మహారాష్ట్రలోని ముంబైలో ఇటీవల భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సముద్రంపై నిర్మించిన అటల్ సేతు బ్రిడ్జ్ను ప్రారంభించారు. అయితే, ముంబైలోని సెవ్రి నుంచి రాయ్గడ్ జిల్లాలోని నవ సేవా వరకు ఆ బ్రిడ్జ్ కనెక్టవిటీ కలిగి ఉంది. ఇక, శనివారం నుంచి ఈ బ్రిడ్జ్ ప్రయాణికుల అందుబాటులోకి వచ్చింది. ఇక, ఈ బ్రిడ్జ్పై వాహనదారులు రూల్స్ ఉల్లంఘించి ప్రవేశిస్తున్నారు.
Read Also: Komatireddy: ఆ ప్రాజెక్టు కు జైపాల్ రెడ్డి పేరు పెడతాం..? రేవంత్ రెడ్డితో చర్చిస్తామన్న కోమటిరెడ్డి
అయితే, ముంబై ట్రాఫిక్ పోలీసులు విధించిన ఆంక్షలను ఓ ఆటో డ్రైవర్ బ్రేక్ చేశాడు. 21.8 కిలో మీటర్ల దూరం ఉన్న ఈ బ్రిడ్జ్ పై ఓ ఆటో ప్రయాణం చేస్తూ కనిపించింది. నిజానికి మూడు చక్రాల వెహికిల్స్ కు ఈ బ్రిడ్జ్ మీదకు అనుమతి లేదు.. కానీ ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జ్పై ఆటో తిరుగుతున్నట్లు ఓ వ్యక్తి ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది.. కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో అనేక మంది నెటిజెన్లు ఆ ఆటోను చూసి షాక్ అవుతున్నారు. ఆ ఆటో డ్రైవర్పై తగిన చర్యలు తీసుకోవాలని కొందరు కోరుతుంటే.. చిర్లే, ఉల్వేలో టోల్ బూత్ ఉంటుంది.. ఇక ముంబై వైపుకు అయితే సోబో దగ్గర టోల్ గేట్ ఉంటుంది.. అక్కడ నుంచి ఆటోలకు అనుమతి ఉండదు.. మరీ ఈ ఆటో ఎలా వచ్చిందని మరో వ్యక్తి కామెంట్ చేశాడు.
Read Also: MP Vijay Sai Reddy: సీఎం జగన్కు అంబేద్కర్పై ఉన్న అభిమానంతో విగ్రహ నిర్మాణం.. 19న ప్రారంభోత్సవం
ఇక, ఆ ఆటోవాలా కనీసం ఓ ఫోటో కోసం కూడా ఆగలేదని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు. కొత్త బ్రిడ్జ్ను ఆటో సేతు అంటూ మరో యూజర్ వ్యాఖ్యనించాడు. ఆటో వెనుక ఎఫ్ఐఆర్ మిలేంగే అని రాసి అతను హెచ్చరికలు జారీ చేసినట్లు మరో యూజర్ పేర్కొన్నారు. మొత్తానికి ఆ ఆటోవాలాకు చెలాన్ వేయ్యాలని కొందరు నెటిజన్స్ కోరారు. మొత్తానికి అటల్ సేతు బ్రిడ్జ్ మీదకు ఈ ఆటోను ఎవరు అనుమతించారు అనే దానిపై పోలీసులు విచారణ చేస్తు్న్నారు.
Atal setu pic.twitter.com/YOVp08VmLm
— Saravanan Radhakrishnan ☮️ (@saravnan_rd) January 15, 2024