Italy:ఇటలీలో గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఖలిస్తానీ మద్దతుదారులు..రేపు మోడీ పర్యటన సందర్భంగా దుశ్చర్య
- జీ7 సదస్సు సందర్భంగా ఇటలీకి ప్రధాని మోడీ
- పర్యటనకు ఒక రోజు ముందే విగ్రహం ధ్వంసం
- గోడలపై ఖలిస్తాన్ కు మద్దతుగా నినాదాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటలీలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఖలిస్తానీ మద్దతుదారులు ధ్వంసం చేశారు. జీ7 సదస్సు కోసం ప్రధాని మోడీ ఇటలీ పర్యటనకు ముందు ఈ ఘటన చోటుచేసుకుంది. ఖలిస్తాన్ మద్దతుదారులు హర్దీప్ సింగ్ నిజ్జర్ నినాదాలు సైతం కనిపించాయి. జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జీ7 సదస్సు జరగనుంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు మోడీ ఇటలీ వెళ్లనున్నారు. కాగా.. ప్రధాని పర్యటనకు ముందు అక్కడ మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఫొటోలు బయటపడ్డాయి. ఈ ఫొటోల్లో గాంధీ విగ్రహం ధ్వంసం కావడంతోపాటు విగ్రహం కిందిభాగంలో ఖలిస్తానీ మద్దతు తెలుపుతున్న నినాదాలు కనిపిస్తున్నాయి.
READ MORE: Mangoes: రుచిలోనే కాదు, ఆరోగ్యం విషయంలోనూ మామిడి ‘నెంబర్ వన్’..
Also Read
- Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
- Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
- Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
- India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ఈ ఘటనపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పందించింది. ఇటలీలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన విషయాన్ని భారత్ లేవనెత్తిందని, విగ్రహానికి ఇటలీ ప్రభుత్వం మరమ్మతులు చేసినట్లు విదేశాంగ కార్యదర్శి తెలిపారు. ఈ అంశంపై ఇటలీ అధికారులతో మాట్లాడామన్నారు. అవసరమైన చర్యలు తీసుకున్నామని చెప్పారు.
కాగా.. ఈ సంవత్సరం G7 శిఖరాగ్ర సమావేశం ఇటలీలోని అపులియా ప్రాంతంలోని బోర్గో ఎగ్నాజియా విలాసవంతమైన రిసార్ట్లో జరుగుతుంది. జీ7 సదస్సుకు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో హాజరుకానున్నారు. పీఎం మోడీ జూన్ 13 న ఇటలీకి బయలుదేరి జూన్ 14 సాయంత్రం తిరిగి వస్తారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా మరియు ఎన్ఎస్ఎ అజిత్ దోవల్లతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా ప్రధానమంత్రి వెంట ఉంటుంది.
- Tags
- Bharath
- g7meet
- gandhi statue
- india
- Italy
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!