ప్రముఖ సీనియర్ నటుడు, మాజీ ఎంపి మురళీ మోహన్ మెగాస్టార్ చిరంజీవిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుత తెలుగు చిత్ర పరిశ్రమకు గాడ్ ఫాదర్ అని ఎన్టీవీ ఛానెల్ కి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాసరి నారాయణరావు జీవించి ఉన్నంత కాలం తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రధాన పాత్ర పోషించారు. అయితే ఇప్పుడు ఆయన స్థానంలో చిరంజీవి కొంతవరకు భర్తీ చేస్తున్నారని అన్నారు. అలాగే చిత్ర…
కొరటాల శివ డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. కీలక పాత్రలో రాంచరణ్ నటిస్తున్నాడు. ఇప్పటికే చిత్రీకరణ తుదిదశకు చేరుకోగా, మరో పది రోజుల్లో షూటింగ్ పూర్తికానుంది. కాగా ఈ చిత్రం నుంచి విడుదల అయిన టీజర్, పాటకు మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. Read Also: దేశవ్యాప్తంగా రెండో స్థానంలో అల్లు అర్జున్ ‘పుష్ప’! తాజాగా లాహే.. లాహే పాట 60 మిలియన్స్ వ్యూస్…
ఫిల్మ్ ఫెడరేషన్ మెగాస్టార్ కు ధన్యవాదాలు తెలిపింది. ఎన్నో దశాబ్దాలుగా మీరు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి దాని ద్వారా ఎంతోమంది ప్రజలకు, అభిమానులకు, సినిమా కార్మికులకు సేవ చేస్తున్న విషయం మరచిపోలేనిది. కరోనా మహమ్మారి ప్రారంభ దశలోనే 2020 ఏప్రిల్లో సినిమా షూటింగ్స్ నిలిచిపోయి, లాక్ డౌన్ లో ఏ కార్మికులు బయటకు వెళ్లలేని పరిస్థితుల్లో సి సి సి నీ మనకోసం ఏర్పాటు చేసి, దానికి కమిటీని నియమించి, సినిమా రంగంలోని పెద్దలందరిని భాగస్వాములను…
మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ ప్లే చేస్తున్న ‘ఆచార్య’ చిత్రం షూటింగ్ ఇంకా కేవలం 12 రోజులే బాలెన్స్ ఉంది. నిజానికి కరోనా సెకండ్ వేవ్ సమస్య తలెత్తి ఉండకపోతే… ‘ఆచార్య’ ముందు అనుకున్న విధంగా మే 13న విడుదలై ఉండేది. కానీ ఊహించని విధంగా అన్ని సినిమాల మాదిరిగానే ఈ మెగా ప్రాజెక్ట్ షూటింగ్ లో సైతం అంతరాయం కలిగింది. ఇప్పుడు దీనిని ఏ తేదీన విడుదల చేసేది నిర్మాతలు తెలియ చేయకపోయినా… షూటింగ్ చేయాల్సింది…
(జూన్ 24తో ‘ఊరికిచ్చిన మాట’ 40 ఏళ్ళు పూర్తి)నలభై ఏళ్ళ క్రితం చిరంజీవి ఇంకా వర్ధమాన కథానాయకునిగా రాణిస్తున్న రోజుల్లో నటునిగా ఆయనకు మంచి పేరు సంపాదించి పెట్టిన చిత్రం ‘ఊరికిచ్చిన మాట’. ప్రముఖ నటుడు యమ్.బాలయ్య సమర్పణలో అమృతా ఫిలిమ్స్ పతాకంపై ఆయన దర్శకత్వంలోనే తెరకెక్కిన చిత్రమిది. 1981 జూన్ 24న విడుదలైన ఈ చిత్రంలో చిరంజీవి, సుధాకర్ అన్నదమ్ములుగా నటించారు. ‘ఊరికిచ్చిన మాట’ కథ విషయానికి వస్తే – ఓ మారుమూల పల్లెటూల్లో ఇద్దరు…
