Suryakanta Patil: బీజేపీకి రాజీనామా చేసిన మాజీ కేంద్రమంత్రి..
- మహారాష్ట్రలో బీజేపీకి షాక్..
- మాజీ కేంద్రమంత్రి రాజీనామా..
- ఈ రోజు రాజీనామా చేసిన సూర్యకాంత పాటిల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suryakanta Patil: మహారాష్ట్రలో లోక్సభ ఎన్నికల్లో పేలవమైన పనితీరు కనబరిచిన బీజేపీకి షాక్ తగిలింది. మాజీ కేంద్ర మంత్రి సూర్యకాంత పాటిల్ కాషాయ పార్టీకి గుడ్బై చెప్పారు. బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి ఆమె రాజీనామా చేశారు. గత 10 ఏళ్లలో తానను చాలా నేర్చుకున్నానని, ఇందుకు పార్టీకి కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆమె రాజీనామా తర్వాత అన్నారు. 2014లో శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ నుంచి బీజేపీలో చేరారు. సూర్యకాంత పాటిల్ హింగోలి-నాందేడ్ నియోజకవర్గాల నుంచి నాలుగు సార్లు ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఆమె గ్రామీణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు.
Read Also: Harish Rao : సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ
Also Read
- New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
- Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
- Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
- Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఆమె మరఠ్వాడాలోని హింగోలి నియోజకవర్గం నుంచి పార్టీ తరుపున పోటీ చేయాలని భావించారు. అయితే, పొత్తులో భాగంగా ఈ సీటును ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు దక్కింది. దీంతో ఆమెకు టికెట్ లభించలేదు. తాను పోటీలో లేకపోవడంపై సోషల్ మీడియా వేదికగా ఆమె తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో బీజేపీ ఆమెకు హద్గావ్ హిమాయత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ పోల్ చీఫ్గా బాధ్యతలు అప్పగించింది. ఇదిలా ఉంటే ఉద్ధవ్ ఠాక్రే వర్గం అభ్యర్థి చేతిలో శివసేన అభ్యర్థి ఈ సీటు నుంచి ఓడిపోయారు.
లోక్సభ ఎన్నికల్లో అత్యంత కీలకమైన మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. 48 ఎంపీ సీట్లలో ఎన్డీయే కూటమి 18 స్థానాల్లోనే గెలిచింది. ఇందులో బీజేపీ -10, ఏక్నాథ్ షిండే శివసేన-07, అజిత్ పవార్ ఎన్సీపీ-01 సీట్లను గెలుచుకుంది. ఇండియా కూటమి మొత్తం 29 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్-13, ఉద్ధవ్ ఠాక్రే శివసేన-09, అజిత్ పవార్ ఎన్సీపీ-07 సీట్లను గెలుచుకుంది.
తాజావార్తలు
-
AUS vs BAN: మ్యాచ్ పోయే.. సిరీస్ పోయే.! ఆసీస్ పని అయిపోయిందా.?
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!