MP: మధ్యప్రదేశ్లో ఘోరం.. రన్నింగ్ కారులో తొమ్మిదో తరగతి విద్యార్థినిపై గ్యాంగ్రేప్
- మధ్యప్రదేశ్లో ఘోరం
- రన్నింగ్ కారులో తొమ్మిదో తరగతి విద్యార్థినిపై గ్యాంగ్రేప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్లో ఘోరం జరిగింది. తొమ్మిదో తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. కదులుతున్న కారులోనే ఆమెపై ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.
బాలికకు నిందితుల్లో ఒకరితో ఇన్స్ట్రాగామ్లో పరిచయం ఉంది. ఆ స్నేహంతో ఒక రోజు కలవాలంటూ బయటకు పిలిచాడు. దీంతో ఆ బాలిక.. ఒక స్థలానికి రాగానే అప్పటికే కారులో వేచి ఉన్న మరో ఇద్దరు స్నేహితులు.. రైడింగ్కు వెళ్దామంటూ ఆహ్వానించారు. కారులోకి ఎక్కగానే ఒకరి తర్వాత ఒకరు ఆమెపై అత్యాచారం చేశారు. ఈ దృశ్యాలను మొబైల్లో చిత్రీకరించారు. అంతే.. ఈ వీడియోను అడ్డంపెట్టుకుని ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టారు. తమతో బయటకు రావాలంటూ భయపెట్టారు. లేదంటే వీడియో మీ పేరెంట్స్కు పంపిస్తామని బెదిరింపులకు దిగారు. అయినా ఆమె వారితో వెళ్లేందుకు నిరాకరించింది. కానీ నిందితులు మాత్రం అన్నంత పని చేశారు. అత్యాచార వీడియోను అమ్మాయి పేరెంట్స్కు పంపించారు. దీంతో బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించగా… ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితులపై అత్యాచారం, కిడ్నాప్ తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Also Read
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Gold Smuggling: స్మగ్లింగ్లో ‘నయా ట్రెండ్’.. ప్యాంటు విప్పి చూడగానే అధికారులు షాక్..
- Video: ప్రాణాలకు తెగించి దొంగలను తరిమికొట్టిన నగలషాపు సిబ్బంది.. వీడియో వైరల్..
- Family: రూ.2వేలు అద్దె చెల్లించలేక.. యజమాని వద్దకు భార్య, కూతుర్ని పంపి..
బాలికతో మైనర్కు స్నేహం ఉందని.. ఆ చనువుతోనే ఆమె అతడి దగ్గరకు వెళ్లిందని పోలీసులు తెలిపారు. అతడి దగ్గరకు వెళ్లగానే కారులో రైడ్కు వెళ్దామని కారు ఎక్కించుకున్నాడని.. అందులో అప్పటికే మరో ఇద్దరు స్నేహితులు ఉన్నారని చెప్పారు. కారు హైవేపైకి వెళ్లాక.. ఒకరి తర్వాత ఒకరు గ్యాంగ్రేప్ చేశారని పోలీసులు వెల్లడించారు. వీడియో ద్వారా ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఆమె నిరాకరించడంతో.. కుటుంబ సభ్యులకు పంపించారని చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు.. కుమార్తెను పోలీసు స్టేషన్కు తీసుకెళ్లి ఫిర్యాదు చేశారన్నారు. విద్యార్థిని వాంగ్మూలం ప్రకారం ముగ్గురు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారని పోలీస్ అధికారి తెలిపారు. త్వరలోనే పట్టుకుంటామని మోహనా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ రషీద్ ఖాన్ చెప్పారు. పరిచయస్తులతో జాగ్రత్తగా ఉండాలని అమ్మాయిలకు పోలీసులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Perni Nani: ఆర్టీసీని సర్వనాశనం చేశారు.. మహిళలపై నెపం వేస్తున్నారు..
-
KamalHaasan : నాకు రజనీకాంత్కు మధ్య పోటీ మాత్రమే ఉంది.. విజయ్ నుండి ఎక్కువ ఆశించకూడదు
-
MS Dhoni Retirement: ఎంఎస్ ధోనీ చివరి మ్యాచ్ ఆడనున్నాడా?.. చెపాక్లో ఎమోషనల్ ఫేర్వెల్?
-
TDP Mahanadu: అందుకే హైబ్రిడ్ మహానాడు.. నెల్లూరు సభ రద్దుపై పల్లా శ్రీనివాస్ వివరణ..
-
Shefali Shah: ప్రేమ,పెళ్లి.. పిల్లల కంటే పెట్స్ బెటర్.. షెఫాలీ షా బోల్డ్ కామెంట్స్ వైరల్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..