Virendra Kumar: సైకిల్ కు పంక్చర్లు వేసే స్థాయి నుంచి మూడు సార్లు కేంద్ర మంత్రిగా..ఎవరో తెలుసా?
- ఎనిమిది సార్లు ఎంపీగా గెలిచిన వీరేంద్ర కుమార్
- ఈ సారి కూడా భారీ మెజార్టీతో విజయం
- ఆర్ఎస్ఎస్ నుంచి మొదలైన ప్రయాణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్లోని బుందేల్ఖండ్కు చెందిన ప్రముఖ నాయకుడు, 8 సార్లు ఎంపీగా గెలిచిన వీరేంద్ర కుమార్ ఖాటిక్ మోడీ 3.0 కేబినెట్లో మంత్రి అయ్యారు. ఖాటిక్ టికామ్గఢ్ నుంచి ఎంపీగా గెలుపొందారు. అతని సింప్లిసిటీ కారణంగా పలు మార్లు ఆయన వార్తల్లో నిలిచారు. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి వీరేంద్ర ఖటిక్ కాంగ్రెస్కు చెందిన పంకజ్ అహిర్వార్పై 4 లక్షలకు పైగా ఓట్లతో విజయం సాధించారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయనకు సామాజిక న్యాయం, సాధికారత శాఖ బాధ్యతలు అప్పగించారు.
READ MORE: Toothache : ఈ చిన్న చిట్కాలు పాటిస్తే.. పంటి నొప్పి నుంచి ఉపశమనం ఖాయం!
Also Read
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
- Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
- Off The Record: అధికారం కోసం తప్ప పార్టీ కోసం ఎవరూ పని చేయట్లేదా..? ఆ ఉమ్మడి జిల్లా జనసేన కమిటీ మొత్తం రద్దు..
- Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
మోడీ కేబినెట్లో వీరేంద్ర కుమార్ ఖటిక్ మూడోసారి మంత్రి అయ్యారు. 2017లో తొలిసారిగా, ప్రధాని మోడీ క్యాబినెట్లో ఖాటిక్ మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. 2021లో సామాజిక న్యాయం, సాధికారత మంత్రిగా నియమితులయ్యారు. 1954 ఫిబ్రవరి 27న సాగర్ జిల్లాలోని అత్యంత పేద కుటుంబంలో జన్మించిన వీరేంద్ర కుమార్ ఖాటిక్.. తన కష్టార్జితం ఆధారంగా సాగర్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా పొందారు. చదువు కోసం ఖాటిక్ సైకిళ్ల రిపేర్ నుంచి వాహనాల రిపేర్ వరకు పని చేయాల్సి వచ్చేది.
వీరేంద్ర ఖటిక్ ఇంతకు ముందు పంక్చర్ వేశారు..
డాక్టర్ వీరేంద్ర ఖటిక్ తండ్రికి మధ్యప్రదేశ్లోని సాగర్లో సైకిల్ రిపేరింగ్ షాప్ ఉంది. వీరేంద్ర ఖటిక్ ప్రకారం.. చిన్నప్పుడు కుటుంబ పరిస్థితుల వల్ల ఆయన పంక్చర్లు వేయడం, సైకిల్ రిపేర్ చేసేవారు. 2019లో ఓ కార్యక్రమంలో దివ్యాంగులకు ఇచ్చే ట్రైసైకిళ్లలో గాలి తక్కువగా ఉండడంతో ఎంపీ వీరేంద్ర ఖటిక్ స్వయంగా పంపుతో చక్రాల్లో గాలి నింపారు. అనంతరం వారికి పంచిపెట్టారు. అతని సింప్లిసిటీని కూడా ఆ వ్యక్తులు కెమెరాలో బంధించారు.
READ MORE: Seethakka: ప్రజా భవన్ను మంత్రి సీతక్క ఆకస్మిక సందర్శన.. ప్రజల నుండి దరఖాస్తుల స్వీకరణ
కాగా.. ఆయన 1975లో లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్ ప్రారంభించిన సంపూర్ణ విప్లవోద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఎమర్జెన్సీ కి వ్యతిరేకంగా పోరాడి 16 నెలల జైలు శిక్ష అనుభవించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఉద్యమాన్ని ప్రారంభించారు. వారు చదువుకుని రాణించేందుకు లైబ్రరీని ఏర్పాటు చేశారు. 1982లో రాజకీయాల్లో చేరి, అప్పటి నుంచి బీజేపీ ప్రారంభించిన జాతీయ, రాష్ట్ర, స్థానిక ఉద్యమాలు, కార్యక్రమాలతో చురుగ్గా అనుబంధం కలిగి ఉన్నారు. దళిత నాయకుడు వీరేంద్ర కుమార్ 2024 లోక్సభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్లోని తికమ్గఢ్ నియోజకవర్గాన్ని 8వసారి నిలబెట్టుకున్నారు. అత్యంత సీనియర్ ఎంపీలలో ఒకరు.
తాజావార్తలు
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
-
Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
-
PoK Unrest 2026: పతనం అంచున పీఓకే.. పాలకులపై తిరగబడ్డ జనం! భారత్లో కలవడానికి పీఓకే మొగ్గు చూపుతోందా?
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!