Virendra Kumar: సైకిల్ కు పంక్చర్లు వేసే స్థాయి నుంచి మూడు సార్లు కేంద్ర మంత్రిగా..ఎవరో తెలుసా?
- ఎనిమిది సార్లు ఎంపీగా గెలిచిన వీరేంద్ర కుమార్
- ఈ సారి కూడా భారీ మెజార్టీతో విజయం
- ఆర్ఎస్ఎస్ నుంచి మొదలైన ప్రయాణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్లోని బుందేల్ఖండ్కు చెందిన ప్రముఖ నాయకుడు, 8 సార్లు ఎంపీగా గెలిచిన వీరేంద్ర కుమార్ ఖాటిక్ మోడీ 3.0 కేబినెట్లో మంత్రి అయ్యారు. ఖాటిక్ టికామ్గఢ్ నుంచి ఎంపీగా గెలుపొందారు. అతని సింప్లిసిటీ కారణంగా పలు మార్లు ఆయన వార్తల్లో నిలిచారు. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి వీరేంద్ర ఖటిక్ కాంగ్రెస్కు చెందిన పంకజ్ అహిర్వార్పై 4 లక్షలకు పైగా ఓట్లతో విజయం సాధించారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయనకు సామాజిక న్యాయం, సాధికారత శాఖ బాధ్యతలు అప్పగించారు.
READ MORE: Toothache : ఈ చిన్న చిట్కాలు పాటిస్తే.. పంటి నొప్పి నుంచి ఉపశమనం ఖాయం!
Also Read
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
మోడీ కేబినెట్లో వీరేంద్ర కుమార్ ఖటిక్ మూడోసారి మంత్రి అయ్యారు. 2017లో తొలిసారిగా, ప్రధాని మోడీ క్యాబినెట్లో ఖాటిక్ మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. 2021లో సామాజిక న్యాయం, సాధికారత మంత్రిగా నియమితులయ్యారు. 1954 ఫిబ్రవరి 27న సాగర్ జిల్లాలోని అత్యంత పేద కుటుంబంలో జన్మించిన వీరేంద్ర కుమార్ ఖాటిక్.. తన కష్టార్జితం ఆధారంగా సాగర్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా పొందారు. చదువు కోసం ఖాటిక్ సైకిళ్ల రిపేర్ నుంచి వాహనాల రిపేర్ వరకు పని చేయాల్సి వచ్చేది.
వీరేంద్ర ఖటిక్ ఇంతకు ముందు పంక్చర్ వేశారు..
డాక్టర్ వీరేంద్ర ఖటిక్ తండ్రికి మధ్యప్రదేశ్లోని సాగర్లో సైకిల్ రిపేరింగ్ షాప్ ఉంది. వీరేంద్ర ఖటిక్ ప్రకారం.. చిన్నప్పుడు కుటుంబ పరిస్థితుల వల్ల ఆయన పంక్చర్లు వేయడం, సైకిల్ రిపేర్ చేసేవారు. 2019లో ఓ కార్యక్రమంలో దివ్యాంగులకు ఇచ్చే ట్రైసైకిళ్లలో గాలి తక్కువగా ఉండడంతో ఎంపీ వీరేంద్ర ఖటిక్ స్వయంగా పంపుతో చక్రాల్లో గాలి నింపారు. అనంతరం వారికి పంచిపెట్టారు. అతని సింప్లిసిటీని కూడా ఆ వ్యక్తులు కెమెరాలో బంధించారు.
READ MORE: Seethakka: ప్రజా భవన్ను మంత్రి సీతక్క ఆకస్మిక సందర్శన.. ప్రజల నుండి దరఖాస్తుల స్వీకరణ
కాగా.. ఆయన 1975లో లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్ ప్రారంభించిన సంపూర్ణ విప్లవోద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఎమర్జెన్సీ కి వ్యతిరేకంగా పోరాడి 16 నెలల జైలు శిక్ష అనుభవించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఉద్యమాన్ని ప్రారంభించారు. వారు చదువుకుని రాణించేందుకు లైబ్రరీని ఏర్పాటు చేశారు. 1982లో రాజకీయాల్లో చేరి, అప్పటి నుంచి బీజేపీ ప్రారంభించిన జాతీయ, రాష్ట్ర, స్థానిక ఉద్యమాలు, కార్యక్రమాలతో చురుగ్గా అనుబంధం కలిగి ఉన్నారు. దళిత నాయకుడు వీరేంద్ర కుమార్ 2024 లోక్సభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్లోని తికమ్గఢ్ నియోజకవర్గాన్ని 8వసారి నిలబెట్టుకున్నారు. అత్యంత సీనియర్ ఎంపీలలో ఒకరు.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!