కొత్తగ కొలువు తీరిన లోక్ సభ స్పీకర్ ఎన్నికకు సంబంధించి రాజకీయ ఉత్కంఠ కొనసాగుతోంది. అభ్యర్థుల మధ్య గట్టి పోటీ కనిపిస్తోంది. అభ్యర్థులు మంగళవారం మధ్యాహ్నం 12 గంటలలోపు నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది. స్పీకర్గా ఓం బిర్లాకు మరోసారి అవకాశం ఇవ్వాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కాసేపు ఎన్డీయే కూటమితో చర్చించనుంది 11.30 గంటలకు ఎన్డీయే సమావేశం ఉంది. ఈరోజు స్పీకర్ పేరును బీజేపీ ప్రతిపాదించనుంది. ఇప్పటికే మిత్రపక్షాలతో స్పీకర్ ఎంపికపై చర్చించారు…
Suryakanta Patil: మహారాష్ట్రలో లోక్సభ ఎన్నికల్లో పేలవమైన పనితీరు కనబరిచిన బీజేపీకి షాక్ తగిలింది. మాజీ కేంద్ర మంత్రి సూర్యకాంత పాటిల్ కాషాయ పార్టీకి గుడ్బై చెప్పారు. బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి ఆమె రాజీనామా చేశారు. గత 10 ఏళ్లలో తానను చాలా నేర్చుకున్నానని, ఇందుకు పార్టీకి కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆమె రాజీనామా తర్వాత అన్నారు.
కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఓ వైపు కేంద్రం కసరత్తు మొదలు పెడుతూనే మరోవైపు రకరకాల వ్యూహాలకు సంబంధించి రౌండ్ సమావేశాలు కూడా సాగుతున్నాయి. ఈ క్రమంలో పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇంట్లో ఆదివారం భారీ సమావేశం జరిగింది.
ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కీలక అధికారుల మార్పులు జరుగుతున్నాయి. తాజాగా, టీటీడీ ఈవోగా సీనియర్ ఐఏఎస్ అధికారి జే శ్యామలల రావు నియమితులయ్యారు. ఇంతవరకు ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ఆయనకు ఇప్పుడు ఈ బాధ్యతలు అప్పగించబడ్డాయి. ఇదివరకు ఈవోగా ఉన్న ధర్మారెడ్డిని ప్రభుత్వం బదిలీ చేసింది మరికొన్ని విషయాలు కోసం డిస్క్రిప్షన్ లో వీడియో చుడండి.
Maharashtra: మహారాష్ట్రలో లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఎన్డీయేలో భాగంగా ఉన్న బీజేపీ, ఎన్సీపీ(అజిత్ పవార్) పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. పొత్తుకు బీటలు వస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్డీయే కూటమి కన్నా ఇండియా కూటమి ఎక్కువ సీట్లు గెలుచుకోవడంతో ఒక్కసారిగా బీజేపీ, ఎన్సీపీ మధ్య తీవ్ర విభేదాలు కనిపిస్తున్నాయి.
RSS: బీజేపీ సైద్ధాంతిక సంస్థ ఆర్ఎస్ఎస్ వరసగా ఆ పార్టీపై విమర్శలు చేస్తోంది. ఈ ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా మెజారిటీ రాలేదు. 543 సీట్లున్న లోక్సభలో మెజారిటీ 272 సీట్లు కాగా, కమలానికి 240 సీట్లు మాత్రమే వచ్చాయి.
ఈనెల 24 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. రెండ్రోజుల పాటు ఎంపీల ప్రమాణస్వీకారం ఉండనుంది. 24, 25 తేదీల్లో ఎంపీలంతా ప్రమాణం చేయనున్నారు. ఇదిలా ఉంటే కొత్త ఎంపిక జరిగేంత వరకు ప్రొటెం స్పీకర్ ఉండనున్నారు.
PM Narendra Modi Portfolios: దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ ఆదివారం (జూన్ 9) సాయంత్రం ప్రమాణం చేశారు. 2014, 2019 ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం తర్వాత రెండుసార్లు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోడీ.. 2024 ఎన్నికల్లో ఎన్డీయే కూటమి గెలుపుతో వరుసగా మూడోసారి పీఠమెక్కిన ఘనత సాధించారు. మోడీ 3.0 సర్కార్ కొలువుల్లో కీలక పదవులు మళ్లీ బీజేపీ సీనియర్ నేతలనే వరించాయి. ఇక ఎన్డీయే భాగస్వామ్య పార్టీలకు తగిన రీతిలో శాఖలను కేటాయించారు.…