Lok Sabha Speaker Election: స్పీకర్ ఎన్నికలో బిగ్ ట్విస్ట్..! ఎన్డీఏకు వైసీపీ మద్దతు
- లోక్సభ స్పీకర్ ఎన్నికల వేళ జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు..
- తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని వైసీపీని కోరిన బీజేపీ..
- సానుకూలంగా స్పందించింది వైసీపీ..
- వైసీపీ సభ్యుల సపోర్ట్తో 297కు పెరిగిన ఎన్డీఏ బలం ..
Lok Sabha Speaker Election: లోక్సభ స్పీకర్ ఎన్నికల వేళ జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి.. తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కోరింది భారతీయ జనతా పార్టీ.. దీనిపై సానుకూలంగా స్పందించింది వైసీపీ.. అయితే, లోక్సభ స్పీకర్ ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని వైసీపీ నిర్ణయించడం ఆసక్తికరంగా మారింది.. దీంతో, ఎన్డీఏ అభ్యర్థికి మరింత బలం పెరిగింది.. వైసీపీకి లోక్సభలో నలుగురు ఎంపీలు ఉన్నారు.. ఎన్డీఏకు ఇప్పటికే 293 సభ్యుల బలం ఉంది.. వైసీపీ సభ్యుల సపోర్ట్తో ఎన్డీఏ బలం 297కు పెరిగినట్టు అయ్యింది.
Read Also: Kidney Stones : కిడ్నీలో రాళ్లున్నాయా..? అయితే ఇలా చెక్ చెప్పండి..
Also Read
- Employees: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న బేసిక్ పే...
- Aadhar Update Charges: ఆధార్ అప్డేట్ చేసుకోవాలా..? అయితే కొత్త ఛార్జీలపై ఓ లుక్కేయండి..
- West Bengal Exit Poll 2026: బెంగాల్ లేటెస్ట్ ఎగ్జిట్ పోల్.. బీజేపీదే అధికారం..
- Sajjala Ramakrishna Reddy: ఓట్లు తొలగింపుపై జాగ్రత్త.. వైసీపీ నేతలకు సజ్జల కీలక సూచనలు..
కాగా, అటు ఎన్డీఏ.. ఇటు ఇండియా కూటమిలో లేకుండా తటస్థంగా ఉంది వైసీపీ.. ఇప్పుడు స్పీకర్ ఎన్నిక విషయంలో అనూహ్యంగా ఎన్డీఏకు బయటి నుంచే మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది..ఈ పరిణామం.. జాతీయ రాజకీయాల్లోనే కాకుండా.. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లోనూ ఆసక్తికరంగా ఉంది.. ఎన్డీఏ కూటమిలో బీజేపీ బలం 240 స్థానాలు మాత్రమే.. మ్యాజిక్ ఫిగర్ 272కి 32 స్థానాలు తక్కువగా ఉన్నాయి.. దీంతో.. టీడీపీ 16 సీట్లు, జేడీయూ 12 సీట్లు కలుపుకుంటేనే ఎన్డీఏకు మ్యాజిక్ ఫిగర్ దక్కుతుంది. అయితే, స్పీకర్ ఎన్నికల్లో ఇండియా కూటమి ఎత్తుగడలు వేస్తుండడంతో.. అత్యంత అప్రమత్తం అయ్యింది బీజేపీ.. ఎందుకైనా మంచిది అంటూ.. వైసీపీ లాంటి తటస్థ పార్టీల మద్దతు అడుగుతుంది. స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం చేయాలన్న సాంప్రదాయంలో భాగంగా అన్ని పార్టీల మద్దతు కోరడం ఆనవాయితీ.. ఇందులో భాగంగానే వైసీపీ మద్దతు అడిగింది బీజేపీ.. అయితే, ఎన్డీఏ కూటమిలో టీడీపీ ఉండడంతో.. వైసీపీ మద్దతు ఎవరికి? అనే సస్పెన్స్ కొనసాగింది.. కానీ, ఆ ఉత్కంఠకు తెరదించిన వైసీపీ.. ఎన్డీఏకు మద్దతు ప్రకటించింది.. స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం కావాలన్న ఉద్దేశంతోనే వైసీపీ మద్దతు ప్రకటించినట్టుగా తెలుస్తోంది. కాగా, రేపు లోక్సభ స్పీకర్ ఎన్నిక జరగనున్న విషయం విదితమే.
తాజావార్తలు
-
Employees: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న బేసిక్ పే…
-
Aadhar Update Charges: ఆధార్ అప్డేట్ చేసుకోవాలా..? అయితే కొత్త ఛార్జీలపై ఓ లుక్కేయండి..
-
West Bengal Exit Poll 2026: బెంగాల్ లేటెస్ట్ ఎగ్జిట్ పోల్.. బీజేపీదే అధికారం..
-
Mangli: వివాదాల నడుమ మంగ్లీ కొత్త సాంగ్ రిలీజ్
-
IPL 2026 సీజన్లో 41 మ్యాచ్ల్లోనే 10 సార్లు 200+ రన్ ఛేజ్.. ఐపీఎల్ స్వరూపాన్నే మార్చేసిన ఒకే ఒక్క రూల్ ఇదే..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!