ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా ఉక్కు దిగ్గజం లక్ష్మీ మిట్టల్తో చంద్రబాబు, లోకేష్ ప్రత్యేక భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ భావనపాడులో పెట్రో కెమికల్ హబ్ ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టాలని, ఏపీలో సోలార్ సెల్ తయారు ప్లాంటు ఏర్పాటును పరిశీలించాలని లక్ష్మీ మిట్టల్ను మంత్రి లోకేష్ కోరారు. లక్ష్మీ మిట్టల్, సీఈవో ఆదిత్య మిట్టల్తో జరిగిన…
నారా లోకేష్ కాబోయే సీఎం అంటూ దావోస్ వేదికగా మంత్రి టీజీ భరత్ చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు.. సీఎం చంద్రబాబు, నారా లోకేష్ ఉన్న వేదికపై వ్యాఖ్యలు చేశారు మంత్రి టీజీ భరత్.. ఈ వ్యాఖ్యలపై తీవ్ర ఆసహనం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు.. ఎలాంటి వేదికలపై ఏం వ్యాఖ్యలు చేస్తున్నావని టీజీ భరత్ పై మండిపడ్డారట.. ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని టీజీ భరత్ కు సూచించారు సీఎం చంద్రబాబు..
ఎవరికైనా నచ్చినా నచ్చక పోయినా.. తెలుగుదేశం పార్టీ ఫ్యూచర్ ఈజ్ లోకేష్.. కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ అని వ్యాఖ్యానించారు మంత్రి టీజీ భరత్.. జ్యూరిక్లోని తెలుగువారితో సీఎం చంద్రబాబు 'మీట్ అండ్ గ్రీట్' కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు తదితరులతో కలిసి పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొంత కాలంగా.. నారా లోకేష్ను డిప్యూటీ సీఎంను చేయాలన్న డిమాండ్ కాకరేపుతోంది.. దీనిపై స్పందించిన తెలుగుదేశం పార్టీ అధిష్టానం కీలక ఆదేశాలు జారీ చేసింది.. ఈ వ్యవహారంపై సీరియస్ అయ్యింది.. అత్యుత్సాహం వద్దని నేతలను వారించింది టీడీపీ అధిష్టానం.. కూటమి నేతలు మాట్లాడుకున్నాకే ఏదైనా నిర్ణయాలుంటాయని స్పష్టం చేసింది..
ఏపీ మంత్రి నారా లోకేష్ డిప్యూటీ సీఎం మాత్రమే కాదు.. సీఎం అవ్వాలని కూడా వ్యక్తిగతంగా తాను కోరుకుంటున్నా అని టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు ముఖ్యమంత్రి పదవి ఇస్తే తాను స్వాగతిస్తానన్నారు. ఎన్డీఏ కూటమిలో ఎవరికి ఏ స్థానం ఇవ్వాలో పెద్దలు నిర్ణయిస్తారని, వర్మ లేదా ఇంకెవరైనా చెప్పినా వారి వ్యక్తిగత అభిప్రాయమే అని పేర్కొన్నారు. లోకేష్ డిప్యూటీ సీఎం అవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అంటేనే దానికి ప్రాధాన్యం…
World Economic Forum : ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సదస్సు సోమవారం స్విట్జర్లాండ్ లోని దావోస్ లో ప్రారంభం కానుంది. ఈ సదస్సు ఈ నెల 24 వరకు కొనసాగనుంది. ప్రపంచంలోని శక్తివంతమైన నేతలు, వివిధ రంగాల ప్రముఖులు సుమారు 2,500 మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు సమాచారం. ఈ సందర్భంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా దావోస్ చేరుకున్నారు. విజయవాడ నుండి బయలుదేరిన చంద్రబాబు ముందుగా ఢిల్లీ చేరుకుని, అక్కడ నుంచి అర్ధరాత్రి…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్ రోజుకు రోజుకు పెరుగుతోంది. సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలోనే కడప జిల్లా బహిరంగ సభలో లోకేష్ను డిప్యూటీ సీఎంను చేయాలని టీడీపీ అధ్యక్షుడు డిమాండ్ చేశారు. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామరాజు కూడా లోకేశ్ను డిప్యూటీ సీఎంను చేయాలన్నారు. తాజాగా మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి…
తెలంగాణలో టీడీపీ పార్టీ పునర్నిర్మాణంపై చర్చిస్తున్నాం అని, త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం అని ఏపీ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. తెలంగాణలో 1.60 లక్షల మంది పార్టీ సభ్యత్వం తీసుకున్నారని, టీడీపీపై తెలంగాణ ప్రజలకు ప్రేమ మరియు ఆశ ఉందన్నారు. తెలంగాణలో టీడీపీ పార్టీని బలోపేతం చేయడమే తమ లక్ష్యం అని లోకేశ్ చెప్పారు. నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 29వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి నారా లోకేశ్ నివాళి అర్పించారు.…
తెలుగుదేశం పార్టీ పూర్తి ప్రక్షాళన దిశగా అడుగులు పడుతున్నాయా? అంటే... ఎస్.. వాతావరణం చూస్తుంటే అలాగే అనిపిస్తోందని అంటున్నాయి హైకమాండ్కు అత్యంత సన్నిహిత వర్గాలు. అధ్యక్షుడు చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ దీని మీద సీరియస్గా వర్కౌట్ చేస్తున్నట్టు సమాచారం.
ఏపీ మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. నిన్న విజయవాడలోని సింగ్ నగర్లో ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించిన మంత్రి.. విద్యార్థినులతో ముఖాముఖి నిర్వహించారు. స్థానిక విద్యార్థినులు తమకు ఆకతాయిలతో ఇబ్బందిగా ఉందని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని మంత్రిని కోరారు. దీంతో నారా లోకేష్ వెంటనే స్పందించి.. గంటల వ్యవధిలో అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయిస్తున్నారు. ఇప్పటికే మూడు కెమెరాలు ఏర్పాటు అవ్వగా.. మిగతా రెండు…