ప్రభాస్ – నాగ అశ్విన్ మూవీ మరింత వెనక్కి!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న ‘రాధేశ్యామ్’ మూవీ సెట్స్ పై ఉండగానే ప్రభాస్ 21వ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా తాము నిర్మించబోతున్నామని గత యేడాది ఫిబ్రవరి 26న ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ ప్రకటించారు. దీపిక పదుకునే నాయికగా నటించే ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ కీలక పాత్ర పోషిస్తారని చెప్పారు. ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీని అశ్వినీదత్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ అప్పటి నుండే సాగుతోంది. అయితే ఈ సినిమా నిర్మాణం, విడుదలకు మరికొంత సమయం పడుతుందని, ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న మూడు నాలుగు సినిమాల తర్వాతే ఇది జనం ముందుకు వస్తుందని తెలుస్తోంది.
నాగ అశ్విన్ దర్శకత్వంలో సినిమా చేయడానికి అంగీకరించిన తర్వాత ప్రభాస్ మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ రూపొందిస్తున్న ‘ఆదిపురుష్’ ఒకటి కాగా, మరొకటి ప్రముఖ కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ చేస్తున్న ‘సలార్’. నాగ అశ్విన్ సినిమా కంటే ఆలస్యంగా ప్రకటించబడిన ఈ రెండు సినిమాలూ ఇప్పటికే పట్టాలెక్కేసి, షూటింగ్ నూ జరుపుకుంటున్నాయి. నాగ అశ్విన్ మాత్రం ప్రీ ప్రొడక్షన్ వర్క్ లోనే ఉన్నారు. దాంతో ఈ రెండు సినిమాల తర్వాతే ఈ మూవీ వస్తుందని ప్రభాస్ అభిమానులు మానసికంగా ప్రిపేర్ అయిపోయారు. కానీ చిత్రంగా ఈ సినిమా మరింత ఆలస్యం అవుతుందనే సంకేతాలు వస్తున్నాయి. దానికి ఆధారం లేకపోలేదు. ప్రభాస్ – నాగ అశ్విన్ సినిమాకు సినిమాటోగ్రఫీ అందిస్తున్న డాని శాంచెజ్ లోపెజ్ ఇటీవల ఓ కెమెరా రెంటల్ ఆఫీస్ కు వెళ్ళి ఫోటో దిగారు. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ #Prabhas25 చిత్రం కోసం అన్నట్టుగా పేర్కొన్నారు. దీంతో ప్రభాస్ తో నాగ అశ్విన్ తీయబోతున్న సినిమా 25వ ప్లేస్ లోకి వెళ్ళిపోయిందనే భావన చాలామందిలో కలుగుతోంది.
Also Read
- Anushka Shetty : అనుష్క ఇక సినిమాలు చేయడం.. బయట కనిపించడం కష్టమే..
- Anirudh : అనిరుథ్ - కావ్య మారన్ పెళ్లి.. కన్ఫర్మ్ చేసిన ఫ్యామిలీ మెంబర్
- Jackky Bhagnani: హీరోయిన్ రకుల్తో పెళ్లై ఏడాది కూడా కాకముందే డేటింగ్ యాప్లో జాకీ భగ్నానీ? వైరల్ అవుతున్న లీక్స్!
- Munna Bhaiya: ‘మున్నాభయ్య’ ఈజ్ బ్యాక్.. దివ్యేందు శర్మ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్!
Read Also : “తగ్గేదే లే” అంటున్న ప్రియాంక… హాట్ పిక్స్
ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ‘రాధేశ్యామ్’ 20వ చిత్రం కాగా, ‘ఆదిపురుష్’ 21, ‘సలార్’ 22వ చిత్రం అవుతుంది. నాగ అశ్విన్ ది 25వ చిత్రం అయితే… ఈ మధ్యలో ప్రభాస్ మరో రెండు సినిమాలు చేసేయొచ్చన్నమాట. ఇటీవల ప్రభాస్ తో బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఓ మూవీ చేయబోతున్నాడని, దానికి మైత్రీ మూవీ మేకర్స్ ఫైనాన్స్ చేస్తారని వార్తలు వచ్చాయి. సో… ఆ వార్తలోనూ కొంత నిజం లేకపోలేదనిపిస్తోంది. అలానే ప్రభాస్ మరో సినిమాకు కూడా కమిట్ అయి ఉంటాడని, అందుకే నాగ అశ్విన్ సినిమాను 25గా పేర్కొని ఉండొచ్చని కొందరంటున్నారు. మరి ఈ విషయంలో సీనియర్ అశ్వినిదత్ లేదా హీరో ప్రభాస్ వివరణ ఇస్తారేమో చూడాలి.
తాజావార్తలు
-
Anant Ambani: టీటీడీకి రూ.27.5 కోట్ల భారీ విరాళం.. 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్ కూడా!
-
Kangana Ranaut: ఆ నటుడి పెదవిని కంగనా కొరికిందా?.. ‘రివాల్వర్ రాణి’ కిస్ సీన్ మళ్లీ వైరల్
-
Vaibhav Sooryavanshi Debut: వైభవ్ సూర్యవంశీ టీమిండియా అరంగేట్రం కష్టమే!
-
Iran: “నరకం చూపిస్తాం”.. అమెరికా, గల్ఫ్ దేశాలకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక
-
Suzuki GSX250R: సుజుకీ GSX250R ఆవిష్కరణ.. భారత్లో కూడా విడుదలవుతుందా?
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!