NCSC: మతం మారిన దళితులకు షాక్.. ఎస్సీ హోదా రద్దు చేసే అవకాశం?
- మతం మారిన దళితులకు షాక్
- ఎస్సీ హోదా రద్దు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం?
- నేషనల్ షెడ్యూల్డ్ క్యాస్ట్ కమిషన్ ప్రెసిడెంట్ కిషోర్ మక్వానా వెల్లడి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మతం మారిన దళితులకు పెద్ద షాక్ ఎదురుకావచ్చు. ఇస్లాం, క్రైస్తవ మతంలోకి మారిన వారికి ఎస్సీ హోదా ఇవ్వడాన్ని ఎన్సిఎస్సి అంటే నేషనల్ షెడ్యూల్డ్ క్యాస్ట్ కమిషన్ వ్యతిరేకిస్తుందని వార్తలు వస్తున్నాయి. మతం మారిన దళితులకు ఎస్సీ హోదా కల్పించడంపై విచారణ జరిపిన విచారణ కమిషన్కు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏడాది పొడిగించిన సంగతి తెలిసిందే. ఎన్సిఎస్సి ప్రెసిడెంట్ కిషోర్ మక్వానా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టికల్ 341 రాజ్యాంగం (షెడ్యూల్డ్ ట్రైబ్స్) ఆర్డర్ 1950 ప్రకారం.. హిందూ మతం, సిక్కు లేదా బౌద్ధమతం కాకుండా ఇతర మతాన్ని ప్రకటించే ఏ వ్యక్తినైనా షెడ్యూల్డ్ కులంలో సభ్యుడుగా పరిగణించరాదని పేర్కొన్నారు. 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం హిందూ, సిక్కు, బౌద్ధ వర్గాలకు చెందిన దళితులను మాత్రమే ఎస్సీ జాబితాలో సభ్యులుగా పరిగణించవచ్చన్నారు. మతం మారిన దళితులందరికీ ఎస్సీ హోదా కల్పించవచ్చో లేదో పరిశీలించడానికి విచారణ కమిషన్కు కేంద్రం ఒక సంవత్సరం పొడిగింపును మంజూరు చేసిన ఒక రోజు తర్వాత ప్యానెల్ హెడ్ యొక్క వాదన వచ్చింది.
READ MORE: Sridevi: రజనీకాంత్ తో శ్రీదేవి పెళ్లి ప్లాన్? బోనీ కపూర్ వల్ల మొత్తం మటాష్!
Also Read
- Green Chillies Storage Tips: ఈ సింపుల్ ట్రిక్ చాలు.. పచ్చిమిరపకాయలు వారాల తరబడి ఫ్రెష్గా ఉంటాయి
- IND vs ENG: మ్యాచ్ రద్దు.. భారత్ బ్యాటింగ్లో కనిపించిన కీలక లోపాలు
- Tamil Nadu Politics: తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఏఐఏడీఎంకేకు షాక్.. విజయ్ పార్టీకి భారీ బూస్ట్..
- Nara Lokesh: ఇప్పుడు 'మావిగన్'.. రేపు బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాద్ కలిపి ‘బెన్తాహై’ అంటారేమో..!
అయితే.. 2022 అక్టోబర్లో భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి కెజి బాలకృష్ణ నేతృత్వంలో కేంద్రం విచారణ కమిషన్ను ఏర్పాటు చేసింది. మతం మారిన దళితులందరికీ ఎస్సీ హోదా ఇవ్వవచ్చా లేదా అని తేల్చేందుకు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం విచారణ కమిషన్కు మరోసారి గడువు ఇచ్చింది. చారిత్రాత్మకంగా ఇప్పుడు మతం మారిన ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తులకు ఎస్సీ హోదా కల్పించే అవకాశాన్ని పరిశీలించేందుకు కమిషన్ను ఏర్పాటు చేశారు. 2024 అక్టోబర్ 10లోగా నివేదిక ఇవ్వాలని కమిషన్ను ఆదేశించింది.
తాజావార్తలు
-
OG 2: పవన్ కళ్యాణ్ కొత్త లుక్ వైరల్.. ‘ఓజీ 2’పై ఒక్క ఫోటోతోనే భారీ హైప్
-
UP Boy: వారంలో 3 రోజులు ఎల్కేజీ, 3 రోజులు ఫస్ట్ క్లాస్.. రెండు కుటుంబాల మధ్య నలిగిపోతున్న ఆరేళ్ల బాలుడు!
-
Green Chillies Storage Tips: ఈ సింపుల్ ట్రిక్ చాలు.. పచ్చిమిరపకాయలు వారాల తరబడి ఫ్రెష్గా ఉంటాయి
-
Android 17 Wrong Password Lock Feature: గూగుల్ కొత్త సెక్యూరిటీ ఫీచర్.. ప్రతి యూజర్ తెలుసుకోవాల్సిందే!
-
RC17 : నాకు ఆ ప్లాప్ హీరోయినే కావాలి : రామ్ చరణ్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?