Amanatullah Khan: మనీలాండరింగ్ కేసులో ఆప్ ఎమ్మెల్యేకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ..
- మనీలాండరింగ్ కేసులో ఆప్ ఎమ్మెల్యేకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
- అమానతుల్లా ఖాన్ను జ్యుడీషియల్ కస్టడీకి పంపిన ఢిల్లీ కోర్టు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ను ఢిల్లీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. మనీలాండరింగ్ కేసులో14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ స్వయంగా కోర్టును అభ్యర్థించింది. ఇకపై నిందితులను కస్టడీలో విచారించాల్సిన అవసరం లేదని ప్రత్యేక న్యాయమూర్తికి ఈడీ తెలిపింది. అతన్ని జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని.. అమానతుల్లా ఖాన్ను విడుదల చేస్తే దర్యాప్తును, సాక్షులను ప్రభావితం చేయగలరని ఈడీ తన పిటిషన్లో పేర్కొంది.
Minister Kollu Ravindra: సహాయక చర్యల్లో గాయపడిన కానిస్టేబుల్కు రూ.2 లక్షల ఆర్థిక సాయం
Also Read
- Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
- Sorakaya Kadhi Recipe: నిమిషాల్లో రుచికరమైన, ఆరోగ్యకరమైన కర్రీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు..!
- Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
- Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
ఈ క్రమంలో.. కోర్టు ఆదేశాల వచ్చేంత వరకు అమానతుల్లా ఖాన్ సెప్టెంబర్ 23 వరకు జ్యుడీషియల్ కస్టడీలో ఉండనున్నారు. గతంలో రిమాండ్లో ఉన్న సమయంలో అమానతుల్లా ఖాన్ విచారణకు సహకరించలేదని ఈడీ కోర్టుకు తెలిపింది. మరోవైపు.. అమానతుల్లా ఖాన్ తరపు న్యాయవాది ఈడీ వాదనలను వ్యతిరేకించారు. ఈ క్రమంలో.. తన క్లయింట్ను విడుదల చేయాలని కోర్టును అభ్యర్థించారు. బెయిల్ మంజూరు కోసం అమానతుల్లా ఖాన్కు కోర్టు ఎలాంటి షరతునైనా విధించవచ్చని లాయర్ చెప్పారు. గత శుక్రవారం, ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగానే అమానతుల్లా ఖాన్కు మూడు రోజుల పాటు ఈడీ కస్టడీని పొడిగించింది. ఈ క్రమంలో.. ఈడీ అమానతుల్లా ఖాన్ను 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరింది. అమానతుల్లా తన సహ నిందితులు.. దాదాపు 48 మంది సాక్షులను విచారించాల్సి ఉంటుందని కోర్టు పేర్కొంది.
Indonesia: ఇండోనేషియాలో విమానం ప్రమాదం.. రన్వే నుంచి జారిపడ్డ ఫ్లైట్
మూడు రోజుల కస్టడీ అనంతరం.. సెప్టెంబర్ 9న కోర్టులో హాజరుకావాలని అమానతుల్లా ఖాన్ను కోర్టు కోరింది. ఢిల్లీలోని ఓఖ్లా ప్రాంతంలోని ఆయన నివాసంలో సోదాలు చేసిన తర్వాత సెప్టెంబర్ 2న పిఎంఎల్ఎ నిబంధనల ప్రకారం.. అమానతుల్లా ఖాన్ను ఈడీ అదుపులోకి తీసుకుంది. సోదాల సందర్భంగా అమానతుల్లా ఖాన్ను ఆరోపణలకు సంబంధించి కొన్ని ప్రశ్నలు అడిగారని, అయితే అతను సమాధానం చెప్పడానికి ఇష్టపడలేదని ఈడీ కోర్టుకు తెలిపింది. దీంతో అతడిని అరెస్ట్ చేయాల్సి వచ్చింది. అమానతుల్లా ఖాన్ ఢిల్లీ వక్ఫ్బోర్డ్లో నియామకాలు, ఆ సంస్థకు చెందిన రూ.100 కోట్లు విలువ చేసే ఆస్తుల లీజుకు సంబంధించి అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
తాజావార్తలు
-
Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
-
Sorakaya Kadhi Recipe: నిమిషాల్లో రుచికరమైన, ఆరోగ్యకరమైన కర్రీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు..!
-
NTRNeel : సోషల్ మీడియాలో ఎన్టీఆర్ – నీల్ హంగామా మాములుగా లేదు
-
Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ ‘మాస్’ స్టేట్మెంట్!
-
Karuppu Controversy:ఇళయరాజాకు ‘కరుప్పు’ టీమ్ క్షమాపణ.. వైరల్ అవుతున్న ప్రెస్ నోట్!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!