ఇటలీలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఖలిస్తానీ మద్దతుదారులు ధ్వంసం చేశారు. జీ7 సదస్సు కోసం ప్రధాని మోడీ ఇటలీ పర్యటనకు ముందు ఈ ఘటన చోటుచేసుకుంది. ఖలిస్తాన్ మద్దతుదారులు హర్దీప్ సింగ్ నిజ్జర్ నినాదాలు సైతం కనిపించాయి.
భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా వృద్ధి చెందుతుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. ప్రపంచ బ్యాంకు మంగళవారం (జూన్ 11) 2025 ఆర్థిక సంవత్సరంలో భారతదేశానికి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనా 6.6%గా ఉంటుందని అభిప్రాయపడింది. ప్రపంచ బ్యాంకు ప్రకారం.. వస్తు తయారీ, రియల్ ఎస్టేట్లో మరింత వృద్ధి ఉంటుంది. ఈ ఏడాది ఏప్రిల్లో ప్రపంచ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి అంచనాను 20 బేసిస్ పాయింట్లు పెంచి 6.6…
ఒడిశా కొత్త ముఖ్యమంత్రిగా మోహన్ మాఝీ బాధ్యతలు చేపట్టనున్నారు. దీంతో పాటు కొత్త ఒడిశా ప్రభుత్వంలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు కూడా ఉంటారు. వీరిలో ఒకరు బీజేపీ సీనియర్ నేత కేవీ సింగ్ డియో కాగా, మరొకరు తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ప్రవతి పరిదా.
మధ్యప్రదేశ్లోని బుందేల్ఖండ్కు చెందిన ప్రముఖ నాయకుడు, 8 సార్లు ఎంపీగా గెలిచిన వీరేంద్ర కుమార్ ఖాటిక్ మోడీ 3.0 కేబినెట్లో మంత్రి అయ్యారు. ఖాటిక్ టికామ్గఢ్ నుంచి ఎంపీగా గెలుపొందారు.
Loksabha Elections 2024 : దేశంలో లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత అధికార పోరు మొదలైంది. ఈసారి బీజేపీ, ఇండియా కూటమి ఏదీ మెజారిటీ మార్కును దాటలేకపోయింది.
PM Modi Akira Nandan Conversation Leaked by Renu Desai: ప్రధానమంత్రి మోదీతో పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరానందన్ ఫోటోలు గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు ఎప్పుడైతే బయటకు వచ్చాయో అప్పటినుంచి పెద్ద ఎత్తున అకీరా హైట్ గురించి చర్చ జరుగుతుంది. అలాగే మోడీ అకిరాతో ఏం మాట్లాడాడు అనే విషయం మీద కూడా చర్చ జరుగుతుంది. ఇక తాజాగా సోషల్ మీడియాలో అఖీరా నందన్ తో…
బీజేపీ ఉత్తర్ ప్రదేశ్ అధ్యక్షుడు చౌదరి భూపేంద్ర సింగ్ గురువారం తన రాజీనామా చేశారన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాజీనామా పత్రాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు అందజేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీ ఓడిపోయిన కొద్ది రోజులకే భూపేంద్ర సింగ్ ఈ చర్య తీసుకున్నారు.
భారత్ లోక్ సభా ఎన్నికలపై అంతర్జాతీయ మీడియా ఎంతో ఆసక్తిగా స్పందించింది. మోడీ తిరుగులేని మెజారిటీ సాధించలేకపోయినప్పటికీ, మూడోసారి అధికారం చేపట్టేందుకు సిద్దంగా ఉన్నారని పేర్కొన్నారు. భారత్ ఆర్థిక వృద్ధి, అంతర్జాతీయ వేదికపై గళం వినిపించడం, సంశోభలపై వేగంగా స్పందించడం వంటి చర్యలతో చురుకుగా వ్యవహరిస్తోంది. అంతర్జాతీయ మీడియా ఎలా స్పందించిందో తెలుసుకోవడానికి, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ చూడండి.
ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్రంలో ఎన్డీయే వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అయితే గత రెండు ఎన్నికల మాదిరిగానే ఈసారి బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించలేకపోయింది.