Satyavathi Rathod: అది మనసులో పెట్టుకుని తెలంగాణపై విషం కక్కుతున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ ఇటీవల పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు మోడీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. ప్రధాని హైదరాబాద్కు వచ్చినపుడు ముఖ్యమంత్రి కేసీఆర్కి జ్వరం ఉందని వెళ్లకపోతే అది మనసులో పెట్టుకుని తెలంగాణపై విషం కక్కుతున్నారని అన్నారు. ప్రతి తెలంగాణ బిడ్డ దీనిని తీవ్ర పరిణామంగా తీసుకుని నిరసన తెలపాలని, కేసిఆర్ ఇప్పటికే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడుతున్నారని, కేసీఆర్ వల్ల తనకు, తన పదవికి ఎక్కడ ఇబ్బంది వస్తుందోనని భావించి, తెలంగాణపై ప్రధాని నరేంద్ర మోడి విషం చిమ్ముతున్నారని ఆమె మండిపడ్డారు.
పార్లమెంట్ తలపులు వేసి రాష్ట్రం ఇచ్చారని అడ్డగోలుగా మాట్లాడితే మరి ఆరోజు మీ నాయకులు కళ్ళు మూసుకుని మద్దతు ఇచ్చారా? ప్రధాని చెప్పాలి.. అని ఆమె ప్రశ్నించారు. మీ ఒక్కరికే రాజ్యాంగం తెలిసినట్లు, తెలివి ఉన్నట్లు మాట్లాడొద్దని ఆమె చురకలు అంటించారు. కాంగ్రెస్ పార్టీ మీద కోపాన్ని వెళ్ళబుచ్చే క్రమంలో తెలంగాణ ప్రజలపై అక్కసు వెళ్ళబుచ్చడం సరైన పద్దతి కాదని తెలుసుకోవాలని, తెలంగాణ ప్రజలు, జాతికి ఈ ప్రధాని క్షమాపణలు చెప్పాలిని ఆమె డిమాండ్ చేశారు. మూర్ఖ వ్యక్తి ప్రధాని కావడం దేశ ప్రజల దురదృష్టమని ఆయన అన్నారు.
Also Read
తాజావార్తలు
-
OTR : కాంగ్రెస్లో ఇక గీత దాటితే ఎంతటి వారికైనా వేటు తప్పదా?
-
India Won: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. 8.4 ఓవర్లోనే టార్గెట్ ఛేదించిన టీమిండియా..
-
Temple Theft : నిర్మల్లో గుడి దొంగల గ్యాంగ్ అరెస్ట్.. 12 కిలోల వెండి స్వాధీనం!
-
OTR : బీఆర్ఎస్లో కొండా సురేఖకు ‘నో ఎంట్రీ’
-
OTR : కావలిలో క్రెడిట్ వార్.. ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!