Amanatullah Khan: మనీలాండరింగ్ కేసులో ఆప్ ఎమ్మెల్యేకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ..
- మనీలాండరింగ్ కేసులో ఆప్ ఎమ్మెల్యేకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
- అమానతుల్లా ఖాన్ను జ్యుడీషియల్ కస్టడీకి పంపిన ఢిల్లీ కోర్టు.
ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ను ఢిల్లీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. మనీలాండరింగ్ కేసులో14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ స్వయంగా కోర్టును అభ్యర్థించింది. ఇకపై నిందితులను కస్టడీలో విచారించాల్సిన అవసరం లేదని ప్రత్యేక న్యాయమూర్తికి ఈడీ తెలిపింది. అతన్ని జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని.. అమానతుల్లా ఖాన్ను విడుదల చేస్తే దర్యాప్తును, సాక్షులను ప్రభావితం చేయగలరని ఈడీ తన పిటిషన్లో పేర్కొంది.
Minister Kollu Ravindra: సహాయక చర్యల్లో గాయపడిన కానిస్టేబుల్కు రూ.2 లక్షల ఆర్థిక సాయం
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
ఈ క్రమంలో.. కోర్టు ఆదేశాల వచ్చేంత వరకు అమానతుల్లా ఖాన్ సెప్టెంబర్ 23 వరకు జ్యుడీషియల్ కస్టడీలో ఉండనున్నారు. గతంలో రిమాండ్లో ఉన్న సమయంలో అమానతుల్లా ఖాన్ విచారణకు సహకరించలేదని ఈడీ కోర్టుకు తెలిపింది. మరోవైపు.. అమానతుల్లా ఖాన్ తరపు న్యాయవాది ఈడీ వాదనలను వ్యతిరేకించారు. ఈ క్రమంలో.. తన క్లయింట్ను విడుదల చేయాలని కోర్టును అభ్యర్థించారు. బెయిల్ మంజూరు కోసం అమానతుల్లా ఖాన్కు కోర్టు ఎలాంటి షరతునైనా విధించవచ్చని లాయర్ చెప్పారు. గత శుక్రవారం, ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగానే అమానతుల్లా ఖాన్కు మూడు రోజుల పాటు ఈడీ కస్టడీని పొడిగించింది. ఈ క్రమంలో.. ఈడీ అమానతుల్లా ఖాన్ను 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరింది. అమానతుల్లా తన సహ నిందితులు.. దాదాపు 48 మంది సాక్షులను విచారించాల్సి ఉంటుందని కోర్టు పేర్కొంది.
Indonesia: ఇండోనేషియాలో విమానం ప్రమాదం.. రన్వే నుంచి జారిపడ్డ ఫ్లైట్
మూడు రోజుల కస్టడీ అనంతరం.. సెప్టెంబర్ 9న కోర్టులో హాజరుకావాలని అమానతుల్లా ఖాన్ను కోర్టు కోరింది. ఢిల్లీలోని ఓఖ్లా ప్రాంతంలోని ఆయన నివాసంలో సోదాలు చేసిన తర్వాత సెప్టెంబర్ 2న పిఎంఎల్ఎ నిబంధనల ప్రకారం.. అమానతుల్లా ఖాన్ను ఈడీ అదుపులోకి తీసుకుంది. సోదాల సందర్భంగా అమానతుల్లా ఖాన్ను ఆరోపణలకు సంబంధించి కొన్ని ప్రశ్నలు అడిగారని, అయితే అతను సమాధానం చెప్పడానికి ఇష్టపడలేదని ఈడీ కోర్టుకు తెలిపింది. దీంతో అతడిని అరెస్ట్ చేయాల్సి వచ్చింది. అమానతుల్లా ఖాన్ ఢిల్లీ వక్ఫ్బోర్డ్లో నియామకాలు, ఆ సంస్థకు చెందిన రూ.100 కోట్లు విలువ చేసే ఆస్తుల లీజుకు సంబంధించి అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో