Goa: బీచ్ షాక్స్లో ఇడ్లీ-సాంబార్ అమ్మకాలు కూడా గోవాలో అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్య తగ్గడానికి కారణమవుతున్నాయని బీజేపీ ఎమ్మెల్యే మైఖేల్ లోబో గురువారం అన్నారు. ఉత్తర గోవాలోని కలంగూట్లో విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గోవాకు తక్కువ మంది విదేశాయులు వస్తే ప్రభుత్వాన్ని మాత్రమే నిందిచలేమని, అందరు వాటాదారులకు సమాన బాధ్యత ఉంటుందని చెప్పారు. గోవా వాసులు తమ బీచ్ షాకులను ఇతర ప్రాంతాల వ్యాపారవేత్తలకు అద్దెకు ఇస్తున్నారని లోబో విచారం వ్యక్తం చేశారు.
గోవాలో హస్తం పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన 8 మంది శాసనసభ్యులు హస్తానికి గుడ్బై చెప్పనున్నారని తెలుస్తోంది. రాష్ట్ర మాజీ సీఎం దిగంబర్ కామత్, ప్రతిపక్ష నేత మైఖేల్ లోబో సహా ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బుధవారం నాడు బీజేపీలో చేరనున్నట్లు గోవా బీజేపీ చీఫ్ సదానంద్ షెట్ తనవాడే తెలిపారు.