Munugode Bypoll: ఉప ఎన్నిక బరి నుంచి తప్పుకుంటాం.. మంత్రి జగదీష్రెడ్డి సంచలన ప్రకటన
మునుగోడు ఉప ఎన్నిక ఓవైపు తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతోన్న సమయంలో… సంచలన ప్రకటన చేశారు మంత్రి జగదీష్రెడ్డి.. మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న ఆయన.. హాట్ కామెంట్లు చేశారు.. ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాలకు ఛాలెంజ్ చేశారు.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మోడీ, అమిత్ షా ఇచ్చిన రూ. 18 వేల కోట్ల కాంట్రాక్టులపై స్పందిస్తూ.. రాజగోపాల్ రెడ్డికి అప్పనంగా కట్టబెట్టిన రూ. 18 వేల కోట్లు.. మునుగోడు, నల్గొండ నియోజకవర్గాల అభివృద్ధికి ఇవ్వండి… అలా చేస్తే తాము ఉప ఎన్నికల బరి నుంచి తప్పుకుంటామని ప్రకటించారు.. మీరు అలా చేస్తే.. ఉప ఎన్నిక నుంచి తప్పుకుంటాం.. ఈ విషయంలో సీఎం కేసీఆర్ను ప్రాధేయపడైనా తాను ఒప్పిస్తామని వెల్లడించారు జగదీష్రెడ్డి..
Read Also: Eknath Shinde: మాకు వీటిలో ఓ ఓ గుర్తు కేటాయించండి.. ఈసీకి ఏక్నాథ్ షిండే వర్గం విజ్ఞప్తి..
Also Read
- Kavitha: పాత రాజకీయాలకు విసిగిపోయారు.. తెలంగాణలో కూడా మార్పు తథ్యం: కవిత
- Labour Cards: శుభవార్త.. అర్హులైన ప్రతి ఒక్కరికీ లేబర్ కార్డులు..
- Karimnagar PMJ Jewellery : పీఎంజే జ్యువెల్లరీ దొంగల ఫోటోలు విడుదల.. ఆచూకీ చెబితే లక్ష నజరానా.!
- Unusual Weather : తెలుగు రాష్ట్రాల్లో భిన్నవాతావరణం... పగలు సెగలు..సాయంత్రం జల్లులు
తాను.. కమ్యూనిస్టు సోదరుల సాక్ష్యంగా చెబుతున్నా.. ఆయన సొంతానికి ఇచ్చే సొమ్ము జిల్లా అభివృద్ధికి ఇవ్వండి అని సవాల్ చేశారు.. ఇక, రాజకీయాల కొరకే ఉప ఎన్నికలు సృష్టించారని మండిపడ్డ జగదీష్రెడ్డి.. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడానికి ఈ కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారన్నారు.. సస్యశ్యామలం అవుతున్న తెలంగాణలో మంటలు సృష్టించే కుయుక్తులు చేస్తున్నారు.. హిందూ మతం గురించి వేదాలు వల్లించే బీజేపీ ప్రభుత్వం.. యాదాద్రి పునర్ నిర్మాణానికి 100 రూపాయల చందా కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.. హిందూ మతానికి అంబాసిడర్లు అంటూ ఇతర మతాల మీద విషం చిమ్మే బీజేపీ.. యాదాద్రి పునర్ నిర్మాణానికి నిధులు ఎందుకు ఇవ్వలేదు? అని నిలదీశారు.. గల్లీ, గల్లీ లో కేంద్రమంత్రులు తిరుగుతున్నారు.. ఎవరూ… ఏ ఒక్కరోజు తెలంగాణ అభివృద్ధికి పైసా విదల్చ లేదని ఆరోపించారు.
వడ్డీకి అప్పులు తెచ్చి భవిష్యత్ తరాలకు విద్యుత్ సరఫరాలో ఇబ్బంది ఉండొద్ద సంకల్పంతో విద్యుత్ ప్లాంట్లు నిర్మిస్తున్నాం అన్నారు జగదీష్రెడ్డి.. రాజగోపాల్ రెడ్డికి రాజకీయ ప్రయోజనాల కోసం, రాజకీయ కుట్రలకు తెర లేపేందుకు మాత్రమే ఆయనకు రూ. 18000 కోట్లు ఇచ్చారని మండిపడ్డారు.. బీజేపీ కుట్రలకు అండగా నిలిచినందుకే రాజగోపాల్ రెడ్దికి రూ.18000 వేల కోట్లు ఇచ్చారు.. ఇప్పటికీ చెబుతున్నా.. ఆ 18,000 కోట్లు మా నల్లగొండ జిల్లాకు, మా మునుగోడుకు ఇవ్వండి.. మునుగోడు నియోజకవర్గ పరిధిలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తామని సూచించారు మంత్రి జగదీష్రెడ్డి.
తాజావార్తలు
-
Election Results 2026: తమిళనాడులో హంగ్కే అవకాశం..! 4 రాష్ట్రాలు+UT ఎన్నికల ఫలితాలు.. మినిట్స్ టు మినిట్స్ అప్డేట్స్..
-
Bengal Election Results Live Updates: బెంగాల్ బాద్షా బీజేపీ..! టీఎంసీకి మరో షాక్..! అప్డేట్స్ మీకోసం..
-
Duvvada Madhuri : త్రిష కోరికతో పాటు నా కోరిక కూడా నెరవేరింది
-
Jofra Archer: అద్భుతం.. విజయ్ గెలుపును ముందే ఊహించి ట్వీట్ చేసిన క్రికెటర్ జోఫ్రా ఆర్చర్..
-
Mumbai Indians: ఐపీఎల్లో వరుస ఓటములు.. అయినా ప్రపంచ రికార్డు సొంతం చేసుకున్న ముంబై ఇండియన్స్…
-
Vijay Dhamu: ఆటో స్టాండ్ నుంచి అసెంబ్లీకి.. రాయపురంలో మాజీ మంత్రి కోటను కూల్చిన సామాన్యుడు!
-
CM Chandrababu : గ్లోబల్ బ్రాండ్లుగా స్థానిక ఉత్పత్తులు.. ఏపీలో ప్రొడక్ట్ పర్ఫెక్షన్ క్లస్టర్లపై చంద్రబాబు సమీక్ష
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!