరులో వివిద శాఖల అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలపై కక్ష సాధింపుతో వ్యవహరించారు.. అందులో నేను కూడా బాధితుడినే అన్నారు. కానీ, ఇప్పుడు తప్పులు చేసిన వారిపైనే ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది చెప్పారు. గతంలో మాదిరిగా అర్ధరాత్రి అరెస్టులు చేయడం లేదన్నారు. రాష్ర్ట అభివృద్ధికి శాంతి భద్రతలు ఎంతో ముఖ్యం.. దానిపైనే ప్రభుత్వం దృష్టి పెట్టింది.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అన్నింటినీ అమలు చేస్తామని తేల్చి చెప్పారు. కొన్ని రోజులు ఆగితే అన్నే వస్తాయి.. తల్లికి వందనం పథకం కూడా అమలు చేస్తారు.. ప్రతిపక్ష హోదా లేని వాళ్ళు మాట్లాడుతున్నారు అంటూ మంత్రి నారాయణ విమర్శలు గుప్పించారు.
Read Also: Vijayawada: ట్రాఫిక్ సీఐతో వాహనదారుడు వితండ వాదం.. ఐడీ కార్డు చూపించాలంటూ..!
Also Read
- CM Chandrababu: 'మావిగన్ అంటే నాకే అర్థం కావడం లేదు'.. జగన్పై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు..
- Nellore: కోడూరు బీచ్లో విషాదం.. ముగ్గురు గల్లంతు.. బాలుడి మృతి
- CM Chandrababu: తీరం మనదే.. బోటు మనదే.. వేట కూడా మనదే.. ఎవరైనా వస్తే వేటాడుతాం.. వెంటాడుతాం..
- Lemon Price Hike : నిమ్మ రైతుల పంట పండింది.. కిలో రూ.200
ఇక, అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ బడ్జెట్ రూపొందించామని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. మున్సిపాలిటీలకు వివిధ రకాలుగా వచ్చే ఆదాయాన్ని ఆయా మున్సిపాలిటీల అభివృద్ధికే వెచ్చిస్తామన్నారు. ఏప్రిల్ 1 నుంచి ఇది అమలులోకి వస్తుంది.. గత ప్రభుత్వ హయాంలో నిధులన్నీ సీఎఫ్ఎంఎస్ కు వెళ్ళేవి.. దీని వల్ల చిన్న పనులకు కూడా ఇబ్బంది పడ్డారు.. 15వ ఆర్థిక సంఘం నిధులను కూడా దారి మళ్లించారు అని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలోని అన్ని ఇళ్లకూ మంచి నీటి కుళాయిని ఇస్తాం.. మూడేళ్ళలో ఈ పథకాన్ని పూర్తి చేస్తామన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను బ్రష్టు పట్టించింది అని వెల్లడించారు. తమ ప్రభుత్వం దాన్ని గాడిలో పెడుతుంది.. మరో ఆరు నెలల్లో అభివృద్ధి ఊపందుకుంటుంది అని నారాయణ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
-
Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
-
Telangana Police : మాజీ డీజీపీలకు షాక్.. బుల్లెట్ప్రూఫ్ కార్లు వెనక్కి.!
-
Harish Rao : జూపల్లి మాట మార్చారు.. చర్చకు రాకుండా తప్పించుకున్నారు
-
Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!