Lok Sabha Speaker Election: స్పీకర్ ఎన్నికలో బిగ్ ట్విస్ట్..! ఎన్డీఏకు వైసీపీ మద్దతు
- లోక్సభ స్పీకర్ ఎన్నికల వేళ జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు..
- తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని వైసీపీని కోరిన బీజేపీ..
- సానుకూలంగా స్పందించింది వైసీపీ..
- వైసీపీ సభ్యుల సపోర్ట్తో 297కు పెరిగిన ఎన్డీఏ బలం ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lok Sabha Speaker Election: లోక్సభ స్పీకర్ ఎన్నికల వేళ జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి.. తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కోరింది భారతీయ జనతా పార్టీ.. దీనిపై సానుకూలంగా స్పందించింది వైసీపీ.. అయితే, లోక్సభ స్పీకర్ ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని వైసీపీ నిర్ణయించడం ఆసక్తికరంగా మారింది.. దీంతో, ఎన్డీఏ అభ్యర్థికి మరింత బలం పెరిగింది.. వైసీపీకి లోక్సభలో నలుగురు ఎంపీలు ఉన్నారు.. ఎన్డీఏకు ఇప్పటికే 293 సభ్యుల బలం ఉంది.. వైసీపీ సభ్యుల సపోర్ట్తో ఎన్డీఏ బలం 297కు పెరిగినట్టు అయ్యింది.
Read Also: Kidney Stones : కిడ్నీలో రాళ్లున్నాయా..? అయితే ఇలా చెక్ చెప్పండి..
Also Read
- Petrol Diesel Price Hike: పెట్రోల్-డీజిల్ ధరలపై భారీ హెచ్చరికలు.. మరోసారి పెరుగుతాయా?
- Summer Special Cooling Tea Recipe: మీ శరీరాన్ని టీ కూల్ చేస్తుంది.. ఈ మూడు కలిపితే చాలు..
- Mohammed Kala Basha: ‘కుర్చీ తాత’ ఇక లేరు.. ఒక్క డైలాగ్తో చరిత్ర సృష్టించిన బాషా గురించి ఆసక్తికర విషయాలు..
- TDP Politburo Meeting: నేడు టీడీపీ పొలిట్బ్యూరో కీలక భేటీ.. మహానాడు ఏర్పాట్లపై ప్రధాన చర్చ
కాగా, అటు ఎన్డీఏ.. ఇటు ఇండియా కూటమిలో లేకుండా తటస్థంగా ఉంది వైసీపీ.. ఇప్పుడు స్పీకర్ ఎన్నిక విషయంలో అనూహ్యంగా ఎన్డీఏకు బయటి నుంచే మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది..ఈ పరిణామం.. జాతీయ రాజకీయాల్లోనే కాకుండా.. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లోనూ ఆసక్తికరంగా ఉంది.. ఎన్డీఏ కూటమిలో బీజేపీ బలం 240 స్థానాలు మాత్రమే.. మ్యాజిక్ ఫిగర్ 272కి 32 స్థానాలు తక్కువగా ఉన్నాయి.. దీంతో.. టీడీపీ 16 సీట్లు, జేడీయూ 12 సీట్లు కలుపుకుంటేనే ఎన్డీఏకు మ్యాజిక్ ఫిగర్ దక్కుతుంది. అయితే, స్పీకర్ ఎన్నికల్లో ఇండియా కూటమి ఎత్తుగడలు వేస్తుండడంతో.. అత్యంత అప్రమత్తం అయ్యింది బీజేపీ.. ఎందుకైనా మంచిది అంటూ.. వైసీపీ లాంటి తటస్థ పార్టీల మద్దతు అడుగుతుంది. స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం చేయాలన్న సాంప్రదాయంలో భాగంగా అన్ని పార్టీల మద్దతు కోరడం ఆనవాయితీ.. ఇందులో భాగంగానే వైసీపీ మద్దతు అడిగింది బీజేపీ.. అయితే, ఎన్డీఏ కూటమిలో టీడీపీ ఉండడంతో.. వైసీపీ మద్దతు ఎవరికి? అనే సస్పెన్స్ కొనసాగింది.. కానీ, ఆ ఉత్కంఠకు తెరదించిన వైసీపీ.. ఎన్డీఏకు మద్దతు ప్రకటించింది.. స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం కావాలన్న ఉద్దేశంతోనే వైసీపీ మద్దతు ప్రకటించినట్టుగా తెలుస్తోంది. కాగా, రేపు లోక్సభ స్పీకర్ ఎన్నిక జరగనున్న విషయం విదితమే.
తాజావార్తలు
-
Petrol Diesel Price Hike: పెట్రోల్-డీజిల్ ధరలపై భారీ హెచ్చరికలు.. మరోసారి పెరుగుతాయా?
-
Mega brothers at Mega158 Launch: ఒకే ఫ్రేమ్లో మెగా బ్రదర్స్ .. చిరు – బాబి మూవీ ఓపెనింగ్లో ‘మెగా’ హ్యాపీనెస్
-
Ajinkya Rahane: “మా విజయ రహస్యం ఇదే”.. కేకేఆర్ డ్రెస్సింగ్ రూమ్ సీక్రెట్స్ బయటపెట్టిన కెప్టెన్ రహానే
-
Rohit Sharma: ఇదో చెత్త సీజన్, నేను ఇంకా చెత్తగా ఆడాను.. రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Summer Special Cooling Tea Recipe: మీ శరీరాన్ని టీ కూల్ చేస్తుంది.. ఈ మూడు కలిపితే చాలు..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!