Minister Lokesh: వైసీపీ ప్రతిపక్ష హోదా ఎలా అడుగుతుంది..?
- వైసీపీ ప్రతిపక్ష హోదాపై మంత్రి నారా లోకేష్
- వైసీపీ ప్రతిపక్ష హోదా ఎలా అడుగుతుంది..?- లోకేష్
- జగన్ మోహన్ రెడ్డికి పార్లమెంట్, అసెంబ్లీ అంటే లెక్క లేదు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శాసన మండలిలో వైసీపీ ప్రతిపక్ష హోదాపై మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. వైసీపీ ప్రతిపక్ష హోదా ఎలా అడుగుతుందని ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదాపై పార్లమెంట్, అసెంబ్లీ నియమ నిబంధనలను లోకేష్ చదివి వినిపించారు. సభలో ఉన్న మొత్తం సభ్యుల సంఖ్యలో ఒకటి బై పదో శాతం మంది సభ్యులు ప్రతిపక్ష పార్టీకి ఉండాలన్నారు. అలా ఉంటేనే ప్రతిపక్ష నేత హోదా వస్తుంది అని నిబంధనలు చెబుతున్నాయని పేర్కొన్నారు. జగన్ మోహన్ రెడ్డికి పార్లమెంట్, అసెంబ్లీ అంటే లెక్క లేదని తెలిపారు. గతంలో జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ.. టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు,
టీడీపీ నుంచి ఐదుగురు ఎమ్మేల్యేలను లాగితే చంద్రబాబుకి 17,18 మంది ఎమ్మెల్యేలు ఉంటారని చెప్పారన్నారు. ప్రతిపక్ష నేత హోదా కూడా చంద్రబాబుకి ఉండదు అని జగన్ చెప్పారని లోకేష్ పేర్కొన్నారు.
Read Also: Shashi Tharoor: కేంద్రమంత్రితో శశిథరూర్ సెల్ఫీ.. కాంగ్రెస్కి క్లియర్ మెసేజ్..
Also Read
- Pawan Kalyan: సంక్షేమ పథకాలపై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. దానికి వైసీపీనే ఉదాహరణ..!
- Pawan Kalyan: వైసీపీకి పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.. మౌనం బలహీనత కాదు..!
- Amaravati Tension: ఉండవల్లిలో హైటెన్షన్.. వైసీపీ నేతలపై కోడిగుడ్లు, రాళ్ల దాడి
- Andhra Pradesh Rain Alert: ద్రోణి, తుఫాన్ ఆవర్తనం ప్రభావం.. ఏపీలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
మరోవైపు.. 2019 నుంచి 2024 వరకు రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ రాలేదు.. ఐదేళ్లలో వైసీపీ రాష్ట్రానికి చేసింది ఏంటి..? అని మంత్రి లోకేష్ ప్రశ్నించారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామని చెప్పారు ఏమైంది..? అని అడిగారు. మాట తప్పం మడం తిప్పము అన్నారు.. అమరావతి పై మాట తప్పారని లోకేష్ తెలిపారు. గత ఐదేళ్లలో గన్ పాయింట్లో ఆస్తులు లాక్కున్నారు.. కాకినాడ పోర్ట్ లాక్కున్నారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేదని వెల్లడించారు. తాము అధికారంలోకి వచ్చాక పెన్షన్లు పెంచామని.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశామని తెలిపారు. అలాగే.. తాము అధికారంలోకి రాగానే చెత్త పన్ను రద్దు చేసామన్నారు. మూడు ఉచిత సిలిండర్లు ఇస్తున్నాం.. ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ పాఠశాలల్లో తీసుకు వచ్చింది తామని చెప్పారు. గత ఐదేళ్లలో ప్రభుత్వం పాఠశాలల్లో 12 లక్షల మంది తగ్గిపోయారు.. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ అమలు చేస్తున్నామని మంత్రి లోకేష్ తెలిపారు.
Read Also: Lenovo IdeaPad Slim 5: AI ఫీచర్లతో లెనోవా కొత్త ల్యాప్ టాప్.. ధర ఎంతంటే?
తాజావార్తలు
-
Aadarsha Kutumbam: అక్టోబర్ 2న ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్ డేట్ లాక్! వెంకీ ఫ్యాన్స్కు పూనకాలే..
-
CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
-
Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
-
Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
-
Sergei Ivanov: పుతిన్ రైట్ హ్యాండ్ మృతి.. అది సహజ మరణమా? లేక పక్కా స్కెచా? అసలు నిజమేంటి!
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..