Sandeshkhali Clashes: “బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించండి”.. సందేశ్ఖలీ అత్యాచారాలపై ఎస్సీ జాతీయ కమిషన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sandeshkhali Clashes: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని సందేశ్ఖలీ ప్రాంతం అట్టుడుకుతోంది. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేత షేక్ షాజహాన్, అతని గుండాల అకృత్యాలపై అక్కడి మహిళలు, యువత భగ్గుమంటోంది. నేరస్తులను వెంటనే అరెస్ట్ చేయాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆందోళనలకు బీజేపీ మద్దతు తెలుపుతోంది. మరోవైపు ఈ అల్లర్ల వెనక ఆర్ఎస్ఎస్ ఉందని బెంగాల్ సీఎం, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ ఆరోపిస్తున్నారు.
ఇదిలా ఉంటే, సందేశ్ఖలీలో టీఎంసీ అఘాయిత్యాలపై, అనేక లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బీజేపీ ఆరోపించిన నేపథ్యంలో ‘రాష్ట్రపతి పాలన’ను షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్(ఎన్సీఎస్సీ) శుక్రవారం సిఫారసు చేుసింది. ఎన్సీఎస్సీ ప్రతినిధి బృందం గురువారం సందేశ్ఖలీని సందర్శించింది. ఈ ఉదయం రాష్ట్రపతి ద్రౌపదిముర్ముకు నివేదికను అందచేసింది. NCSC చైర్పర్సన్ అరుణ్ హాల్డర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో నేరస్తులు అక్కడి ప్రభుత్వంతో చేతులు కలిపారని, ఇది ఎస్సీ సంఘాల సభ్యుల జీవితాలపై ప్రభావం చూపిస్తోందని అన్నారు. టీఎంసీ నేత షేక్ షాజహాన్ లైంగిక దాడికి గురైన మహిళల్ని కలిసేందుకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వం నుంచి ఎన్సీఎస్సీకి ఎలాంటి సాయం అందలేదని అన్నారు.
Also Read
- AC: భారత్లో తొలి ఏసీ ఎక్కడ పెట్టారో తెలుసా? ఆసక్తికర చరిత్ర గురించి తెలుసుకోండి..
- E30 Petrol: పెట్రోల్లో పెరగనున్న ఇథనాల్ శాతం.. వాహనదారులకు లాభమా? నష్టమా?
- TVK Vijay: అలా అయితే మద్దతు విత్డ్రా చేసుకుంటాం.. సీఎం విజయ్కు కొత్త తలనొప్పి..
- Tech Layoffs: ‘‘60 రోజులు లేదా అమెరికా వదలాలి’’.. లేఆఫ్స్తో H-1B ఇండియన్లలో భయం..
Read Also: PM Modi: రైతులకు ప్రయోజనం చేకూరేలా ప్రభుత్వం పనిచేస్తోంది..ఆందోళనల నేపథ్యంలో పీఎం కీలక వ్యాఖ్యలు..
మరోవైపు కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి కూడా సందేశ్ఖలీ అల్లర్లపై స్పందించారు. ప్రతిపక్షాలు ఆ ప్రాంతానికి వెళ్తా అంటే మమతా బెనర్జీ ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. ఇప్పటికే ఆ ప్రాంతంలోని మహిళల్ని రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ కలుసుకున్నారు. బుధవారం బీజేపీ చీఫ్ సుకాంత మజుందార్ ఆందోళనలకు మద్దతు తెలిపారు.
రేషన్ కుంభకోణంలో టీఎంసీ నేత షేక్ షాజహాన్ ప్రయేమంపై ఈడీ విచారణ జరిపేందుకు వెళ్లిన సందర్భంలో అతని అనుచరులు అధికారులపై దాడులకు తెగబడ్డారు. ఈ తర్వాత ఆ ప్రాంతంలోని మహిళలపై టీఎంసీ గుండాలు అత్యాచారాలకు పాల్పడ్డారు. దీంతో ఒక్కసారిగా మహిళలు వారిపై తిరబడ్డారు. మరోవైపు ప్రధాన సూత్రధారి, నిందితుడిగా ఉన్న షేక్ షాజహాన్ నెల రోజల నుంచి పరారీలో ఉన్నాడు.
తాజావార్తలు
-
Iran Warning: ఇప్పటిదాకా పూర్తి శక్తిని ఉపయోగించలేదు.. ఈసారి వేరే లెవల్లో ఉంటుంది.. ఇరాన్ తాజా వార్నింగ్
-
IPL 2026: RCB ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. జట్టులోకి మరో విధ్వంసకర బ్యాట్స్మెన్ ఎంట్రీ..
-
AC: భారత్లో తొలి ఏసీ ఎక్కడ పెట్టారో తెలుసా? ఆసక్తికర చరిత్ర గురించి తెలుసుకోండి..
-
RC 17: చరణ్ ఫాన్స్.. రెడీ అవండమ్మా!
-
E30 Petrol: పెట్రోల్లో పెరగనున్న ఇథనాల్ శాతం.. వాహనదారులకు లాభమా? నష్టమా?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!