Virendra Kumar: సైకిల్ కు పంక్చర్లు వేసే స్థాయి నుంచి మూడు సార్లు కేంద్ర మంత్రిగా..ఎవరో తెలుసా?
- ఎనిమిది సార్లు ఎంపీగా గెలిచిన వీరేంద్ర కుమార్
- ఈ సారి కూడా భారీ మెజార్టీతో విజయం
- ఆర్ఎస్ఎస్ నుంచి మొదలైన ప్రయాణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్లోని బుందేల్ఖండ్కు చెందిన ప్రముఖ నాయకుడు, 8 సార్లు ఎంపీగా గెలిచిన వీరేంద్ర కుమార్ ఖాటిక్ మోడీ 3.0 కేబినెట్లో మంత్రి అయ్యారు. ఖాటిక్ టికామ్గఢ్ నుంచి ఎంపీగా గెలుపొందారు. అతని సింప్లిసిటీ కారణంగా పలు మార్లు ఆయన వార్తల్లో నిలిచారు. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి వీరేంద్ర ఖటిక్ కాంగ్రెస్కు చెందిన పంకజ్ అహిర్వార్పై 4 లక్షలకు పైగా ఓట్లతో విజయం సాధించారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయనకు సామాజిక న్యాయం, సాధికారత శాఖ బాధ్యతలు అప్పగించారు.
READ MORE: Toothache : ఈ చిన్న చిట్కాలు పాటిస్తే.. పంటి నొప్పి నుంచి ఉపశమనం ఖాయం!
Also Read
- Aman Sanger: నాలుగేళ్లలో ఐదున్నర లక్షల కోట్ల సంపాదన.. 25 ఏళ్ల భారతీయ కుర్రాడి సక్సెస్ స్టోరీ..
- Anant Ambani: టీటీడీకి రూ.27.5 కోట్ల భారీ విరాళం.. 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్ కూడా!
- Iran: "నరకం చూపిస్తాం".. అమెరికా, గల్ఫ్ దేశాలకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక
- Donald Trump: "ఇకపై ఇరాన్ అనే దేశమే ఉండదు".. ట్రంప్ బిగ్ వార్నింగ్.. ఆందోళనలో ప్రపంచ దేశాలు!
మోడీ కేబినెట్లో వీరేంద్ర కుమార్ ఖటిక్ మూడోసారి మంత్రి అయ్యారు. 2017లో తొలిసారిగా, ప్రధాని మోడీ క్యాబినెట్లో ఖాటిక్ మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. 2021లో సామాజిక న్యాయం, సాధికారత మంత్రిగా నియమితులయ్యారు. 1954 ఫిబ్రవరి 27న సాగర్ జిల్లాలోని అత్యంత పేద కుటుంబంలో జన్మించిన వీరేంద్ర కుమార్ ఖాటిక్.. తన కష్టార్జితం ఆధారంగా సాగర్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా పొందారు. చదువు కోసం ఖాటిక్ సైకిళ్ల రిపేర్ నుంచి వాహనాల రిపేర్ వరకు పని చేయాల్సి వచ్చేది.
వీరేంద్ర ఖటిక్ ఇంతకు ముందు పంక్చర్ వేశారు..
డాక్టర్ వీరేంద్ర ఖటిక్ తండ్రికి మధ్యప్రదేశ్లోని సాగర్లో సైకిల్ రిపేరింగ్ షాప్ ఉంది. వీరేంద్ర ఖటిక్ ప్రకారం.. చిన్నప్పుడు కుటుంబ పరిస్థితుల వల్ల ఆయన పంక్చర్లు వేయడం, సైకిల్ రిపేర్ చేసేవారు. 2019లో ఓ కార్యక్రమంలో దివ్యాంగులకు ఇచ్చే ట్రైసైకిళ్లలో గాలి తక్కువగా ఉండడంతో ఎంపీ వీరేంద్ర ఖటిక్ స్వయంగా పంపుతో చక్రాల్లో గాలి నింపారు. అనంతరం వారికి పంచిపెట్టారు. అతని సింప్లిసిటీని కూడా ఆ వ్యక్తులు కెమెరాలో బంధించారు.
READ MORE: Seethakka: ప్రజా భవన్ను మంత్రి సీతక్క ఆకస్మిక సందర్శన.. ప్రజల నుండి దరఖాస్తుల స్వీకరణ
కాగా.. ఆయన 1975లో లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్ ప్రారంభించిన సంపూర్ణ విప్లవోద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఎమర్జెన్సీ కి వ్యతిరేకంగా పోరాడి 16 నెలల జైలు శిక్ష అనుభవించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఉద్యమాన్ని ప్రారంభించారు. వారు చదువుకుని రాణించేందుకు లైబ్రరీని ఏర్పాటు చేశారు. 1982లో రాజకీయాల్లో చేరి, అప్పటి నుంచి బీజేపీ ప్రారంభించిన జాతీయ, రాష్ట్ర, స్థానిక ఉద్యమాలు, కార్యక్రమాలతో చురుగ్గా అనుబంధం కలిగి ఉన్నారు. దళిత నాయకుడు వీరేంద్ర కుమార్ 2024 లోక్సభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్లోని తికమ్గఢ్ నియోజకవర్గాన్ని 8వసారి నిలబెట్టుకున్నారు. అత్యంత సీనియర్ ఎంపీలలో ఒకరు.
తాజావార్తలు
-
AA 23 : పూజా హెగ్డేకు లోకేశ్ కనగరాజ్ మరో ఛాన్స్.. కానీ?
-
Balan The Boy: 8 రోజుల్లో 24 కోట్ల వసూళ్లు.. మరో బ్లాక్ బస్టర్తో చిదంబరం మ్యాజిక్
-
Woman Litters In Train: రైలు కోచ్లో చెత్త విసిరి, సీటు పక్కనే చేతులు కడిగిన మహిళ.. సివిక్ సెన్స్పై దేశవ్యాప్తంగా చర్చ
-
Sourav Ganguly: అతడు ఓ మూర్ఖుడు.. ఒకసారి మోసపోయా, రెండోసారి మోసపోను!
-
Aman Sanger: నాలుగేళ్లలో ఐదున్నర లక్షల కోట్ల సంపాదన.. 25 ఏళ్ల భారతీయ కుర్రాడి సక్సెస్ స్టోరీ..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!