Amanatullah Khan: మనీలాండరింగ్ కేసులో ఆప్ ఎమ్మెల్యేకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ..
- మనీలాండరింగ్ కేసులో ఆప్ ఎమ్మెల్యేకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
- అమానతుల్లా ఖాన్ను జ్యుడీషియల్ కస్టడీకి పంపిన ఢిల్లీ కోర్టు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ను ఢిల్లీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. మనీలాండరింగ్ కేసులో14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ స్వయంగా కోర్టును అభ్యర్థించింది. ఇకపై నిందితులను కస్టడీలో విచారించాల్సిన అవసరం లేదని ప్రత్యేక న్యాయమూర్తికి ఈడీ తెలిపింది. అతన్ని జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని.. అమానతుల్లా ఖాన్ను విడుదల చేస్తే దర్యాప్తును, సాక్షులను ప్రభావితం చేయగలరని ఈడీ తన పిటిషన్లో పేర్కొంది.
Minister Kollu Ravindra: సహాయక చర్యల్లో గాయపడిన కానిస్టేబుల్కు రూ.2 లక్షల ఆర్థిక సాయం
Also Read
- PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
- OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
ఈ క్రమంలో.. కోర్టు ఆదేశాల వచ్చేంత వరకు అమానతుల్లా ఖాన్ సెప్టెంబర్ 23 వరకు జ్యుడీషియల్ కస్టడీలో ఉండనున్నారు. గతంలో రిమాండ్లో ఉన్న సమయంలో అమానతుల్లా ఖాన్ విచారణకు సహకరించలేదని ఈడీ కోర్టుకు తెలిపింది. మరోవైపు.. అమానతుల్లా ఖాన్ తరపు న్యాయవాది ఈడీ వాదనలను వ్యతిరేకించారు. ఈ క్రమంలో.. తన క్లయింట్ను విడుదల చేయాలని కోర్టును అభ్యర్థించారు. బెయిల్ మంజూరు కోసం అమానతుల్లా ఖాన్కు కోర్టు ఎలాంటి షరతునైనా విధించవచ్చని లాయర్ చెప్పారు. గత శుక్రవారం, ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగానే అమానతుల్లా ఖాన్కు మూడు రోజుల పాటు ఈడీ కస్టడీని పొడిగించింది. ఈ క్రమంలో.. ఈడీ అమానతుల్లా ఖాన్ను 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరింది. అమానతుల్లా తన సహ నిందితులు.. దాదాపు 48 మంది సాక్షులను విచారించాల్సి ఉంటుందని కోర్టు పేర్కొంది.
Indonesia: ఇండోనేషియాలో విమానం ప్రమాదం.. రన్వే నుంచి జారిపడ్డ ఫ్లైట్
మూడు రోజుల కస్టడీ అనంతరం.. సెప్టెంబర్ 9న కోర్టులో హాజరుకావాలని అమానతుల్లా ఖాన్ను కోర్టు కోరింది. ఢిల్లీలోని ఓఖ్లా ప్రాంతంలోని ఆయన నివాసంలో సోదాలు చేసిన తర్వాత సెప్టెంబర్ 2న పిఎంఎల్ఎ నిబంధనల ప్రకారం.. అమానతుల్లా ఖాన్ను ఈడీ అదుపులోకి తీసుకుంది. సోదాల సందర్భంగా అమానతుల్లా ఖాన్ను ఆరోపణలకు సంబంధించి కొన్ని ప్రశ్నలు అడిగారని, అయితే అతను సమాధానం చెప్పడానికి ఇష్టపడలేదని ఈడీ కోర్టుకు తెలిపింది. దీంతో అతడిని అరెస్ట్ చేయాల్సి వచ్చింది. అమానతుల్లా ఖాన్ ఢిల్లీ వక్ఫ్బోర్డ్లో నియామకాలు, ఆ సంస్థకు చెందిన రూ.100 కోట్లు విలువ చేసే ఆస్తుల లీజుకు సంబంధించి అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
తాజావార్తలు
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి ఊహించని డబ్బు!
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!