బీజేపీ ఉత్తర్ ప్రదేశ్ అధ్యక్షుడు చౌదరి భూపేంద్ర సింగ్ గురువారం తన రాజీనామా చేశారన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాజీనామా పత్రాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు అందజేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీ ఓడిపోయిన కొద్ది రోజులకే భూపేంద్ర సింగ్ ఈ చర్య తీసుకున్నారు.
భారత్ లోక్ సభా ఎన్నికలపై అంతర్జాతీయ మీడియా ఎంతో ఆసక్తిగా స్పందించింది. మోడీ తిరుగులేని మెజారిటీ సాధించలేకపోయినప్పటికీ, మూడోసారి అధికారం చేపట్టేందుకు సిద్దంగా ఉన్నారని పేర్కొన్నారు. భారత్ ఆర్థిక వృద్ధి, అంతర్జాతీయ వేదికపై గళం వినిపించడం, సంశోభలపై వేగంగా స్పందించడం వంటి చర్యలతో చురుకుగా వ్యవహరిస్తోంది. అంతర్జాతీయ మీడియా ఎలా స్పందించిందో తెలుసుకోవడానికి, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ చూడండి.
ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్రంలో ఎన్డీయే వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అయితే గత రెండు ఎన్నికల మాదిరిగానే ఈసారి బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించలేకపోయింది.
మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోడీకి ప్రపంచ దేశాల అధినేతలు అభినందనలు తెలిపారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని కూడా ప్రధాని మోడీకి శుభాకాంక్షలు తెలిపారు. తన ఎక్స్ ఖాతాలో “ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొత్త ఎన్నికల విజయంపై, ఆయన చేస్తున్న మంచి పనికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
లోక్సభ ఎన్నికల ప్రకటనకు ముందు, చివరి దశ ఓటింగ్ వరకు రామమందిరం గురించే చర్చనీయాంశమైంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, బీజేపీ పెద్దలంతా రామమందిర అంశాన్ని ప్రస్తావించారు.
ఈ రోజు విడుదలైన దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్లో ఎన్డీయే మరోసారి ఆధిక్యత కనబరుస్తోంది. ఢిల్లీని బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుందని పలు ఎగ్జిట్ పోల్స్ అభిప్రాయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆప్ ఎంపీ అభ్యర్థి కీలక వ్యాఖ్యలు చేశారు.
V. Hanumantha Rao: దేశంలో జూన్ 5తర్వాత కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని మాజీ ఎంపీ. V.హనుమంతరావు అన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తరిమి కొట్టినప్పుడు మన దేశంలో గుండు సూది కూడా తయారు కాలేదన్నారు.
చెన్నైలోని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) కార్యాలయానికి బుధవారం (మే 22, 2024) రాత్రి ఒక అజ్ఞాత వ్యక్తి కాల్ చేశాడు. దీంతో ఎన్ఐఏ ఒక్కసారిగా హైఅలర్ట్ అయింది. బెదిరింపు కాల్లో భాగంగా హిందీలో మాట్లాడిన ఓ వ్యక్తి.. ‘‘ఎన్నికల ప్రచారంలో ఎక్కడో ఓ చోట ప్రధానమంత్రి నరేంద్ర మోడీని హత్య చేస్తాం’’ అని వార్నింగ్ ఇచ్చాడు.
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వారణాసిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నియోజకవర్గమైన వారణాసిలో తెలుగువారు అత్యధికంగా నివసించే పాండే హవేలీ, సోనార్ పుర తదితర ప్రాంతాల్లో బండి సంజయ్ డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇండియా కూటమితో పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం పన్స్కురాలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న దీదీ.. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో తమ పార్టీ తృణమూల్ కాంగ్రెస్కు అత్యధిక సీట్లు వస్తే.. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే భారత కూటమికి పూర్తిగా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు.