Minister Lokesh: వైసీపీ ప్రతిపక్ష హోదా ఎలా అడుగుతుంది..?
- వైసీపీ ప్రతిపక్ష హోదాపై మంత్రి నారా లోకేష్
- వైసీపీ ప్రతిపక్ష హోదా ఎలా అడుగుతుంది..?- లోకేష్
- జగన్ మోహన్ రెడ్డికి పార్లమెంట్, అసెంబ్లీ అంటే లెక్క లేదు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శాసన మండలిలో వైసీపీ ప్రతిపక్ష హోదాపై మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. వైసీపీ ప్రతిపక్ష హోదా ఎలా అడుగుతుందని ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదాపై పార్లమెంట్, అసెంబ్లీ నియమ నిబంధనలను లోకేష్ చదివి వినిపించారు. సభలో ఉన్న మొత్తం సభ్యుల సంఖ్యలో ఒకటి బై పదో శాతం మంది సభ్యులు ప్రతిపక్ష పార్టీకి ఉండాలన్నారు. అలా ఉంటేనే ప్రతిపక్ష నేత హోదా వస్తుంది అని నిబంధనలు చెబుతున్నాయని పేర్కొన్నారు. జగన్ మోహన్ రెడ్డికి పార్లమెంట్, అసెంబ్లీ అంటే లెక్క లేదని తెలిపారు. గతంలో జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ.. టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు,
టీడీపీ నుంచి ఐదుగురు ఎమ్మేల్యేలను లాగితే చంద్రబాబుకి 17,18 మంది ఎమ్మెల్యేలు ఉంటారని చెప్పారన్నారు. ప్రతిపక్ష నేత హోదా కూడా చంద్రబాబుకి ఉండదు అని జగన్ చెప్పారని లోకేష్ పేర్కొన్నారు.
Read Also: Shashi Tharoor: కేంద్రమంత్రితో శశిథరూర్ సెల్ఫీ.. కాంగ్రెస్కి క్లియర్ మెసేజ్..
Also Read
- CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
- CM Chandrababu: టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు క్లాస్.. సమన్వయంపై ప్రత్యేక దృష్టి
- AP New Zonal System: ఏపీలో కొత్త జోనల్ విధానానికి శ్రీకారం.. ఉద్యోగుల కేటాయింపులకు కొత్త రూల్స్
- Speaker Ayyanna Patrudu: ఉచిత పథకాలపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు
మరోవైపు.. 2019 నుంచి 2024 వరకు రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ రాలేదు.. ఐదేళ్లలో వైసీపీ రాష్ట్రానికి చేసింది ఏంటి..? అని మంత్రి లోకేష్ ప్రశ్నించారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామని చెప్పారు ఏమైంది..? అని అడిగారు. మాట తప్పం మడం తిప్పము అన్నారు.. అమరావతి పై మాట తప్పారని లోకేష్ తెలిపారు. గత ఐదేళ్లలో గన్ పాయింట్లో ఆస్తులు లాక్కున్నారు.. కాకినాడ పోర్ట్ లాక్కున్నారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేదని వెల్లడించారు. తాము అధికారంలోకి వచ్చాక పెన్షన్లు పెంచామని.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశామని తెలిపారు. అలాగే.. తాము అధికారంలోకి రాగానే చెత్త పన్ను రద్దు చేసామన్నారు. మూడు ఉచిత సిలిండర్లు ఇస్తున్నాం.. ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ పాఠశాలల్లో తీసుకు వచ్చింది తామని చెప్పారు. గత ఐదేళ్లలో ప్రభుత్వం పాఠశాలల్లో 12 లక్షల మంది తగ్గిపోయారు.. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ అమలు చేస్తున్నామని మంత్రి లోకేష్ తెలిపారు.
Read Also: Lenovo IdeaPad Slim 5: AI ఫీచర్లతో లెనోవా కొత్త ల్యాప్ టాప్.. ధర ఎంతంటే?
తాజావార్తలు
-
Success Story: 20 గంటల పోలీసు డ్యూటీ, గర్భం, రెండు వైఫల్యాలు… అయినా ఒక రైతు కూతురు డీఎస్పీ అయింది..
-
Shocking Statistics: 6 నెలల్లో 554 మంది భర్తల మృతి.. దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన సంచలన నివేదిక!
-
Pawan Kumar Chandana: మ్యాథ్స్లో 51 మార్కులు.. నేడు భారత తొలి ప్రైవేట్ రాకెట్ విజయవంతం.. హైదరాబాద్ కుర్రాడి విజయగాథ!
-
Jani Master: నిర్మాతల డబ్బులు దోచేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా?
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!