MP: మధ్యప్రదేశ్లో ఘోరం.. రన్నింగ్ కారులో తొమ్మిదో తరగతి విద్యార్థినిపై గ్యాంగ్రేప్
- మధ్యప్రదేశ్లో ఘోరం
- రన్నింగ్ కారులో తొమ్మిదో తరగతి విద్యార్థినిపై గ్యాంగ్రేప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్లో ఘోరం జరిగింది. తొమ్మిదో తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. కదులుతున్న కారులోనే ఆమెపై ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.
బాలికకు నిందితుల్లో ఒకరితో ఇన్స్ట్రాగామ్లో పరిచయం ఉంది. ఆ స్నేహంతో ఒక రోజు కలవాలంటూ బయటకు పిలిచాడు. దీంతో ఆ బాలిక.. ఒక స్థలానికి రాగానే అప్పటికే కారులో వేచి ఉన్న మరో ఇద్దరు స్నేహితులు.. రైడింగ్కు వెళ్దామంటూ ఆహ్వానించారు. కారులోకి ఎక్కగానే ఒకరి తర్వాత ఒకరు ఆమెపై అత్యాచారం చేశారు. ఈ దృశ్యాలను మొబైల్లో చిత్రీకరించారు. అంతే.. ఈ వీడియోను అడ్డంపెట్టుకుని ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టారు. తమతో బయటకు రావాలంటూ భయపెట్టారు. లేదంటే వీడియో మీ పేరెంట్స్కు పంపిస్తామని బెదిరింపులకు దిగారు. అయినా ఆమె వారితో వెళ్లేందుకు నిరాకరించింది. కానీ నిందితులు మాత్రం అన్నంత పని చేశారు. అత్యాచార వీడియోను అమ్మాయి పేరెంట్స్కు పంపించారు. దీంతో బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించగా… ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితులపై అత్యాచారం, కిడ్నాప్ తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Also Read
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
- Ketan Agrawal Case: కేతన్ హత్యపై తొలిసారి స్పందించిన సీఎం ఫడ్నవిస్.. ఏమన్నారంటే..!
- Ketan Agarwal Case: కోటేశ్వరుడైన కేతన్ను సియా ఎందుకు వద్దనుకుంది? దర్యాప్తులో సంచలన విషయాలు
- Ketan Agarwal Case: కేతన్ను లోయలోకి తోసేముందు చేతన్ ఏమన్నాడో తెలుసా.. వెలుగులోకి కొత్త విషయాలు
బాలికతో మైనర్కు స్నేహం ఉందని.. ఆ చనువుతోనే ఆమె అతడి దగ్గరకు వెళ్లిందని పోలీసులు తెలిపారు. అతడి దగ్గరకు వెళ్లగానే కారులో రైడ్కు వెళ్దామని కారు ఎక్కించుకున్నాడని.. అందులో అప్పటికే మరో ఇద్దరు స్నేహితులు ఉన్నారని చెప్పారు. కారు హైవేపైకి వెళ్లాక.. ఒకరి తర్వాత ఒకరు గ్యాంగ్రేప్ చేశారని పోలీసులు వెల్లడించారు. వీడియో ద్వారా ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఆమె నిరాకరించడంతో.. కుటుంబ సభ్యులకు పంపించారని చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు.. కుమార్తెను పోలీసు స్టేషన్కు తీసుకెళ్లి ఫిర్యాదు చేశారన్నారు. విద్యార్థిని వాంగ్మూలం ప్రకారం ముగ్గురు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారని పోలీస్ అధికారి తెలిపారు. త్వరలోనే పట్టుకుంటామని మోహనా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ రషీద్ ఖాన్ చెప్పారు. పరిచయస్తులతో జాగ్రత్తగా ఉండాలని అమ్మాయిలకు పోలీసులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!