కేటీఆర్.. జన్వాడ ఫాం హౌస్ నాది కాదంటారు..? మిత్రున్ని కోర్టుకు పంపించారు.. అక్రమ నిర్మాణం కూల్చాలి అంటారు.. ఇంకో పక్క కోర్టులో స్టేకి వెళ్ళారని ఎంపీ చామల కిరణ్ అన్నారు. కేటీఆర్ పక్కన ఉండే చిల్లర మనుషులు మార్ఫింగ్ ఫోటోలతో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని.. ఎఫ్టీఎల్ పరిధిలో ఎవరికి ఉన్నా.. హైడ్రా తన పని తాను చేస్తుందన్నారు.
మధ్యప్రదేశ్లో ఓ మహిళా కానిస్టేబుల్ అత్యుత్సాహం ఉద్యోగానికి ఎసరు పెట్టింది. ఓ కోచింగ్ సెంటర్ను ప్రమోట్ చేస్తూ ప్రకటన చేసింది. ఇందుకు సంబంధించిన ప్రకటన పబ్లిక్లోకి రావడంతో అధికారులు రంగంలోకి దిగారు. ఆమె చర్యను తప్పుపడుతూ సస్పెండ్ చేవారు.
రోజురోజుకి సైబర్ నేరాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఓ వైపు క్రైమ్ పోలీసులు సైబర్ నేరాలకు కళ్లెం వేస్తున్నా.. ఇంకోవైపు సైబర్ నేరగాళ్లు కూడా సరికొత్త వ్యూహాలతో ఖాకీలకే సవాళ్లు విసురుతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్లో ఒక ఐఏఎస్ పేరుతో బంధువుల్ని బురిడీ కొట్టించి నగదు కాజేశారు. ఈ ఘటన జబల్పూర్లో జరిగింది.
మధ్యప్రదేశ్లో దారుణం జరిగింది. ఓ ఉన్మాది రెచ్చిపోయాడు. నడిరోడ్డుపై యువతిని ఎనిమిది సార్లు కత్తితో పొడిచాడు. రక్తమోడుతూ విలవిలలాడుతుంటే.. మొబైల్లో షూట్ చేస్తున్నారే తప్ప.. ఎవరు ముందుకొచ్చి రక్షించిన పాపాన పోలేదు.
మధ్యప్రదేశ్లో ఘోరం జరిగింది. తొమ్మిదో తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. కదులుతున్న కారులోనే ఆమెపై ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.
Students Exam Copying : పేపర్ లీకేజీలు, పరీక్షల్లో అక్రమాలపై దేశంలో కలకలం రేగుతోంది. నీట్ యూజీ, యూజీసీ నెట్ సహా పలు పెద్ద పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సీబీఐ, సుప్రీంకోర్టుకు చేరింది. ఇది ఇలా ఉండగా మరోవైపు మధ్యప్రదేశ్ లోని జీవాజీ యూనివర్శిటీలో దారుణమైన కాపీయింగ్ వెలుగుచూసింది. పరీక్షల సమయంలో విద్యార్థులు తిరుగుతూ ఒకరి పేపర్లను మరొకరు కాపీ కొట్టుకుంటున్నారు. చాలామంది విద్యార్థులు గుంపుగా ఓ డెస్క్ వద్ద కాపీ చేస్తున్నారు.…
మధ్యప్రదేశ్లో ఓ విద్యార్థుల గుంపు రెచ్చిపోయింది. ఏకంగా కోచింగ్ సెంటర్లోకి ప్రవేశించి గణిత ఉపాధ్యాయుడ్ని బెదిరింపులకు దిగారు. టీచర్ కూడా వారిని ధీటుగానే ఎదుర్కొన్నాడు. ప్రతిదాడిలో టీచర్కు గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు క్లాస్ రూమ్లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.
ఖలిస్థాన్ వేర్పాటువాది అమృతపాల్ సింగ్కు లోక్సభ స్పీకర్ శుభవార్త చెప్పారు. జూలై 5న (శుక్రవారం) ఎంపీగా అమృతపాల్ ప్రమాణస్వీకారం చేసేందుకు అనుమతి ఇచ్చారు.
ఇండియా టీ 20 క్రికెట్ వరల్డ్ కప్ గెలుచుకున్న సందర్భంగా భారత్తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులంతా గెలుపు సంబరాలు చేసుకున్నారు. స్వీట్లు పంచుకుని.. బాణసంచా కాల్చి వేడుకలు జరుపుకున్నారు.