Munugode bypoll: మునుగోడులో గుర్రంపై వచ్చి నామినేషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Munugode bypoll: మునుగోడు ఉప ఎన్నికకు నామినేషన్ల ఘట్టం ముగిసింది. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు అట్టహాసంగా నామినేషన్లు దాఖలు చేశారు. సాధారణంగా ఎన్నికలంటేనే ఆడంబరాలను ప్రదర్శిస్తుంటారు అభ్యర్థులు. అందులో నామినేషన్లకు కూడా మంది మార్బలంతో వస్తుంటారు. కొన్ని చోట్ల భారీ ర్యాలీతో నామినేషన్లు వేస్తుంటారు. ప్రస్తుతం తెలంగాణలో మునుగోడు ఉపఎన్నికలను అన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో మునుగోడు బైపోల్లో ప్రజలను ఆకర్షించేందుకు పెద్ద ఎత్తున్న జనసమీకరణ చేసి ఆర్భాటంగా నామినేషన్లు దాఖలు చేశారు.
Read Also: Palle Ravikumar : కాంగ్రెస్కు షాక్.. టీఆర్ఎస్లోకి పల్లె రవి దంపతులు
Also Read
- Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
- Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
- Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ఇదిలా ఉండగా.. నామినేషన్ల దాఖలులో ఓ అభ్యర్థి ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. నియోజకవర్గంలోని నాంపల్లి మండలం కుమ్మరిగూడెంకు చెందిన వీరభోగ వసంతరాయలు గుర్రంపై వచ్చి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. వృత్తిరీత్యా వైద్యుడైన వసంతరాయుడు.. హైదరాబాద్ పరిధిలోని ఎల్బీనగర్లో హాస్పిటల్ నిర్వహిస్తున్నారు. ఇలా వినూత్నంగా గుర్రంపై వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. అది చూసిన స్థానికులు భలేగా ఉందంటూ వ్యాఖ్యలు చేశారు. కొందరు ఫొటోలు తీసి స్థానిక వాట్సాప్ గ్రూపులలో, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.
Read Also: Spanish Paper: దుమారం రేపుతున్న భారత ఆర్థిక వ్యవస్థపై స్పానిష్ పేపర్ కథనం
నియోజకవర్గంలో బీసీ ఓట్లు అధికంగా ఉన్నప్పటికీ ప్రధాన పార్టీలు బీసీలకు టికెట్లు కేటాయించకపోటం బాధాకరమని వసంతరాయుడు అన్నారు. బీసీలను ప్రభుత్వం గుర్తించాలన్న ఉద్దేశ్యంతోనే గుర్రంపై వచ్చి నామినేషన్ దాఖలు చేసినట్లు తెలిపారు. టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే.. మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని మంత్రి కేటీఆర్ చెప్పటం విడ్డూరంగా ఉందని ఆయన వ్యాఖ్యనించారు. మంత్రిగా రాష్ట్రం మొత్తాన్ని కేటీఆర్ అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఉప ఎన్నికలు ఉన్నచోట్లే అభివృద్ధి చేస్తామని చెప్పటం దారుణమన్నారు.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..