Italy:ఇటలీలో గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఖలిస్తానీ మద్దతుదారులు..రేపు మోడీ పర్యటన సందర్భంగా దుశ్చర్య
- జీ7 సదస్సు సందర్భంగా ఇటలీకి ప్రధాని మోడీ
- పర్యటనకు ఒక రోజు ముందే విగ్రహం ధ్వంసం
- గోడలపై ఖలిస్తాన్ కు మద్దతుగా నినాదాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటలీలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఖలిస్తానీ మద్దతుదారులు ధ్వంసం చేశారు. జీ7 సదస్సు కోసం ప్రధాని మోడీ ఇటలీ పర్యటనకు ముందు ఈ ఘటన చోటుచేసుకుంది. ఖలిస్తాన్ మద్దతుదారులు హర్దీప్ సింగ్ నిజ్జర్ నినాదాలు సైతం కనిపించాయి. జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జీ7 సదస్సు జరగనుంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు మోడీ ఇటలీ వెళ్లనున్నారు. కాగా.. ప్రధాని పర్యటనకు ముందు అక్కడ మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఫొటోలు బయటపడ్డాయి. ఈ ఫొటోల్లో గాంధీ విగ్రహం ధ్వంసం కావడంతోపాటు విగ్రహం కిందిభాగంలో ఖలిస్తానీ మద్దతు తెలుపుతున్న నినాదాలు కనిపిస్తున్నాయి.
READ MORE: Mangoes: రుచిలోనే కాదు, ఆరోగ్యం విషయంలోనూ మామిడి ‘నెంబర్ వన్’..
Also Read
- Kothagudem Airport: కొత్తగూడెం విమానాశ్రయ ప్రతిపాదనపై కేంద్ర సాంకేతిక బృందం పర్యటన.!
- AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
- Pushpa Srivani Arrest: అక్రమంగా అరెస్ట్ చేశారు.. పోలీసుల తీరుపై మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఆగ్రహం!
- IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
ఈ ఘటనపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పందించింది. ఇటలీలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన విషయాన్ని భారత్ లేవనెత్తిందని, విగ్రహానికి ఇటలీ ప్రభుత్వం మరమ్మతులు చేసినట్లు విదేశాంగ కార్యదర్శి తెలిపారు. ఈ అంశంపై ఇటలీ అధికారులతో మాట్లాడామన్నారు. అవసరమైన చర్యలు తీసుకున్నామని చెప్పారు.
కాగా.. ఈ సంవత్సరం G7 శిఖరాగ్ర సమావేశం ఇటలీలోని అపులియా ప్రాంతంలోని బోర్గో ఎగ్నాజియా విలాసవంతమైన రిసార్ట్లో జరుగుతుంది. జీ7 సదస్సుకు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో హాజరుకానున్నారు. పీఎం మోడీ జూన్ 13 న ఇటలీకి బయలుదేరి జూన్ 14 సాయంత్రం తిరిగి వస్తారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా మరియు ఎన్ఎస్ఎ అజిత్ దోవల్లతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా ప్రధానమంత్రి వెంట ఉంటుంది.
- Tags
- Bharath
- g7meet
- gandhi statue
- india
- Italy
తాజావార్తలు
-
Kothagudem Airport: కొత్తగూడెం విమానాశ్రయ ప్రతిపాదనపై కేంద్ర సాంకేతిక బృందం పర్యటన.!
-
Rana Daggubati: చిన్న థియేటర్లతో రానా కొత్త ప్రయోగం.. ‘ది అసెంబ్లీ రూమ్స్’తో ఇండిపెండెంట్ సినిమాలకు బూస్ట్!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
Pushpa Srivani Arrest: అక్రమంగా అరెస్ట్ చేశారు.. పోలీసుల తీరుపై మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఆగ్రహం!
-
MYSAA : రష్మిక పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘మైసా’ రిలీజ్ డేట్ లాక్
ట్రెండింగ్
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!