ప్రధాని మోడీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున మరోసారి ఖర్గె ఫైరయ్యారు. మోడీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ " కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రామ మందిరంపైకి బుల్డోజర్లు పంపుతారు" అని వ్యాఖ్యానించారు.
అమెరికా మరోసారి భారత్ ను మెచ్చుకుంది. భారత్ లో సార్వత్రికి ఎన్నికలపై అమెరికా ప్రశంసలు కురిపించింది. ప్రపంచంలో భారత్ కంటే శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశం మరొకటి లేదని కొనియాడింది. ఆ దేశ వైట్ హౌస్ జాతీయ భద్రతా సమాచార సలహాదారు జాన్ కిర్బీ ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ భారత్ను ప్రశంసించారు.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న సౌత్ సినిమాలోనే కాకుండా హిందీ ప్రేక్షకులలో కూడా బాగా పాపులర్ అయ్యింది. రష్మిక గత కొన్నేళ్లుగా ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటిస్తోంది. ఆమె చివరిగా రణబీర్ కపూర్ నటించిన బ్లాక్ బస్టర్ సినిమా 'యానిమల్'లో కనిపించింది.
సార్వత్రిక ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు. సీట్ల పంపకంలో తేడా రావడంతో ఇండియా కూటమితో విభేదించిన ఆమె ప్రస్తుతం ఆ కూటమికి జై కొట్టారు. ఎన్నికల తర్వాత కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు తమ పార్టీ బయటి నుంచి మద్దతు ఇస్తుందని మమతా బెనర్జీ వెల్లడించారు. ఆమె మాట్లాడుతూ..
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో బహిరంగ చర్చకు బీజేపీ యువమోర్చా ఉపాధ్యక్షుడు అభినవ్ ప్రకాశ్ పేరును సోమవారం నామినేట్ చేసింది. భారతీయ జనతా యువమోర్చా ప్రెసిడెంట్ తేజస్వి సూర్య రాహుల్ గాంధీకి రాసిన లేఖలో, 'ఇది రాజకీయ కుటుంబానికి చెందిన వారసులు, సాధారణ యువకులకు మధ్య గొప్ప చర్చ అవుతుంది' అని రాశారు.
చైనా- భారత్ మధ్య తీవ్రమైన ఘర్షణ వాతావరణం కనిపిస్తుంది. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి ఉంటుంది. సరిహద్దుల్లో చైనాతో ఘర్షణలు కొనసాగుతున్నప్పటికీ.. వాణిజ్యం ఎందుకు పెరుగుతోందనే ప్రశ్నకు విదేశాంగ మంత్రి జైశంకర్ సమాధానమిచ్చారు.
రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల వేళ ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బీజేపీ నేతలు వ్యాపారులను బెదిరించి రూ. కోట్లు వసూలు చేస్తున్నారని.. ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపీ అభ్యర్థి నగేష్, మరో నేత అశోక్ లు కలిసి చందాల దందా చేస్తున్నారని మాజీ మంత్రి జోగు రామన్న సంచలన ఆరోపణలు చేశారు.
మోడీ మారోసారి ప్రధాని అవుతారని.. అందుకు పూర్తిగా కృషి చేస్తానని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. శుక్రవారం వరంగల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
భారతదేశం వారసత్వ పన్ను విధిస్తే.. దేశంలోని చాలా మంది ధనవంతులు దేశాన్ని విడిచిపెట్టి, పన్ను లేని దేశానికి తరలిపోతారని రాజకీయ ఆర్థికవేత్త గౌతమ్ అదాని అన్నారు. గతంలో స్వీడన్లో భారీ వారసత్వ పన్ను ఉండేదని.. అయితే చాలా మంది ధనవంతులు ఆ దేశం నుంచి పారిపోతున్నందున వారసత్వ పన్నును తొలగించిందని చెప్పారు. దుబాయ్ వంటి దేశాలకు వెళ్లి పన్నులు చెల్లించకుండా తప్పించుకుంటున్నారని తెలిపారు.