Mohsin Naqvi: సొంత దేశం అభిమానుల నుంచే థ్రెట్..? మ్యాచ్ మధ్యలోనే పీసీబీ బాస్ నఖ్వీ పరార్ (వీడియో)
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohsin Naqvi: భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ముగిసినా సోషల్ మీడియాలో మాత్రం చర్చ మామూలుగా లేదు. ఎంతో బిల్డప్ కొట్టి.. మ్యాచ్కు ముందే హైడ్రామా క్రియేట్ చేసిన పాకిస్థాన్ భారత్ చేతిలో కుప్పకూలింది. ప్రస్తుతం పాకిస్థాన్ ప్లేయర్స్ పరిస్థితి దిక్కుతోచని స్థితిగా మారింది. ఎందుకంటే ఆ దేశంలో పాక్ జట్టును ఘోరంగా ట్రోల్ చేస్తున్నాయి. అయితే.. మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ స్టేడియం నుంచి మధ్యలోనే పరారయ్యాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు కెమెరాలకు చిక్కాయి. పాకిస్థాన్ వరుసగా వికెట్లు కోల్పోతున్న సమయంలోనే ఆయన బయటకు వెళ్లిపోవడం సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. అసలు కారణం ఏమిటో అధికారికంగా చెప్పకపోయినా, ఆ టైమింగ్ మాత్రం అభిమానుల దృష్టిని ఆకర్షించింది. పాకిస్థాన్ జట్టు హైడ్రామా క్రియేట్ చేసి ఘోరంగా పరాజయం పాలైనందుకు గానూ నఖ్వీపై అభిమానులు తిరగబడే అవకాశం ఉందనే ఉద్దేశంతోనే అక్కడి నుంచి పరారైనట్లు కొందరు చెబుతున్నారు. భారత్ కంటే పాకిస్థాన్ క్రికెట్ అభిమానుల నుంచే ఎక్కువ థ్రెట్ ఉందట. అందుకే మధ్యలోనేలో జంప్ అయ్యాడని సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది.
READ MORE: Mahesh Babu: బాబు కాల్ షీట్స్ కోసం నిర్మాతల క్యూ.. వారణాసి తర్వాత లక్కీ ఛాన్స్ ఎవరికంటే!
Also Read
- Bajaj Chetak Sales Surge 307 Percent: రూ.35 ఛార్జింగ్తో 153 కిలో మీటర్లు..! ఏకంగా 307 శాతం పెరిగిన అమ్మకాలు
- CM Revanth Reddy: 22-ఏ భూములపై సీఎం కీలక సమీక్ష.. 2 రోజుల్లోనే పరిష్కారం..! దళారులను ఆశ్రయించవద్దు..
- Story Board: ఎల్నినో సూపర్ ఎల్నినోగా విరుచుకుపడుతోందా..?
- ChatGPT for Teens: టీనేజర్లకు చాట్జీపీటీపై కఠిన ఆంక్షలు.. ఓపెన్ఏఐ కీలక నిర్ణయం.. ఇవే కొత్త ఫీచర్లు
అయితే.. నిన్న జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్థాన్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. భారత్ బ్యాటింగ్ ప్రారంభం మాత్రం షాక్తోనే మొదలైంది. అభిషేక్ ఖాతా తెరవకుండానే అవుట్ అయ్యాడు. ఆ సమయంలో ఇషాన్ కిషన్ దూకుడుగా ఆడుతూ మ్యాచ్ గమనాన్ని మార్చేశాడు. అతని 77 పరుగుల ఇన్నింగ్స్ పూర్తిగా పాకిస్థాన్ బౌలర్లపై ఒత్తిడి తెచ్చింది. మరోవైపు తిలక్ వర్మ ప్రశాంతంగా 25 పరుగులు చేసి ఇన్నింగ్స్ను నిలబెట్టాడు. మధ్యలో వరుసగా వికెట్లు పడిపోవడంతో భారత్ 126/4 వద్ద కొంత కష్టంలో పడింది. హార్దిక్ పాండ్య పరుగులు చేయకుండానే అవుట్ కావడం పరిస్థితిని కఠినంగా మార్చింది. అయితే.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన అనుభవాన్ని ఉపయోగించి చివరి ఓవర్లలో ఇన్నింగ్స్ను అద్భుతంగా నడిపించాడు. శివం దూబే, రింకూ సింగ్ సైతం చక్కగా సహకరించారు. కఠిన పరిస్థితుల్లో పరుగుల వేగాన్ని పెంచుతూ భారత్ను 175/7 అనే పోటీ స్కోరుకు తీసుకెళ్లారు. పాకిస్థాన్ తరఫున సైమ్ అయూబ్ మూడు వికెట్లు తీసి మంచి బౌలింగ్ చేశాడు. 176 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్థాన్కు మొదటినుంచే దెబ్బలు తగిలాయి. హార్దిక్, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్ అద్భుతంగా బౌలింగ్ చేసి స్కోరు 34/4గా మార్చేశారు. ఒకవైపు వికెట్లు పడిపోతుంటే, మరోవైపు ఉస్మాన్ ఖాన్ మాత్రం ఒంటరిగా పోరాడాడు. 34 బంతుల్లో 44 పరుగులు చేసి కొంతసేపు మ్యాచ్లో ఉంచే ప్రయత్నం చేశాడు. కానీ అతనికి మద్దతు లేకపోవడంతో పాకిస్థాన్ ఇన్నింగ్స్ 18 ఓవర్లలో 114 పరుగులకే ముగిసింది. భారత్ బౌలర్లలో అక్షర్ పటేల్ అత్యుత్తమంగా నిలిచాడు. హార్దిక్ పాండ్య, బుమ్రా, వరుణ్ చక్రవర్తి కూడా కీలక వికెట్లు తీసి పాకిస్థాన్ను పూర్తిగా కట్టడి చేశారు.
READ MORE: India vs Pakistan: భారత్ చేతిలో పాక్ చిత్తు.. పాకిస్థాన్ అభిమానుల మీమ్స్ మామూలుగా లేవు..
VIDEO | ICC Men's T20 World Cup, 2026: PCB chief Mohsin Naqvi leaves R. Premadasa International Stadium. #INDvsPAK
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/QXbYcjFUCN
— Press Trust of India (@PTI_News) February 15, 2026
తాజావార్తలు
-
Bajaj Chetak Sales Surge 307 Percent: రూ.35 ఛార్జింగ్తో 153 కిలో మీటర్లు..! ఏకంగా 307 శాతం పెరిగిన అమ్మకాలు
-
CM Revanth Reddy: 22-ఏ భూములపై సీఎం కీలక సమీక్ష.. 2 రోజుల్లోనే పరిష్కారం..! దళారులను ఆశ్రయించవద్దు..
-
Story Board: ఎల్నినో సూపర్ ఎల్నినోగా విరుచుకుపడుతోందా..?
-
ChatGPT for Teens: టీనేజర్లకు చాట్జీపీటీపై కఠిన ఆంక్షలు.. ఓపెన్ఏఐ కీలక నిర్ణయం.. ఇవే కొత్త ఫీచర్లు
-
CM Vijay: మహిళా ఉద్యోగులకు రక్షా బంధన్ శుభవార్త.. మూడో బిడ్డకు ఏడాది ప్రసూతి సెలవు
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!