యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్. ప్రభాస్, నాగ్ అశ్విన్ చిత్రం ఈ రోజు ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రం అధికారిక ప్రకటన చాలా రోజుల క్రితం వచ్చింది. ఈ రోజు సినిమాకు సంబంధించిన ముహూర్తం వేడుక శనివారం హైదరాబాద్లో జరగబోతోంది. ఈ చిత్రం ప్రారంభోత్సవానికి హాజరయ్యేందుకు అమితాబ్ బచ్చన్ హైదరాబాద్లో అడుగుపెట్టినట్లు సమాచారం. ఈ ప్రతిష్టాత్మక చిత్రం గురించి ఎటువంటి వివరాలు చెప్పకుండా అమితాబ్ ట్వీట్ లో ఈ విషయాన్ని పంచుకున్నారు.
Read Also : స్టార్ హీరో కొడుకుతో నాగ చైతన్య టేబుల్ టెన్నిస్
“రేపు మొదటి రోజు ముహూర్తం… కొత్త చిత్రం కొత్త ప్రారంభం, కొత్త వాతావరణం…” అంటూ అమితాబ్ ట్వీట్ చేశారు. సైన్స్ ఫిక్షన్ డ్రామాగా రూపొందుతున్న ప్రభాస్, నాగ్ అశ్విన్ మూవీ కోసం అమితాబ్ 6-7 రోజులు షూటింగ్ చేసి తరువాత ముంబై వెళ్లనున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ భారీ బడ్జెట్తో ఈ పాన్ ఇండియా ప్రాజెక్టును భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి. అయితే ఈ రోజు సినిమా ప్రారంభం కానుందని చిత్రబృందం అధికారికంగా ప్రకటించినప్పటికీ ప్రస్తుతం అమితాబ్ చేస్తున్న ఒకే ఒక భారీ తెలుగు మూవీ ఇదే. అందుకే అమితాబ్ ఏ సినిమా కోసం హైదరాబాద్ చేరుకున్నాడనే విషయంపై క్లారిటీ వచ్చేసింది.