వీకెండ్ సందర్భంగా ఐపీఎల్లో నేడు రెండు మ్యాచ్లు జరగనున్నాయి. మధ్యాహ్నం 3:30 గంటలకు చెన్నై సూపర్కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఈ రెండు జట్లూ ఇప్పటివరకు టోర్నీలో బోణీ కొట్టలేదు. ఆడిన మూడు మ్యాచ్ల్లో ఓడి చెన్నై హ్యాట్రిక్ ఓటమిని మూటగట్టుకోగా.. సన్రైజర్స్ హైదరాబాద్ కూడా వరుసగా రెండు మ్యాచ్ల్లోనూ పరాజయం పాలైంది. దీంతో ఈ మ్యాచ్ రెండు జట్లకు కీలకం కానుంది. సన్రైజర్స్ టీమ్ కూర్పుపై విమర్శలు వస్తుండటంతో ఈ మ్యాచ్లో కెప్టెన్ విలియమ్సన్…
ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టు వరుస ఓటములపై టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎంతటి గొప్ప కెప్టెన్ అయినా సరైన ఆటగాళ్లు లేకపోతే ఏం చేయలేడని కైఫ్ అభిప్రాయపడ్డాడు. ముంబై ఇండియన్స్ హ్యాట్రిక్ పరాజయాలకు రోహిత్ శర్మ కెప్టెన్సీకి ఏం సంబంధం లేదని కైఫ్ అన్నాడు. తన దృష్టిలో రోహిత్ శర్మ గొప్ప సారథి అని స్పష్టం చేశాడు. సరైన ఆటగాళ్లు లేకుంటే జట్టులో ఎంతటి గొప్ప కెప్టెన్ ఉన్నా టీమ్ను…
బుధవారం రాత్రి ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ బ్యాట్స్మెన్ నితీష్ రానాపై మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించడంతో పాటు మందలించారు. అయితే ఆ తప్పు ఏంటన్నది మ్యాచ్ రిఫరీ వెల్లడించలేదు. నితీష్ రాణా తన తప్పిదాన్ని అంగీకరించడంతో జరిమానాతో సరిపెట్టారు. లేకుంటే అతనిపై ఓ మ్యాచ్ నిషేధం పడేది. మరోవైపు ముంబై ఇండియన్స్ బౌలర్ బుమ్రా కూడా నిబంధనలు ఉల్లంఘించినట్లు తెలుస్తోంది.…
ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తీరు మారడం లేదు.. ఈ సీజన్లో ఓటముల పరంపర కొనసాగుతూనే ఉంది.. ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 162 పరుగుల లక్ష్యాన్ని కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఆడుతూ పాడుతూ ఛేదించింది. 16 ఓవర్లు ఆడిన కోల్కతా ఇంకో నాలుగు ఓవర్లు మిగిలుండగానే మ్యాచ్ను ముగించింది. ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ ప్యాట్ కమిన్స్ హాఫ్ సెంచరీలతో రాణించారు. కమిన్స్ కుమ్మేశాడు. ఆఖరిలో వచ్చి బ్యాట్ తో విధ్వంసం సృష్టించాడు. సిక్సుల వర్షం కురిపించాడు. మ్యాచ్…
ఐపీఎల్లో భారీ అంచనాలతో బరిలో దిగిన ముంబై ఇండియన్స్ జట్టు తడబడుతోంది. గత రెండు మ్యాచ్లలో ఓటమి పాలైన ఆ జట్టు మూడో మ్యాచ్లోనూ తడబడింది. కోల్కతాతో జరుగుతున్న మ్యాచ్తో ఈ సీజన్లోకి ఎంట్రీ ఇచ్చిన సూర్యకుమార్ యాదవ్ రాణించడంతో చెప్పుకోదగ్గ స్కోరు చేసింది. ఓపెనర్లు రోహిత్ (3), ఇషాన్ కిషన్ (14) విఫలమైనా సూర్యకుమార్ (52), తెలుగు కుర్రాడు తిలక్ వర్మ (38 నాటౌట్), పొలార్డ్ (22 నాటౌట్) మెరుపుల కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో…
