దేశంలోని పేద వాడికి ఒక్కరికి కూడా కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పధకం అమలు చేయలేదని మంత్రి సత్యవతి రాథోడ్ మండి పడ్డారు. మహబూబాబాద్ జిల్లా లోని క్యాంపు కార్యాలయంలో మంత్రి మీడియా సమావేశం నిర్వహించారు. భారత దేశం అన్ని మతాల కులాల వేదికగా నిలిచిందన్నారు. భారత దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటు పరం చేస్తూ దేశ సంపద అంతయు కొంతమంది చేతుల్లో పెడుతున్నారని మండి పడ్డారు.…
మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన టీఆర్ఎస్ 8వ వార్డు కౌన్సిలర్ బానోత్ రవినాయక్(35) గురువారం దారుణ హత్యకు గురయిన సంగతి తెలిసిందే. ద్విచక్ర వాహనంపై తాను కొత్తగా కట్టుకున్న ఇంటికి వెళ్తుండగా ప్రత్యర్ధులు దారుణంగా హతమార్చారు. ఒకరు తల్వార్.. మరొకరు గొడ్డలితో నరికి దారుణంగా హతమార్చి అక్కడినించి పారిపోయారు. రక్తపు మడుగులో ఉన్న రవినాయక్ మృతదేహాన్ని బంధువులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అప్పటికే మృతి చెందాడని ధ్రువీకరించారు. కాగా, హత్యకు పాల్పడ్డ ఇద్దరు అనుమానితులను…
ధాన్యం కొనుగోలు పై రాష్ట్ర రైతాంగం కొద్ది రోజులుగా పడుతున్న ఆందోళనకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఫుల్ స్టాప్ పెట్టారని రాష్ట్ర గిరిజన, స్త్రీ-,శిశు.. సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. యాసంగిలో ధాన్యం సేకరణపై మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసమావేశంలో మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. యాసంగి లో తెలంగాణలో బాయిల్డ్ రైస్ కొనమని కేంద్రం షరతులు పెట్టి చేతులు ఎత్తివేయడంతో… సీఎం కేసీఆర్…
World largest Dr. B R Ambedkar Statue constructing by CM KCR Says Minister Satyavathi Rathod. కేసీఆర్ సర్కార్ దేశంలో అతిపెద్ద డా.బీఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు పునుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు కోసం స్థలాన్న సేకరించారు. అంబేద్కర్ విగ్రహ ఏర్పాట్లు కూడా శరవేగంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం ఏర్పాటు…
ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను మూడు రోజులు జరపాలని పార్టీ నిర్ణయం తీసుకుందని మంత్రి సత్యవతి రాథోడ్ వెల్లడించారు. 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మహిళా దినోత్సవం వేడుకలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు.టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల మహిళలకు అందిన ఫలాల గురించి వివరించబోతున్నామని, 6వ తేదీన గ్రామంలో కేసీఆర్ ఫొటోకు రాఖీ కట్టే కార్యక్రమం నిర్వహించబోతున్నట్లు ఆమె తెలిపారు. అంతేకాకుండా 7వ తేదీన కళ్యాణలక్ష్మీ- కేసీఆర్ కిట్- అందిన కుటుంబాలతో…
ప్రధాని మోడీ ఇటీవల పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు మోడీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. ప్రధాని హైదరాబాద్కు వచ్చినపుడు ముఖ్యమంత్రి కేసీఆర్కి జ్వరం ఉందని వెళ్లకపోతే అది మనసులో పెట్టుకుని తెలంగాణపై విషం కక్కుతున్నారని అన్నారు. ప్రతి తెలంగాణ బిడ్డ దీనిని తీవ్ర పరిణామంగా తీసుకుని నిరసన తెలపాలని, కేసిఆర్ ఇప్పటికే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడుతున్నారని, కేసీఆర్ వల్ల తనకు, తన…
తెలంగాణపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీజేపీపై మండిపడుతున్నారు టీఆర్ఎస్ నేతలు. మేడారం జాతరకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంపై ఎంపీ బండి సంజయ్ ను ప్రశ్నించారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ తెలంగాణలోనే ఉండటం మనందరికీ గర్వకారణం అన్నారు ఎమ్మెల్సీ కవిత. స్వరాష్ట్రంలో నాలుగు సార్లు వైభవంగా జరిగిన మేడారం జాతర నిర్వహణ కోసం సీఎం కేసీఆర్ మొత్తం 332.71 కోట్ల రూపాయలను విడుదల చేశారన్నారు. 2014…
తెలంగాణకే తలమానికమైన సమ్మక్క-సారక్క జాతర ఏర్పాట్లను మంత్రి సత్యవతి రాథోడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సమ్మక్క-సారక్క జాతరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలను నుంచి రోజుకు సుమారు 3 లక్షల మంది అమ్మవార్ల దర్శనం కోసం విచ్చేస్తారని అంచనా వేసినట్లు ఆమె పేర్కొన్నారు. భక్తుల ఆరోగ్య దృష్ట్యా జాతరలో మెడికల్…
హైదరాబాదులో కోట్ల రూపాయల భూమిని ఇచ్చి ఇరవై అయిదు కోట్ల రూపాయల వ్యయంతో గిరిజన కొమురంభీమ్ భవనాన్ని నిర్మిస్తున్నామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. బుధవారం ఆమె నిర్మల్ జిల్లాలో మాట్లాడుతూ.. గిరిజన బిడ్డలు కోరుకున్న గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసామని, గిరిజనులు, పేదలను ఇన్ని రోజులు ఓట్ల సాధనాలుగానే చూశారని ఆమె వ్యాఖ్యానించారు. ఉద్యమ కాలంలో అరవై అయిదు సీట్లు ఇస్తే, అనంతరం జరిగిన ఎన్నికల్లో ఎనభై అయిదు సీట్లను కట్టబెట్టే…
ఉమ్మడి వరంగల్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. వరంగల్ కలెక్టరేట్ లో ఈ ఎన్నిక అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి విశ్వ నారాయణకు ఈ రోజు నామినేషన్లు అందించారు. కాగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి రెండు నామినేషన్లు వేయగా, పోచంపల్లి తరపున మరో రెండు నామినేషన్లు పడ్డాయి. మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే అరూరి రమేశ్ తో కలిసి ఒక సెట్, మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే…