ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓ భారీ బడ్జెట్ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఏఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ చిత్రాన్ని ప్రాజెక్ట్ కే అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్స్ దీపికా పదుకొనె, బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ కు సంబంధించిన సన్నివేశాల షూటింగ్ జరుగుతోంది. ఈ సైన్స్ ఫిక్షన్ డ్రామా…
నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ఈ రోజు (జూలై 24న) హైదరాబాద్లో సెట్స్ పైకి వెళ్ళింది. దానికి ప్రభాస్ ఫస్ట్ క్లాప్ ఇవ్వడం విశేషం. ప్రొడక్షన్ హౌస్ అయిన వైజయంతి మూవీస్ తమ అధికారిక ట్విట్టర్ లో క్లాప్బోర్డ్ పట్టుకున్న ప్రభాస్ ఫోటోను పంచుకున్నారు. “ఇది ప్రారంభం. గురు పూర్ణిమ ప్రత్యేక రోజున మేము భారతీయ సినిమా గురువుతో ప్రారంభించాము” అంటూ ట్వీట్ చేశారు. “ఈ గురు పూర్ణిమ రోజున భారతీయ సినిమా గురువు కోసం…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్. ప్రభాస్, నాగ్ అశ్విన్ చిత్రం ఈ రోజు ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రం అధికారిక ప్రకటన చాలా రోజుల క్రితం వచ్చింది. ఈ రోజు సినిమాకు సంబంధించిన ముహూర్తం వేడుక శనివారం హైదరాబాద్లో జరగబోతోంది. ఈ చిత్రం ప్రారంభోత్సవానికి హాజరయ్యేందుకు అమితాబ్ బచ్చన్ హైదరాబాద్లో అడుగుపెట్టినట్లు సమాచారం. ఈ ప్రతిష్టాత్మక…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న ‘రాధేశ్యామ్’ మూవీ సెట్స్ పై ఉండగానే ప్రభాస్ 21వ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా తాము నిర్మించబోతున్నామని గత యేడాది ఫిబ్రవరి 26న ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ ప్రకటించారు. దీపిక పదుకునే నాయికగా నటించే ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ కీలక పాత్ర పోషిస్తారని చెప్పారు. ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీని అశ్వినీదత్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ అప్పటి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే షూటింగ్స్ పునప్రారంభం కానుండడంతో ప్రభాస్ తిరిగి బిజీ కానున్నాడు. రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్ లాంటి భారీ సినిమాలతో ప్రభాస్ మరోసారి బాలీవుడ్ అభిమానులను సైతం ఆకర్షించాడు. అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరో భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రంలోనూ ప్రభాస్ నటించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా కూడా సెట్స్ పైకి వెళ్లనుంది. కథానాయికగా బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా…
ప్రముఖ దర్శకుడు, ‘మహానటి’ ఫేమ్ నాగ అశ్విన్ రెండు వారాల పాటు అందరూ పర్శనల్ లాక్ డౌన్ పాటిస్తే మంచిది సలహా ఇస్తున్నారు. ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించినా, ప్రకటించకపోయినా… దీనిని పాటించడం వల్ల డాక్టర్లకు కాస్తంత విశ్రాంతి లభిస్తుందన్నది ఆయన అభిప్రాయం. గత కొన్ని వారాలుగా కరోనా నివారణకు వాక్సినేషన్ చేస్తూ, కరోనా రోగులకు వైద్యం చేస్తూ డాక్టర్లు, వారి బృందం ఎంతో అలసిపోయారని, కనీసం వారి కోసమైనా రెండు వారాలు అందరూ వ్యక్తిగతంగా లాక్…
ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ సెలెబ్రిటీలతో పాటు నెటిజన్లు నాగ్ అశ్విన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ లాంటి విభిన్నమైన చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నాగ్ అశ్విన్… మొదటి చిత్రంతోనే హిట్ అందుకుని తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు. ఆ తరువాత ‘మహానటి’తో ప్రేక్షకులను మెప్పించి జాతీయ అవార్డును అందుకున్నాడు. ఇటీవలే ‘జాతి రత్నాలు’తో నిర్మాతగా మారి…