ED Raids: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం తాజా సోదాలు నిర్వహించినట్లు మీడియా నివేదికలు తెలిపాయి. కర్ణాటకలోనిమైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) సంబంధించిన లింక్డ్ మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం మంగళూరు, బెంగళూరు, మాండ్య, మైసూరులోని పలు ప్రదేశాలలో సోదాలు నిర్వహించినట్లు సమాచారం. ఈ కేసులో సిద్ధరామయ్యపై కేసు నమోదు చేసిన…
ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. రెండేళ్ల తర్వాత ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో శుక్రవారం సాయంత్రం ఆయన బెయిల్పై విడుదలయ్యారు.
ED Raids On AAP MP House: పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ ఎంపీ సంజీవ్ ఆరోరా ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఈరోజు (సోమవారం) తనిఖీలు చేశారు. ఒక భూ వివాదానికి సంబంధించిన మనీలాండరింగ్ వ్యవహారంలో జలంధర్లోని ఎంపీకి చెందిన పలు చోట్ల సోదాలు కొనసాగిస్తుంది.
ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ను ఢిల్లీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. మనీలాండరింగ్ కేసులో14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ స్వయంగా కోర్టును అభ్యర్థించింది. ఇకపై నిందితులను కస్టడీలో విచారించాల్సిన అవసరం లేదని ప్రత్యేక న్యాయమూర్తికి ఈడీ తెలిపింది.
ఆప్ నేత, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్కు మనీలాండరింగ్ కేసులో ఊరట దక్కలేదు. ఆయనపై ఈడీ దాఖలు చేసిన మనీలాండరింగ్ కేసులో మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మంగళవారం నిరాకరించింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. విడుదలపై స్టే విధించాలన్న ఢిల్లీ హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ ఈరోజు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో భాగంగా బుధవారం రౌస్ అవెన్యూ కోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈనెల 10న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఇతర నిందితులపై ఈడీ దాఖలు చేసిన అనుబంధ ఛార్జ్షీట్ను కోర్టు పరిగణనలోకి తీసుకుంది.
Jharkhand: మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ మంత్రి, కాంగ్రెస్ నేత అలంగీర్ ఆలమ్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఈ రోజు అరెస్ట్ చేసింది. ఇటీవల మంత్రి వ్యక్తిగత కార్యదర్శి సహాయకుడి ఇంట్లో ఏకంగా రూ. 37 కోట్ల నగదు బయటపడింది.
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్కు న్యాయస్థానంలో తాత్కాలిక ఉపశమనం లభించింది. మనీలాండరింగ్ కేసులో ఆయనకు 2 నెలల మధ్యంతర బెయిల్ను బాంబే హైకోర్టు మంజూరు చేసింది.