ఆసియా బిలియనీర్ క్యాపిటల్గా తొలిసారి భారత ఆర్థిక రాజధాని ముంబై నిలిచింది. ముంబైలో మొత్తం 92 మంది బిలియనీర్లు మాత్రమే ఉండగా.. ఈ సంఖ్య బీజింగ్లో 91గా ఉంది.
Drug Network: తెలంగాణ క్రమక్రమంగా డ్రగ్స్కు అడ్డాగా మారుతోంది. పంజాగుట్ట పోలీసులు పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుకున్నారు. దేశంలోనే అతి పెద్ద డ్రగ్స్ లింకును పోలీసులు ఛేదించారు.
ప్రతి ఒక్కరూ తమ ఇల్లు, ఆ ఇంటి నుంచి మంచి వ్యూ ఉండాలని కోరుకుంటారు. ఇక ధనికులైతే లేక్వ్యూ, సీ వ్యూ ఉండేలా కోట్లు వెచ్చించి ఇంటిని నిర్మించుకుంటారు. ఆ కోవలోనే రేఖా ఝున్జున్వాలా తన ఇంటి నుంచి అరేబియా సముద్రాన్ని చూసేందుకు రూ.118 కోట్లు ఖర్చు చేసింది.
Pradeep Sharma: 2006లో గ్యాంగ్స్టర్ ఛోటా రాజన్ సన్నిహితుడు రామ్నారాయణ్ గుప్తా బూటకపు ఎన్కౌంటర్ కేసులో మాజీ పోలీసు ప్రదీప్ శర్మను దోషిగా నిర్ధారించి బాంబే హైకోర్టు మంగళవారం జీవిత ఖైదు విధించింది. జస్టిస్ రేవతి మోహితేదేరే, గౌరీగాడ్సేలతో కూడిన డివిజన్ బెంజ్ ‘ఫేక్ ఎన్కౌంటర్’ కేసులో ఆయనను దోషిగా తేల్చింది. ఈ కేసులో సెషన్స్ కోర్టు 2013లో ప్రదీప్ శర్మ నిర్దోషి అని చెప్పిన తీర్పును హైకోర్ట్ తప్పుపట్టింది.
Rahul Gandhi: భారత్ జోడో న్యాయ్ యాత్ర ముగింపు సభ ముంబైలో జరిగింది. లోక్సభ ఎన్నికల ముందు ఇండియా కూటమి నేతలు బలప్రదర్శనకు వేదికగా నిలిచింది. ముంబైలోని శివాజీ పార్కులో ఈ సమావేశం జరిగింది. మల్లికార్జున ఖర్గే, శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే, తేజస్వీ యాదవ్, మెహబూబా ముఫ్తీ, స్టాలిన్, ఫరూఖ్ అబ్దుల్లా వంటి నేతలు హాజరయ్యారు.
Bharat Jodo Nyay Yatra: లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన రెండో రోజు ఇండియా కూటమి బలప్రదర్శన నిర్వహించింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ ఈ రోజు ముంబైలో ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమానికి ఇండియా కూటమి నేతలు హాజరయ్యారు. 63 రోజుల పాటు జరిగిన ఈ యాత్ర ముగింపు వేడుకలు ముంబైలోని శివాజీ పార్క్లో జరిగాయి. ఈ కార్యక్రమానికి తేజస్వీ యాదవ్, ఎంకే స్టాలిన్, మల్లికార్జున్ ఖర్గే, శరద్ పవార్,…
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి ముంబాయి వెళ్లాల్సిన ఇండిగో విమానం (6E5099) ఆలస్యం అయింది. మధ్యాహ్నం 2:30 గంటలకు ముంబై వెళ్లాల్సిన విమానంలో సాంకేతికలోపం తలెత్తింది. విమానంలోని ఇంజన్ లో ఓవర్ హీట్ సమస్య రావడంతో ఏసీ సమస్య మొదలై.. విమానం అలస్యం అయింది.
బాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద అంటే వచ్చే మొదటి సంధానం అమితాబ్ బచ్చన్. బాలీవుడ్ దిగ్గజమైన అమితాబ్ బచ్చన్ గురించి తాజాగా కొన్ని రూమర్స్ స్ప్రెడ్ కావడంతో తాజాగా ఆయన స్పందించారు. ముంబై నగరంలోని కోకిలబెన్ ఆస్పత్రిలో చేరారని., ఆయన కాలికి రక్తం గడ్డ కట్టడంతో వైద్యులు యాంజియోప్లాస్టీ చేసినట్లు సోషల్ మీడియాలో అనేక ఫేక్ వార్తలు చెక్కర్లు కొట్టాయి. దేశంలోని ఆయన అభిమానులందరూ కాస్త ఆందోళనలకు గురయ్యారు. ముందుగానే వయసు మీద పడటంతో ఆయన హాస్పిటల్ లో…
తాజాగా జరుగుతున్న 2024 రంజీ ట్రోఫీ ఫైనల్ లో విదర్భ పై ముంబయి ఘన విజయం సాధించింది. మొదట్లో వన్ సైడ్ గా జరిగిన మ్యాచ్ చివరికి హోరాహోరీగా సాగింది. కాకపోతే చివరకి 169 పరుగుల తేడాతో విదర్భ పై నెగ్గిన ముంబయి 42వ సారి రంజీ ఛాంపియన్ గా అవతరించింది. చివరిసారిగా ముంబయి జట్టు 2015 – 16లో టైటిల్ గెలిచింది. 538 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన విదర్భ రెండో ఇన్నింగ్స్ లో…
Bombay High Court: అర్ధరాత్రి ఒంటిగా ఉన్న మహిళ ఇంటి తలుపు తట్టిని అధికారి కేసును బాంబే హైకోర్టు విచారించింది. తప్పుడు ప్రవర్తన కారణంగా అతనిపై విధించిన జరిమానాను రద్దు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. జస్టిస్ నితిన్ జామ్దార్, ఎంఎం సతయేలతో కూడిన డివిజన్ బెంచ్ మార్చి 11న ఈ కేసును విచారించింది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్)కి చెందిన కానిస్టేబుల్ ఈ ఘటనకు పాల్పడ్డాడని, అంతకుముందు మద్యం సేవించి ఉన్నాడని, తన సహోద్యోగి అయిన మహిళ…