Munugode Bypoll: ఉప ఎన్నిక బరి నుంచి తప్పుకుంటాం.. మంత్రి జగదీష్రెడ్డి సంచలన ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మునుగోడు ఉప ఎన్నిక ఓవైపు తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతోన్న సమయంలో… సంచలన ప్రకటన చేశారు మంత్రి జగదీష్రెడ్డి.. మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న ఆయన.. హాట్ కామెంట్లు చేశారు.. ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాలకు ఛాలెంజ్ చేశారు.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మోడీ, అమిత్ షా ఇచ్చిన రూ. 18 వేల కోట్ల కాంట్రాక్టులపై స్పందిస్తూ.. రాజగోపాల్ రెడ్డికి అప్పనంగా కట్టబెట్టిన రూ. 18 వేల కోట్లు.. మునుగోడు, నల్గొండ నియోజకవర్గాల అభివృద్ధికి ఇవ్వండి… అలా చేస్తే తాము ఉప ఎన్నికల బరి నుంచి తప్పుకుంటామని ప్రకటించారు.. మీరు అలా చేస్తే.. ఉప ఎన్నిక నుంచి తప్పుకుంటాం.. ఈ విషయంలో సీఎం కేసీఆర్ను ప్రాధేయపడైనా తాను ఒప్పిస్తామని వెల్లడించారు జగదీష్రెడ్డి..
Read Also: Eknath Shinde: మాకు వీటిలో ఓ ఓ గుర్తు కేటాయించండి.. ఈసీకి ఏక్నాథ్ షిండే వర్గం విజ్ఞప్తి..
Also Read
- Rajanna Sircilla: పానీపూరి ఫుడ్ పాయిజన్ కలకలం.. 10 మందికి పైగా చిన్నారులకు అస్వస్థత.!
- Telangana Public School: ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్' ప్రారంభించనున్న సీఎం.!
- Secunderabad Bonalu 2026: సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాలపై క్లారిటీ.. తేదీ, పూర్తి వివరాలు ఇవే..
- ACB Raids: ఆదాయానికి మించిన ఆస్తులు.. డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో ఏసీబీ దాడులు.!
తాను.. కమ్యూనిస్టు సోదరుల సాక్ష్యంగా చెబుతున్నా.. ఆయన సొంతానికి ఇచ్చే సొమ్ము జిల్లా అభివృద్ధికి ఇవ్వండి అని సవాల్ చేశారు.. ఇక, రాజకీయాల కొరకే ఉప ఎన్నికలు సృష్టించారని మండిపడ్డ జగదీష్రెడ్డి.. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడానికి ఈ కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారన్నారు.. సస్యశ్యామలం అవుతున్న తెలంగాణలో మంటలు సృష్టించే కుయుక్తులు చేస్తున్నారు.. హిందూ మతం గురించి వేదాలు వల్లించే బీజేపీ ప్రభుత్వం.. యాదాద్రి పునర్ నిర్మాణానికి 100 రూపాయల చందా కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.. హిందూ మతానికి అంబాసిడర్లు అంటూ ఇతర మతాల మీద విషం చిమ్మే బీజేపీ.. యాదాద్రి పునర్ నిర్మాణానికి నిధులు ఎందుకు ఇవ్వలేదు? అని నిలదీశారు.. గల్లీ, గల్లీ లో కేంద్రమంత్రులు తిరుగుతున్నారు.. ఎవరూ… ఏ ఒక్కరోజు తెలంగాణ అభివృద్ధికి పైసా విదల్చ లేదని ఆరోపించారు.
వడ్డీకి అప్పులు తెచ్చి భవిష్యత్ తరాలకు విద్యుత్ సరఫరాలో ఇబ్బంది ఉండొద్ద సంకల్పంతో విద్యుత్ ప్లాంట్లు నిర్మిస్తున్నాం అన్నారు జగదీష్రెడ్డి.. రాజగోపాల్ రెడ్డికి రాజకీయ ప్రయోజనాల కోసం, రాజకీయ కుట్రలకు తెర లేపేందుకు మాత్రమే ఆయనకు రూ. 18000 కోట్లు ఇచ్చారని మండిపడ్డారు.. బీజేపీ కుట్రలకు అండగా నిలిచినందుకే రాజగోపాల్ రెడ్దికి రూ.18000 వేల కోట్లు ఇచ్చారు.. ఇప్పటికీ చెబుతున్నా.. ఆ 18,000 కోట్లు మా నల్లగొండ జిల్లాకు, మా మునుగోడుకు ఇవ్వండి.. మునుగోడు నియోజకవర్గ పరిధిలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తామని సూచించారు మంత్రి జగదీష్రెడ్డి.
తాజావార్తలు
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!
-
Microsoft Surface Pro: OLED డిస్ప్లే, 16GB RAM, ప్రీమియం ఫీచర్లతో.. మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ప్రో ల్యాప్టాప్ విడుదల
-
SBI ATM Robbery: బుక్కరాయసముద్రంలో ఎస్బీఐ ఏటీఎం చోరీ.. నగదు దోచుకుని మిషన్ను..!
-
FIFA World Cup: సెనెగల్పై ‘కిలియన్ ఎంబాపే’ డబుల్ ట్రీట్.. 3-1 తేడాతో విజయం.!
-
The India Story : కాజల్ అగర్వాల్ ‘ది ఇండియా స్టోరీ’ మూవీ స్టోరీ లీక్
ట్రెండింగ్
-
Historical Day: నేడు ట్రిపుల్ ధమాకా.. టీమిండియా ఫ్యాన్స్కు పండగే.. 12 గంటల పాటు నాన్స్టాప్ ఎంటర్టైన్మెంట్!
-
8560mAh భారీ బ్యాటరీ, 6000 నిట్స్ డిస్ప్లే, IP69K రక్షణతో HONOR X70 Pro Max లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 7540mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI Turbo 5 లాంచ్.! ధర ఎంతంటే.?
-
T20 World Cup 2026లో సంచలనం.. శ్రీలంక చరిత్రాత్మక విజయం.. డిఫెండింగ్ ఛాంపియన్కు వరుసగా రెండో షాక్!
-
6000mAh బ్యాటరీ, IP69 రేటింగ్, 50MP సోనీ కెమెరాతో TECNO SPARK 50 Pro లాంచ్.!