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం “ఆచార్య” చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. కరోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ త్వరలోనే తిరిగి ప్రారంభం కానుంది. ఈ చిత్రం తరువాత చిరంజీవి తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం వహించబోయే మలయాళ హిట్ మూవీ “లూసిఫర్”కు సిద్ధం కానున్నారు. ఈ రెండు చిత్రాలు పూర్తయ్యాక బాబీ దర్శకత్వంలో చిరు మరో చిత్రం చేయనున్నారు. ప్రస్తుతం ఇంకా టైటిల్…
(జూన్ 22న ‘శ్రీమంజునాథ’ 20 ఏళ్ళు పూర్తి) ఎందరో భక్తశిఖామణుల జీవితగాథలు తెరపై ఆవిష్కృతమయ్యాయి. ఆ కోవకు చెందినదే చిరంజీవి, అర్జున్ నటించిన భక్తి రసచిత్రం ‘శ్రీమంజునాథ’. కర్ణాటకలోని కోలార్ జిల్లా కమ్మసంద్రకు చెందిన కోటిలింగేశ్వర స్వామి దేవాలయం భక్తకోటిని విశేషంగా ఆకట్టుకుంటూ ఉంటుంది. అక్కడి ధర్మస్థల క్షేత్రం కూడా సుప్రసిద్ధమైనది. ఇక్కడి దేవుడు శ్రీమంజునాథునిగా పూజలందుకుంటూ ఉంటాడు. ఆయన మహిమతో జన్మించిన మంజునాథ అనే భక్తుని కథతో తెరకెక్కిన చిత్రమే ‘శ్రీమంజునాథ’. శివునిగా చిరంజీవి, భక్తునిగా…
నేడు ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన భార్య సురేఖతో కలిసి రక్తదానం చేశారు. రక్తదానం చేసి ఇతరుల ప్రాణాలు కాపాడే గొప్ప అవకాశం మనకు ఉందని ఆయన చెప్పారు. రక్తదానం చేయాలని అభిమానులకు పిలుపునిచ్చారు. రక్తదానం చేస్తున్న పిక్స్ని ట్విట్టర్ లో పోస్ట్ చేసి, అన్ని దానాల్లో కన్న రక్తదానం గొప్పదంటూ ట్వీట్ చేశారు. కాగా, చిరు బ్లడ్ బ్యాంకు ద్వారా రక్తదానాన్ని ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా పరిస్థితుల్లో చిరు ఆక్సిజన్…
ఆక్సిజన్ అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతోన్నారని తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతీ జిల్లాలో ఆక్సిజన్ బ్యాంక్ను ఏర్పాటు చేశారు. ఇక ఇప్పుడు చిరంజీవి మరో ముందడుగు వేశారు. అంబులెన్స్ కొరత ఉందన్న సంగతి చిరంజీవి దృష్టికి వెళ్లడంతో త్వరలోనే అంబులెన్స్ సర్వీసులను ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది. అయితే తాజాగా చిరు సేవలపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. సాటి మనిషి ప్రాణాన్ని కాపాడడం మానవత్వానికి సంబంధించిన మహోన్నతమైన సేవ అని…
మెగాస్టార్ చిరంజీవి ఇటీవల కరోనా బాధితులకు అండగా నిలిచిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలోని చాలా జిల్లాల్లో ఇప్పటికే ఆక్సిజన్ బ్యాంక్ సేవలను నెలకొల్పాడు. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్, ఆక్సిజన్ బ్యాంక్ లతో ప్రజలకు అండగా నిలుస్తున్న చిరు.. తాజాగా చిరు మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారని తెలుస్తోంది. వీలైనంత త్వరగా తెలుగు రాష్ట్రాల అంతటా చిరంజీవి అంబులెన్స్ సర్వీస్ లను ప్రారంభించాలని చిరు భావిస్తున్నాడని తెలుస్తోంది. ప్రతి జిల్లాలోనూ ఈ సేవల్ని అందుబాటులోకి తీసుకురానున్నారని…