రెండు పాటలు మినహా ఆచార్య షూటింగ్ పూర్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్స్టార్ రామ్చరణ్ ప్రధాన పాత్రల్లో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సమర్పణలో, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో నిరంజన్ రెడ్డి నిర్మిస్తోన్న భారీ చిత్రం ఆచార్య. ఈ సినిమా టాకీ పార్ట్ అంతా పూర్తయ్యింది. రెండు పాటల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు చిత్ర నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.
ఈ వివరాలను దర్శకుడు కొరటాల శివ తెలియచేస్తూ, ” ‘ఆచార్య’ సినిమా టాకీ పార్ట్ చిత్రీకరణను జూలై 31 నాటికి అనుకున్న ప్లాన్ ప్రకారం పూర్తి చేశాం. రెండు పాటలను మాత్రమే చిత్రీకరించాల్సి ఉంది. ఆగస్ట్ 20 నుంచి చిరంజీవి, చరణ్ మీద ఓ సాంగ్ను, అలాగే చరణ్, పూజా హెగ్డే మీద మరో సాంగ్ను చిత్రీకరిస్తాం. దీంతో సినిమా మొత్తం షూటింగ్ పూర్తవుతుంది. మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. చిరంజీవిగారి పాత్ర చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అలాగే మెగాపవర్స్టార్ రామ్చరణ్ ఇందులో సిద్ధ అనే కీలక పాత్రలో నటిస్తున్నారు” అని అన్నారు.
Also Read
నిర్మాత నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, ”మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రాలను కమర్షియల్ యాంగిల్లో ప్రేక్షకాభిమానులు మెచ్చేలా తెరకెక్కించడంలో దిట్ట అయిన డైరెక్టర్ కొరటాల శివ తనదైన శైలిలో మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాను రూపొందిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి నుండి ఆయన అభిమానులు, ప్రేక్షకులు ఏమేమి కోరుకుంటారో అన్నీ ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉంటాయి. ఇప్పటికే విడుదలైన లాహే లాహే.. సాంగ్, టీజర్కు ఎక్స్ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. సినిమాను అనౌన్స్ చేసినప్పటి నుంచి సినిమాపై హై ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి. ఈ అంచాలను మించేలా సినిమా ఉంటుంది” అని చెప్పారు. అయితే… ‘ఆచార్య’ విడుదల తేదీని మాత్రం దర్శక నిర్మాతలు ఇంకా ఖరారు చేయలేదు.
తాజావార్తలు
-
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ మూడు రాశుల వారికి నేడు పండగే!
-
Tollywood : చేతులు దాటుతున్న సినిమా బడ్జెట్లు.. కుదేలవుతున్న టాలీవుడ్ నిర్మాతలు!
-
Strait of Hormuz Closure: ఇరాన్ తీవ్ర హెచ్చరిక.. హార్మూజ్ గుండా వచ్చే నౌకలపై దాడులకు సిద్ధం.. చమురు సరఫరాకు ముప్పు
-
Peddi : ‘పెద్ది’ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… డిలీటెడ్ సీన్లన్నీ ఇక్కడ చూడొచ్చు
-
Gold ETF Outflows 2026: గోల్డ్ ఈటీఎఫ్లకు గుడ్బై చెబుతున్న ఇన్వెస్టర్లు.. కారణాలివే
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!