Munugode Bypoll: మునుగోడులో ఆసక్తికర ఘటన.. కాంగ్రెస్, బీఎస్పీ చీఫ్ల భేటీ.. సంతృప్తి వ్యక్తం చేసిన రేవంత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాజకీయాలు మొత్తం ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక చుట్టూ తిరుగుతున్నాయి.. అన్ని పార్టీల జాతీయ నేతల నుంచి రాష్ట్ర నేతలు, ఇతర జిల్లాల నేతలు.. ఇలా అంతా మునుగోడుకే క్యూ కడుతున్నారు.. తమ పార్టీ తరపున ప్రచారం చేస్తూ.. ఓట్లు అడుగుతున్నారు.. అయితే, మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో ఇవాళ ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది.. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్రెడ్డి.. బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. ప్రచారంలో ఎదురుపడ్డారు.. దీంతో.. నమస్తే ప్రవీణ్ అన్నా అంటూ.. ఆర్ఎస్ ప్రవీణ్ దగ్గరకు వెళ్లి పలుకరించి ఆలింగనం చేసుకున్నారు రేవంత్రెడ్డి.. ఇక, ఇద్దరూ కలిసి ఫొటోలకు పోజులిచ్చారు.. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన రేవంత్రెడ్డి.. సంతోషాన్ని వ్యక్తం చేశారు..
Read Also: Etela Rajender : ప్రపంచం మొత్తం మునుగోడు వైపు చూస్తుంది
Also Read
- Ponguleti Srinvias Reddy : తెలంగాణలో ఇళ్లు లేని వారికి గుడ్న్యూస్ చెప్పిన మంత్రి పొంగులేటి..
- Bandi Bhagirath : బండి భగీరథ్ కోసం ముమ్మర వేట.. రంగంలోకి నాలుగు ప్రత్యేక బృందాలు..!
- NIMS : నిమ్స్లో 'కిడ్నీ రాకెట్'.. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప క్లారిటీ
- Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
”మునుగోడుకు వెళ్తూ మార్గం మధ్యలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ గారిని కలిశాను. మా ఈ కలయిక యాధృచ్ఛికమే… సమ సమాజ ఉన్నతి కోసం ప్రవీణ్ లాంటి వారితో కలిసి భావాలు పంచుకోవడం సమాజానికి అవసరం, నాకు సంతృప్తి.” అంటూ రాసి.. ఆ ఫొటోలను షేర్ చేశారు రేవంత్రెడ్డి.. కాగా, మునుగోడులో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ, బీఎస్పీ, ప్రజాశాంతి లాంటి పార్టీలతో పాటు పెద్ద సంఖ్యలో ఇండిపెండెంట్లు కూడా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు.. కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి.. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయడంతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యం అయిన విషయం తెలిసిందే.. కాంగ్రెస్ను వీడిన ఆయన.. ఈ సారి బీజేపీ నుంచి తన అదృష్ట్యాన్ని పరిక్షించుకోవడానికి సిద్ధం అయ్యారు. నవంబర్ 3వ తేదీన మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే.
మునుగోడుకు వెళుతు మార్గమధ్యంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ గారిని కలిశాను. మా ఈ కలయిక యాదృచ్ఛికమే. సమ సమాజ ఉన్నతి కోసం ప్రవీణ్ లాంటి వారితో కలిసి భావాలు పంచుకోవడం సమాజానికి అవసరం, నాకు సంతృప్తి.@RSPraveenSwaero pic.twitter.com/mcLmGgegtO
— Revanth Reddy (@revanth_anumula) October 11, 2022
తాజావార్తలు
-
Thailand Train Crash: బ్యాంకాక్లో ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు.. 8 మంది మృతి
-
CM Vijay-Kamal haasan: సీఎం విజయ్తో కమల్హాసన్ భేటీ.. ప్రత్యేక బహుమతి అందజేత
-
Malavika Mohanan: విజయ్తో నా బంధంపై అసభ్యకర ప్రశ్నలా?.. తమిళ మీడియాపై మాళవిక మోహనన్ ఫైర్!
-
AIADMK: అన్నాడీఎంకేలో ముదిరిన సంక్షోభం.. పార్టీ ఆఫీసుల కోసం వర్గపోరు..
-
Mamata Banerjee: ఉంటే.. ఉండండి.. లేకపోతే వెళ్లిపోండి.. జంపింగ్లకు మమత సందేశం
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..