మతం మారిన దళితులకు పెద్ద షాక్ ఎదురుకావచ్చు. ఇస్లాం, క్రైస్తవ మతంలోకి మారిన వారికి ఎస్సీ హోదా ఇవ్వడాన్ని ఎన్సిఎస్సి అంటే నేషనల్ షెడ్యూల్డ్ క్యాస్ట్ కమిషన్ వ్యతిరేకిస్తుందని వార్తలు వస్తున్నాయి. మతం మారిన దళితులకు ఎస్సీ హోదా కల్పించడంపై విచారణ జరిపిన విచారణ కమిషన్కు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏడాది పొడిగించిన సంగతి తెలిసిందే.
Sandeshkhali Clashes: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని సందేశ్ఖలీ ప్రాంతం అట్టుడుకుతోంది. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేత షేక్ షాజహాన్, అతని గుండాల అకృత్యాలపై అక్కడి మహిళలు, యువత భగ్గుమంటోంది. నేరస్తులను వెంటనే అరెస్ట్ చేయాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆందోళనలకు బీజేపీ మద్దతు తెలుపుతోంది. మరోవైపు ఈ అల్లర్ల వెనక ఆర్ఎస్ఎస్ ఉందని బెంగాల్ సీఎం, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ ఆరోపిస్తున్నారు.