What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
- నేడు ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ కీలక సమావేశం నిర్వహించనుంది. నదుల అనుసంధానంపై కేంద్రం ఫోకస్ పెట్టనుంది. ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం సమావేశానికి ఆహ్వానించింది. వృథాగా పోతున్న 247 టీఎంసీల గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోవాలనే లక్ష్యంతో ఈ సమావేశం నిర్వహించునున్నారు.
- నేడు 12 నియోజకవర్గాల ఇంచార్జీలతో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశం నిర్వహించనున్నారు. విశాఖపట్నం, తూర్పుగోదావరి, విజయనగరం జిల్లాల నేతలతో చంద్రబాబు భేటీ కానున్నారు. 3 జిల్లాల ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జీలతో చంద్రబాబు సమావేశం కానున్నారు.
- నేడు భారత్, వెస్టండీస్ మధ్య రెండో టీ20 మ్యాచ్ జరుగనుంది. కోల్కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. మూడీ టీ20ల సిరీస్లో 1-0 ఆధిక్యంలో టీమిండియా ఉంది. అయితే నేటి మ్యాచ్లో టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ వైపు మొగ్గుచూపే అవకాశం కనిపిస్తోంది.
- నేడు గుంటూరు జిల్లాలో ఏపీ సీఎం జగన్ పర్యటించనున్నారు. ఆత్మకూరు కేంద్రీకృత వంటశాలను సీఎం జగన్ ప్రారంభించనున్నారు. అత్యాధునిక వంటశాలను ఇస్కాన్ అక్షయపాత్ర ఫౌండేషన్ వారు సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో కొలనుకొండలో హరేకృష్ణ గోకుల క్షేత్రానికి సీఎం జగన్ భూమిపూజ చేయనున్నారు.
- నేడు రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పంజాబ్లో పర్యటించనున్నారు. కెప్టెన్ అమరీందర్ సింగ్కు మద్దతుగా రోడ్ షో నిర్వహించనున్నారు. అంతేకాకుండా సాయంత్రం లక్నోలో రాజ్నాథ్సింగ్ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.
- నేడు ఉత్తర్ప్రదేశ్లో హోంమంత్రి అమిత్షా పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన అయోధ్యలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.
- నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. తంగళపల్లి మండలం బద్దెనపల్లి రైతువేదికను ఈ సందర్భంగా ఆయన ప్రారంభించనున్నారు. అనంతరం ఎల్లమ్మ సర్కిల్ నుంచి బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం పార్టీ కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు.
- నేడు మేడారంకు తెలంగాణ సీఎం కేసీఆర్, కేంద్రమంత్రి కిషన్రెడ్డి లు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్, కిషన్రెడ్డి సమ్మక్క-సారక్కలను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
Also Read
- Nara Lokesh: ఇప్పుడు 'మావిగన్'.. రేపు బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాద్ కలిపి ‘బెన్తాహై’ అంటారేమో..!
- Simhachalam Temple Land: సింహాచలం భూముల వివాదంపై హైకోర్టు సీరియస్.. ప్రభుత్వానికి నోటీసులు
- Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
- US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
తాజావార్తలు
-
GST Collection June 2026: జూన్లో జీఎస్టీ వసూళ్ల జోరు.. రూ.1.95 లక్షల కోట్లకు చేరిన ఆదాయం
-
Nara Lokesh: ఇప్పుడు ‘మావిగన్’.. రేపు బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాద్ కలిపి ‘బెన్తాహై’ అంటారేమో..!
-
Donald Trump: డియర్ ట్రంప్.. నీకంత సీన్ లేదంటగా..! ప్యూ రీసెర్చ్ సెంటర్ నివేదికలో బయటపడ్డ ప్రెసిడెంట్ గారి బండారం
-
Malayalam movie updates: మోహన్లాల్తో ప్రియదర్శన్ 100వ సినిమా వాయిదా.. కారణం ఇదేనా?
-
Syria New Parliament: సిరియాలో ‘కొత్త శకం’.. అసద్ పతనం తర్వాత తొలి పార్లమెంట్ ఇదే!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!