Virendra Kumar: సైకిల్ కు పంక్చర్లు వేసే స్థాయి నుంచి మూడు సార్లు కేంద్ర మంత్రిగా..ఎవరో తెలుసా?
- ఎనిమిది సార్లు ఎంపీగా గెలిచిన వీరేంద్ర కుమార్
- ఈ సారి కూడా భారీ మెజార్టీతో విజయం
- ఆర్ఎస్ఎస్ నుంచి మొదలైన ప్రయాణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్లోని బుందేల్ఖండ్కు చెందిన ప్రముఖ నాయకుడు, 8 సార్లు ఎంపీగా గెలిచిన వీరేంద్ర కుమార్ ఖాటిక్ మోడీ 3.0 కేబినెట్లో మంత్రి అయ్యారు. ఖాటిక్ టికామ్గఢ్ నుంచి ఎంపీగా గెలుపొందారు. అతని సింప్లిసిటీ కారణంగా పలు మార్లు ఆయన వార్తల్లో నిలిచారు. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి వీరేంద్ర ఖటిక్ కాంగ్రెస్కు చెందిన పంకజ్ అహిర్వార్పై 4 లక్షలకు పైగా ఓట్లతో విజయం సాధించారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయనకు సామాజిక న్యాయం, సాధికారత శాఖ బాధ్యతలు అప్పగించారు.
READ MORE: Toothache : ఈ చిన్న చిట్కాలు పాటిస్తే.. పంటి నొప్పి నుంచి ఉపశమనం ఖాయం!
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
మోడీ కేబినెట్లో వీరేంద్ర కుమార్ ఖటిక్ మూడోసారి మంత్రి అయ్యారు. 2017లో తొలిసారిగా, ప్రధాని మోడీ క్యాబినెట్లో ఖాటిక్ మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. 2021లో సామాజిక న్యాయం, సాధికారత మంత్రిగా నియమితులయ్యారు. 1954 ఫిబ్రవరి 27న సాగర్ జిల్లాలోని అత్యంత పేద కుటుంబంలో జన్మించిన వీరేంద్ర కుమార్ ఖాటిక్.. తన కష్టార్జితం ఆధారంగా సాగర్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా పొందారు. చదువు కోసం ఖాటిక్ సైకిళ్ల రిపేర్ నుంచి వాహనాల రిపేర్ వరకు పని చేయాల్సి వచ్చేది.
వీరేంద్ర ఖటిక్ ఇంతకు ముందు పంక్చర్ వేశారు..
డాక్టర్ వీరేంద్ర ఖటిక్ తండ్రికి మధ్యప్రదేశ్లోని సాగర్లో సైకిల్ రిపేరింగ్ షాప్ ఉంది. వీరేంద్ర ఖటిక్ ప్రకారం.. చిన్నప్పుడు కుటుంబ పరిస్థితుల వల్ల ఆయన పంక్చర్లు వేయడం, సైకిల్ రిపేర్ చేసేవారు. 2019లో ఓ కార్యక్రమంలో దివ్యాంగులకు ఇచ్చే ట్రైసైకిళ్లలో గాలి తక్కువగా ఉండడంతో ఎంపీ వీరేంద్ర ఖటిక్ స్వయంగా పంపుతో చక్రాల్లో గాలి నింపారు. అనంతరం వారికి పంచిపెట్టారు. అతని సింప్లిసిటీని కూడా ఆ వ్యక్తులు కెమెరాలో బంధించారు.
READ MORE: Seethakka: ప్రజా భవన్ను మంత్రి సీతక్క ఆకస్మిక సందర్శన.. ప్రజల నుండి దరఖాస్తుల స్వీకరణ
కాగా.. ఆయన 1975లో లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్ ప్రారంభించిన సంపూర్ణ విప్లవోద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఎమర్జెన్సీ కి వ్యతిరేకంగా పోరాడి 16 నెలల జైలు శిక్ష అనుభవించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఉద్యమాన్ని ప్రారంభించారు. వారు చదువుకుని రాణించేందుకు లైబ్రరీని ఏర్పాటు చేశారు. 1982లో రాజకీయాల్లో చేరి, అప్పటి నుంచి బీజేపీ ప్రారంభించిన జాతీయ, రాష్ట్ర, స్థానిక ఉద్యమాలు, కార్యక్రమాలతో చురుగ్గా అనుబంధం కలిగి ఉన్నారు. దళిత నాయకుడు వీరేంద్ర కుమార్ 2024 లోక్సభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్లోని తికమ్గఢ్ నియోజకవర్గాన్ని 8వసారి నిలబెట్టుకున్నారు. అత్యంత సీనియర్ ఎంపీలలో ఒకరు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!