లోకేష్ కి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని సాగుతున్న చర్చపై తెలుగుదేశం పార్టీ పొలిట్బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ.. లోకేష్ కి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని వస్తున్న వాదనాలపై బుచ్చయ్య చౌదరి స్పందించారు.. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా మరోకరికి ఆలోచన లేదన్నారు. డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ ఉన్నారని అన్నారు..
ఏ నాయకుడు చేయని సాహసం నారా లోకేష్ చేశారని తెలిపారు. రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాల్లో దాదాపు 2 వేల కిలోమీటర్ల పైచిలుకు పాదయాత్ర చేసిన ఘనత లోకేష్ కే దక్కుతుందని వెల్లడించారు. ఎందరో నాయకులు పాదయాత్రలు చేశారు.. అన్నీంటిని తలదన్నేలా రాష్ట్రంలోని మండలాలు, గ్రామాల్లో నారా లోకేష్ పర్యటించారు అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం.. లబ్దిదారుల ఎంపిక కోసం చేపట్టిన గ్రామ సభల్లో లీడర్ల చెంపలు పగులుతున్నాయి. గ్రామ సభల్లో లబ్దిదారుల ఎంపిక సందర్బంగా నాయకుల మధ్య విద్వేశాలు రగులుతున్నాయి. అయితే, తాజా ఘర్షణలకు ఎక్కువ భాగం నిన్నటి వరకు బీఆర్ఎస్ లో ఉండి నేడు కాంగ్రెస్ పార్టీలో చేరిన వారి మధ్యనే వివాదాలు కొనసాగుతున్నాయి. నిన్నటి నుంచి ఈ సభల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. పట్టణాల్లో సాఫీగా జరుగుతున్నప్పటికీ గ్రామాల్లోమాత్రం నేతల మధ్య వాగ్వావాదాలు,…
తెలుగుదేశం పార్టీకి దశ, దిశ నారా లోకేష్ మాత్రమే.. నారా చంద్రబాబు నాయుడు తర్వాత ఆయనే సీఎం అని వ్యాఖ్యానించారు టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న.. విజయవాడలో బుద్ధా వెంకన్న ఆధ్వర్యంలో టీడీపీ కార్యలయంలో నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు.. భారీ కేక్ కట్ చేశారు వెంకన్న, టీడీపీ కార్యకర్తలు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు తరువాత పార్టీకి దశ దిశ లోకేష్ మాత్రమే అన్నారు. చంద్రబాబు పాదయాత్రకు వచ్చిన ఆదరణ మళ్లీ…
కాంటన్ ఆఫ్ వాడ్ స్టేట్ కౌన్సిలర్ క్రిస్టెల్లా లూసియర్ బ్రాడర్డ్ తో రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్ బెల్వేడేర్ లో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లోని కీలక రంగాల్లో స్విస్ కంపెనీలను ఆహ్వానించండానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు .
వరల్డ్ ఎకనమిక్ ఫోరం హెల్త్ కేర్ హెడ్ శ్యామ్ బిషన్తో ఏపీ రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్ కాంగ్రెస్ సెంటర్లో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రూపొందించిన స్వర్ణాంధ్ర-2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యాలకు అనుగుణంగా అధునాతన సాంకేతికతతో అనుసంధానించి గ్లోబల్ స్టాండర్ట్స్ తో అందరికీ ఆరోగ్యం అందించడంపై సహకారం కావాలన్నారు లోకేష్. పోషకాహారం, సంరక్షణ కల్పించాలన్నది తమ లక్ష్యం అని.. హెల్త్ కేర్ డెలివరీలో ప్రపంచ ప్రమాణాలను సాధించడం, అన్ని…
డిప్యూటీ సీఎం అంశంపై జనసేన అధిష్టానం కీలక ఆదేశాలు జారీ చేసింది.. ఉప ముఖ్యమంత్రి అంశంపై ఎవరూ మాట్లాడొద్దని స్పష్టం చేసింది.. డిప్యూటీ సీఎం విషయంలో మీడియా ముందు గానీ, సోషల్ మీడియాలో గానీ.. ఎవరూ స్పందించవద్దని మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది..
దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఇఎఫ్) వార్షిక సదస్సు 2025 అట్టహాసంగా ప్రారంభమైంది. ఐదు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సుకు వివిధ దేశాల నాయకులు, అధికారులు, వ్యాపార వేత్తలు హాజరవుతున్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. దావోస్లో రెండో రోజు సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. రెండో రోజూ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో ప్రపంచ దిగ్గజ కంపెనీల…
విశాఖ స్టీల్ ప్లాంట్కు నిధులు సాధించడం కూటమి ప్రభుత్వ విజయం అని మంత్రి కోలుసు పార్థ సారథి అన్నారు. ఆంధ్రుల పోరాటంతో ఏర్పడిన విశాఖ ఉక్కు దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించిందన్నారు. ప్లాంట్ను కేంద్రం వదులుకుంటే.. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిపించాలని మంత్రి నారా లోకేష్ గతంలోనే నిర్ణయించారని మంత్రి కోలుసు గుర్తుచేశారు. గతంలో 21 ఎంపీలు ఉన్న వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాల గాలికి వదిలేసారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు నాయకత్వం పట్ల కేంద్ర ప్రభుత్వానికి…
స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచదేశాల ఆర్థిక సదస్సు (డబ్ల్యూఈఎఫ్)లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్సెలార్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ లక్ష్మీ మిట్టల్తో చంద్రబాబు, లోకేశ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. లక్ష్మీ మిట్టల్, సీఈవో ఆదిత్య మిట్టల్తో జరిగిన సమావేశంలో తాము పాల్గొన్నాం అని సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా తెలిపారు. ‘అనకాపల్లిలో ఏర్పాటయ్యే ఆర్సెలార్ మిట్టల్, నిప్పాన్…