టీమిండియా స్టార్ ఆటగాడు రోహిత్ శర్మను మరో రికార్డు ఊరిస్తోంది. బుధవారం కోల్కతా నైట్రైడర్స్తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ మరో 54 పరుగులు చేస్తే.. టీ20 ఫార్మాట్లో 10వేల పరుగులు బాదిన ఆటగాడిగా రోహిత్ ఘనత దక్కించుకుంటాడు. విరాట్ కోహ్లీ ఇప్పటికే టీ20 ఫార్మాట్లో 10వేల పరుగులు నమోదు చేసిన తొలి భారత ఆటగాడిగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అయితే ఓవరాల్గా చూసుకుంటే టీ20 ఫార్మాట్లో 10వేల పరుగులు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 భాగంగా ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ గ్రాండ్ విక్టరీ కొట్టింది.. జోస్ బట్లర్ సెంచరీ.. రాజస్థాన్ రాయల్స్కు 23 పరుగుల తేడాతో విజయం సాధించి పెట్టింది.. ముంబైతో జరిగిన మ్యాచ్లో సంజూ శాంసన్ నేతృత్వంలోని జట్టు వేగంగా నాలుగు వికెట్లు పడగొట్టడంతో రాజస్థాన్ రాయల్స్ అద్భుతమైన గెలుపు నమోదు చేసింది.. ఇషాన్ కిషన్, తిలక్ వర్మ హాఫ్ సెంచరీలతో ముంబైని పటిష్టమైన స్కోర్ వైపు నడిపించే…
ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టు ఎంత పటిష్టమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు అత్యధికంగా ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న ముంబై ఇండియన్స్.. ఓటముల్లో కూడా రికార్డులు నెలకొల్పుతోంది. 2013 నుంచి ఇప్పటివరకు ప్రతి ఐపీఎల్ సీజన్లో ఆ జట్టు ఆడిన తొలి మ్యాచ్లో ఓడిపోతూనే వస్తోంది. తాజాగా ఈ సీజన్ ఐపీఎల్లోనూ తొలి మ్యాచ్లో ఓటమి పాలైంది. ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో పరాజయం చెందింది. దీంతో…
ఐపీఎల్ 15వ సీజన్ను ఢిల్లీ క్యాపిటల్స్ విజయంతో ప్రారంభించింది. పటిష్ట ముంబై ఇండియన్స్ జట్టును 4 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. ముంబై ఇండియన్స్ విధించిన 178 పరుగుల విజయలక్ష్యాన్ని 18.2 ఓవర్లలోనే ఉఫ్ మని ఊదేసింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా లలిత్ యాదవ్ (48 నాటౌట్), అక్షర్ పటేల్ (38 నాటౌట్) మెరుపు వేగంతో బ్యాటింగ్ చేసి ఢిల్లీ జట్టును గెలిపించారు. దీంతో ముంబై ఓపెనర్ ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ బూడిద పాలైపోయింది. పృథ్వీ షా (38),…
ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం ఇద్దరు విదేశీ ఆటగాళ్లతోనే బరిలోకి దిగింది. నిబంధనల ప్రకారం ప్రతి టీమ్ నలుగురు విదేశీ ఆటగాళ్లను తుది జట్టులో ఆడించే అవకాశం ఉంటుంది. కానీ రిషబ్ పంత్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మాత్రం న్యూజిలాండ్ ఆటగాడు టిమ్ సీఫెర్ట్, వెస్టిండీస్ ఆటగాడు ఆర్.పావెల్కు మాత్రమే జట్టులో అవకాశం కల్పించింది. గతంలో 2011లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కూడా కేవలం ఇద్దరు విదేశీ ఆటగాళ్లతోనే బరిలోకి…