ఉప ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చిన మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ త్వరలో బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. బీజేపీలో చేరేందుకు డేట్ ఫిక్స్ అయినట్లు సమాచారం. అక్టోబర్ 19న ఢిల్లీలో బీజేపీ నేతల సమక్షంలో బూర నర్సయ్య గౌడ్ కాషాయ తీర్థం పుచ్చుకోనున్నారు. బీజేపీలో చేరడం ఘర్ వాపసీ లాంటిదని.. పదవుల కోసం పార్టీ మారడం లేదని బూర నర్సయ్య గౌడ్ చెప్పారు.
బీజేపీ కేంద్రంలో దోపిడీ చేసిన సొమ్ము మునుగోడులో పెడుతున్నారని అన్నారు. మునుగోడు ఓటర్లు తెలివైన వారని, మునుగోడు ప్రజల్ని ఎవరు కొనలేరని అన్నారు. మాజీ పీసీసీ అధ్యక్షుడు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి
మునుగోడు ప్రచారంలో భాగంగా.. సీఎల్పీ నేత బట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మునుగోడులో జరుగుతున్న తీరుపై వీడియో క్లిప్పింగ్ ప్రదర్శించామన్నారు. మునుగోడు ఎన్నికల్లో టీఆర్ఎస్ , బీజేపీ రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వాలను విచ్చలవిడిగా ఊపయోగిస్తున్నాయని అన్నారు.
Munugode bypoll: మునుగోడు ఉప ఎన్నికకు నామినేషన్ల ఘట్టం ముగిసింది. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు అట్టహాసంగా నామినేషన్లు దాఖలు చేశారు. సాధారణంగా ఎన్నికలంటేనే ఆడంబరాలను ప్రదర్శిస్తుంటారు అభ్యర్థులు.
మునుగోడు ఉప ఎన్నిక ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచుతున్నాయి.. ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల పర్వానికి ఇవాళ్టితో తెరపడింది.. దాదాసు 90 మందికి పైగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్టు తెలుస్తోంది.. చివరి రోజు కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి నామినేషన్ దాఖలు చేశారు.. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఆమె భావోద్వేగానికి లోనయ్యారు.. విస్తృతంగా ప్రచారం.. సభల్లో.. కార్యకర్తలతో.. ప్రజలతో మాట్లాడడంతో.. ఆమె గొంతు బొంగురుపోయింది.…
Munugode : తెలంగాణాలో ప్రస్తుతం ఏ నోట విన్నా మునుగోడు ముచ్చట్లే.. ప్రధానంగా బరిలో ఉన్న మూడు పార్టీలు మునుగోడు ఉప ఎన్నికలో తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు కావాల్సిన శక్తినంతా కూడగట్టుకుంటున్నాయి.
మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో ఇవాళ ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది.. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్రెడ్డి.. బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. ప్రచారంలో ఎదురుపడ్డారు.
బీజేపీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. 18వేల కోట్ల కాంట్రాక్టులు వదులుకో లేదంటే.. హైదరాబాద్ భాగ్యలక్ష్మి గుడికి రా.. మీ గుండు సంజయ్ మీద ఒట్టు వెయ్యి కాంట్రాక్టులు రాలేదని అంటూ ఛాలెంజ్ చేశారు.
కాంగ్రెస్ ఇంచార్జి మాణిక్కం ఠాగూర్ నేడు హైదరాబాద్ రానున్నారు. ఠాగూర్ నెల రోజుల పాటు రాష్ట్రంలోనే ఉంటారు. మునుగోడు ఉప ఎన్నిక, రాహుల్ భారత్ జోడో యాత్ర నేపథ్యంలో ఠాగూర్ రంగంలోకి దిగారు. ఇవాళ సాయంత్రం వచ్చి మూడు రోజుల తర్వాత వెళ్లి మళ్లీ నగరానికి తిరిగి రానున్నారు.
ప్రధాని మోడీ, అమిత్ షా... కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అప్పనంగా కట్టబెట్టిన రూ. 18 వేల కోట్లు.. మునుగోడు, నల్గొండ నియోజకవర్గాల అభివృద్ధికి ఇవ్వండి... అలా చేస్తే తాము ఉప ఎన్నికల బరి నుంచి తప్పుకుంటామని ప్రకటించారు మంత్రి జగదీష్ రెడ్డి