Akhtar-Mohsin Naqvi: క్రికెట్పై ఏమాత్రం అవగాహన లేదు.. మోహ్సిన్ నక్వీపై షోయబ్ అక్తర్ ఫైర్!
- భారత్ చేతిలో 61 పరుగుల తేడాతో పాక్ ఓటమి
- పాకిస్థాన్ క్రికెట్ పరిస్థితిపై అక్తర్ ఫైర్
- మోహ్సిన్ నక్వీపై అక్తర్ విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shoaib Akhtar Fires on Mohsin Naqvi: ప్రస్తుత పాకిస్థాన్ క్రికెట్ పరిస్థితిపై ఆ దేశ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు. జట్టు పరిపాలన, ఆటగాళ్ల ప్రదర్శన, వ్యవస్థపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా క్రికెట్పై అవగాహన లేని వ్యక్తిని చైర్మన్గా నియమించడం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందని మోహ్సిన్ నక్వీపై విమర్శలు గుప్పించాడు. రాజకీయాల్లో బిజీగా ఉండే వ్యక్తి.. క్రికెట్ అభివృద్ధికి ఉపయోగపడడని అక్తర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఆదివారం కొలంబోలో భారత్తో జరిగిన మ్యాచ్లో పాక్ 61 పరుగుల తేడాతో ఓడిపోయింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో పాక్ పూర్తిగా తేలిపోయింది. మ్యాచ్ మొత్తం ఏకపక్షంగా సాగింది. దాంతో పాక్ మాజీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఓ ఇంటర్వ్యూలో షోయబ్ అక్తర్ జట్టు ప్రదర్శనపై మాట్లాడుతూ… ‘స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్ 6-7 సంవత్సరాలుగా ఐసీసీ టోర్నీల్లో ఆడుతున్నాడు. అయినా కూడా భారత్పై గుర్తుండిపోయే ఒక్క ఇన్నింగ్స్ కూడా ఆడలేదు. అంతేకాదు జట్టు మొత్తం ఒకే బౌలర్పై ఆధారపడుతోంది. షాహిన్ అఫ్రిదిపై ఎక్కువగా నమ్మకం పెట్టుకోవడం సరైన వ్యూహం కాదు. సరైన బెంచ్ స్ట్రెంగ్త్ లేకపోవడం కూడా జట్టు బలహీనతగా మారింది’ అని చెప్పాడు.
Also Read
- Daniel Vettori: "పక్కా ప్లాన్తో దిగుతున్నాం".. పంజాబ్ జోరుకు బ్రేక్ వేసేందుకు SRH కోచ్ మాస్టార్ ప్లాన్!
- Axar Patel: కెప్టెన్ అక్షర్ పటెల్ బిగ్ మిస్టెక్స్.. ఏకంగా 2 పాయింట్స్ కోల్పోయిన ఢిల్లీ!
- IPL Ticket Scam Hyderabad: ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ టికెట్ల స్కామ్ బట్టబయలు.. అభిమానులకు పోలీసులు హెచ్చరికలు!
- Sanju Samson: 'చెట్టా' కాదు.. 'సంజూ' అని పిలవండి! ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వేళ శామ్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నిర్వహణపై షోయబ్ అక్తర్ తీవ్ర విమర్శలు చేశాడు. ‘సరైన వ్యక్తులు సరైన స్థానాల్లో లేకపోతే ట్రోఫీల గురించి మాట్లాడటం అనవసరం. ప్రస్తుత పరిస్థితుల్లో జట్టు విజయాల గురించి కలలు కనడం కష్టమే. క్రికెట్పై అవగాహన లేని వ్యక్తిని చైర్మన్గా నియమించడం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చింది. రాజకీయాల్లో బిజీగా ఉండే వ్యక్తి.. క్రికెట్ అభివృద్ధికి ఎలా సహకరిస్తారు. వ్యవస్థలో మార్పులు వచ్చినప్పుడే జట్టు తిరిగి బలపడుతుంది, లేకపోతే ఇదే పరిస్థితి కొనసాగుతుంది’ అని అక్తర్ హెచ్చరించాడు. పాక్ క్రికెట్పై అక్తర్ చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మాజీ ఆటగాళ్లు, విశ్లేషకులు కూడా పాకిస్థాన్ క్రికెట్ పరిపాలనపై ఇదే తరహా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అక్తర్ వ్యాఖ్యలకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది.
తాజావార్తలు
-
Tamil Nadu: విజయ్ ప్రమాణ స్వీకార వేడుకకు రాహుల్ గాంధీకి ఆహ్వానం.
-
Viral: నైట్ కు వస్తావా..? రేట్ ఎంత..? అర్ధరాత్రి బస్టాండ్ వద్ద సీపీతో బేరం ఆడిన పోకిరీలు.
-
MAA: ‘మా’ పేరుతో మోసాలు.. నకిలీ సంఘాలపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సీరియస్ వార్నింగ్!
-
Bengal’s Next CM: బెంగాల్లో మే 9న బీజేపీ ప్రభుత్వం.. సువేందుకే సీఎంగా ఛాన్స్..
-
Peddi: కథ విన్నాక 25 నిమిషాల పాటు తేరుకోలేకపోయా!
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!