Maharashtra: మహారాష్ట్రలో బీజేపీ-ఎన్సీపీ పొత్తుకు బీటలు.. మంట పెట్టిన ఆర్ఎస్ఎస్ కథనం..
- మహారాష్ట్రలో రాజకీయ ప్రకంపలను..
- బీజేపీ-ఎన్సీపీ మధ్య విభేదాలు..
- మంట పెట్టిన ఆర్ఎస్ఎస్ ఆర్టికల్..
- లోక్సభ ప్రదర్శనపై మాటల యుద్ధం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra: మహారాష్ట్రలో లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఎన్డీయేలో భాగంగా ఉన్న బీజేపీ, ఎన్సీపీ(అజిత్ పవార్) పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. పొత్తుకు బీటలు వస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్డీయే కూటమి కన్నా ఇండియా కూటమి ఎక్కువ సీట్లు గెలుచుకోవడంతో ఒక్కసారిగా బీజేపీ, ఎన్సీపీ మధ్య తీవ్ర విభేదాలు కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 48 సీట్లలో ఎన్డీయే కూటమి 17 సీట్లు(బీజేపీ 09, శివసేన షిండే 07, ఎన్సీపీ అజిత్ పవార్ 01) గెలుచుకుంటే, ఇండియా కూటమి 30( కాంగ్రెస్ 13, శివసేన ఉద్ధవ్ 09, ఎన్సీపీ శరద్ పవార్ 08) స్థానాలను గెలుచుకుంది.
ఇదిలా ఉంటే, మరోవైపు ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్న సమయంలో రాజకీయాలు వేగంగా మారతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటిరిగా పోటీ చేయాలా వద్దా అనేదాన్ని అంచనా వేయడానికి బీజేపీ అంతర్గత సర్వే ప్రారంభించింది. ఇదిలా ఉంటే బీజేపీ సైద్ధాంతిక సంస్థ ఆర్ఎస్ఎస్ ఈ పొత్తును అంగీకరించడం లేదు. ప్రస్తుతం ఆర్ఎస్ఎస్ పత్రిక ‘ఆర్గనైజర్’లో వచ్చిన కథనం ఇరు పార్టీల మధ్య దూరాన్ని మరింతగా పెంచుతోంది.
Also Read
- Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
- Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
- CM Yogi: "ఎవ్వరినీ వదిలి పెట్టను".. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
- Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
Read Also: Sikkim Landslides: సిక్కింలో విరిగిపడ్డ కొండచరియలు.. ఆరుగురు మృతి… ప్రమాదంలో 1500 మంది
‘‘ఈ అనాలోచిత చర్య ఎందుకు తీసుకున్నారు? ఈ కాంగ్రెస్ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఏళ్ల తరబడి పోరాడినందుకు బిజెపి మద్దతుదారులు గాయపడ్డారు మరియు హింసించబడ్డారు. ఒక్క దెబ్బతో బిజెపి తన బ్రాండ్ విలువను తగ్గించుకుంది’’ అని ఆర్ఎస్ఎస్ రతన్ శారదా కథనంలో రాశారు. అనమసరమైన రాజకీయాలకు, అవకతవకలకు మహారాష్ట్ర మంచి ఉదాహారణ అని, బాగా పనిచేసిన పార్లమెంటీరియన్ల కన్నా ఆలస్యంగా వచ్చిన వారిని ఆదరించారని ఆర్టికల్ పేర్కొంది.
ఇదిలా ఉంటే ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ ఈ కథనం రెండు పక్షాల మధ్య బాగా లేదనేదానికి సంకేతంగా భావించొద్దని అన్నారు. ఇదిలా ఉంటే ఎన్సీపీ యువజన విభాగం నాయకుడు సూరచ్ చవాన్ మాట్లాడుతూ.. బీజేపీ పనితీరు కనబరిచినప్పుడు ఆ క్రెడిట్ ఆర్ఎస్ఎస్కి ఇవ్వబడుతోందని, ఓడితే అజిత్ పవార్ని నిందిస్తు్న్నారని అన్నారు. దీనిపై బీజేపీ నతే ప్రవీణ్ దారేకర్ స్పందిస్తూ..”ఆర్ఎస్ఎస్ మనందరికీ తండ్రి లాంటిది. ఆర్ఎస్ఎస్ గురించి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం లేదు. సూరజ్ చవాన్ సంస్థపై వ్యాఖ్యానించడానికి తొందరపడి ఉండకూడదు.’’ అని అన్నారు.
ఇదిలా ఉంటే ఎన్సీపీ సీనియర్ నేత, మంత్రి ఛగన్ భుజ్బల్ మాట్లాడుతూ.. లోక్సభ ఎన్నికల్లో 48 స్థానాలకు గానూ మాకు (ఎన్సీపీ) కేవలం 4 సీట్లు మాత్రమే ఇచ్చారని, ఇందులో రాయ్గఢ్ మాత్రమే గెలుచుకున్నామని, బీజేపీ కూడా పలు రాష్ట్రాల్లో సీట్లను కోల్పోయిందని, ఉత్తర్ ప్రదేశ్లో ఆ పార్టీకి సీట్లు తగ్గుతాయని ఎవరూ అనుకోలేదని అన్నారు.
తాజావార్తలు
-
Sanjay Jaju : తెలంగాణ నూతన సీఎస్ గా సంజయ్ జాజు నియామకం
-
Varanasi Update: ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. ఈ సెప్టెంబర్ నాటికే..!
-
Shah Rukh Khan: ‘నా భర్త కంటే మీరే ఇష్టం’.. మహిళా అభిమాని మాటకు షారుఖ్ ఇచ్చిన సమాధానం వైరల్
-
Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!