ఒలింపిక్ పతాక విజేత పీవీ సింధుకు మెగాస్టార్ చిరంజీవి నివాసంలో ఘనంగా సన్మానం జరిగింది. ఈ వేడుకకు అక్కినేని నాగార్జునతో పాటు రాధిక, సుహాసిని సహా మెగా కుటుంబసభ్యులు, పలువురు సినీ ప్రముఖులు హాజరై సింధును సన్మానించారు. ఈమేరకు చిరంజీవి సోషల్ మీడియా ద్వారా వీడియో షేర్ చేశారు. పీవీ సింధు ఇటీవల ముగిసిన టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యం సాధించింది. వరుసగా రెండు ఒలింపిక్ క్రీడల్లో పతకాలు సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది.…
మెగాస్టార్ చిరంజీవి, మణిశర్మ ది హిట్ కాంబినేషన్. ‘బావగారు బాగున్నారా!’ మొదలు ‘చూడాలని వుంది, అన్నయ్య, ఇంద్ర, ఠాగూర్, జై చిరంజీవ, స్టాలిన్’ వంటి ఎన్నో సినిమాలను సూపర్ హిట్ పాటలతో బంపర్ హిట్ గా మార్చాడు మణిశర్మ. తాజాగా ‘ఆచార్య’తో ఈ ఇద్దరు మరోసారి ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మణిశర్మ కుమారుడు మహతి సాగర్ తొలిసారి చిరంజీవితో పని చేయబోతున్నాడట. ‘వేదాళం’ రీమేక్ గా మెహర్ రమేశ్ తీస్తున్న ‘భోళా శంకర్’…
చిరంజీవి, కె.యస్. రామారావు కాంబినేషన్ అనగానే గతంలో వారిద్దరి కలయికలో వచ్చిన సూపర్ హిట్స్ గుర్తుకు వస్తాయి. ‘అభిలాష, ఛాలెంజ్, రాక్షసుడు, మరణమృదంగం, స్టువార్టుపురం పోలీస్ స్టేషన్’ వంటి సినిమాలు వీరి కలయిలో రూపొందాయి. 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ వీరి కలయికలో సినిమా రాబోతోంది. 1991లో వచ్చిన ‘స్టూవార్ట్ పురం పోలీస్ స్టేషన్’ తర్వాత వస్తున్న సినిమా ఇది. గత కొద్ది సంవత్సరాలుగా చిరంజీవితో సినిమా చేయాలని తాపత్రయపడుతున్న కె.యస్.రామారావు కోరిక నెరవేరనుంది. ఇటీవల కాలంలో…
ఈ నెల 22న మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహోద్యోగులు, అభిమానుల సమక్షంలో పుట్టినరోజు వేడుకను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మెగా ఫ్యామిలీ ఓ వీడియో విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. ఇక ఈ వీడియోలో మెగా ఫ్యామిలీ హీరో అల్లు అర్జున్ లేకపోవడం చాలా మంది దృష్టిని ఆకర్షించింది. దీనిని కూడా సోషల్ మీడియాలో హైలైట్ చేస్తున్నారు. అయితే అల్లు అర్జున్ తండ్రి అల్లు…
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్బంగా నిన్నంత మెగా వేవ్ నడిచింది. ఆయన చేయబోయే ప్రాజెక్ట్ లకు సంబంధించి అధికారిక ప్రకటనలు వచ్చేశాయి. ప్రస్తుతం ‘ఆచార్య’ పూర్తిచేసిన మెగాస్టార్, విడుదల కోసం చూస్తాడు. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా తరువాత చిరు మూడు సినిమాలు చేయనున్నాడు.మోహన్ రాజా డైరెక్షన్ లో ‘గాడ్ఫాదర్’.. బాబీ దర్శకత్వంలో ‘వాల్తేరు వీరయ్య’ (పరిశీలన టైటిల్).. మెహర్ రమేష్తో ‘బోళా శంకర్’ సినిమాలు…
మెగాస్టార్ చిరంజీవికి తెలుగు రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అందులో లో ఆయన ఉంటే ప్రాణమిచ్చే డైహార్డ్ ఫ్యాన్స్ సంఖ్య కూడా ఎక్కువే. నిన్న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు. అయితే మరి కొంత మంది మాత్రం తమ అభిమానాన్ని విభిన్నంగా చాటుకోవడానికి ప్రయత్నం చేశారు. అందులో తమిళనాడుకు చెందిన అభిమానులు చేసిన వినూత్న ప్రయత్నం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు…
తెలుగు చిత్ర పరిశ్రమలో విజయవంతమైన నిర్మాతలలో బండ్ల గణేష్ కూడా ఒకరు. ఆయన ప్రస్తుతం సినిమాల్లో అంత యాక్టివ్ గా లేనప్పటికీ తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. తాజాగా బండ్ల గణేష్ తన కొత్త డిమాండ్ తో మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నారు. ఆదివారం మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి మాట్లాడటానికి అభిమానులు ప్రత్యేక ట్విట్టర్ స్పేస్ సెషన్ను నిర్వహించారు. అందులో దర్శకులు, నటీనటులు మరియు నిర్మాతలతో సహా పలువురు సినీ…
నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్బంగా ఆయన నటించబోయే చిత్రాల సంబందించిన అప్డేట్స్ తో ఫ్యాన్స్ లో జోష్ కనిపిస్తోంది. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడు సినిమాలను చిరు లైన్ లో పెట్టారు. ఇప్పటికే ఆచార్య (చిరు 152) సినిమాను పూర్తి చేసిన చిరు.. విడుదల తేదీ కోసం ఎదురుచూస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా…
మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా ఇవాళ అభిమానులందరికీ ఫుల్ మీల్స్ దక్కినట్టు అయ్యింది. ‘ఆచార్య’ నయా పోస్టర్ రిలీజ్ దగ్గర నుండి రెండు కొత్త సినిమాల టైటిల్ అనౌన్స్ మెంట్ తో పాటు మరో మూవీకి సంబంధించిన పోస్టర్ సైతం విడుదలైపోయింది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ, బాబీ దర్శకత్వంలో తెరకెక్కించబోతున్న ఈ మూవీకి సంబంధించిన విశేషాలను మాత్రం చెప్పి, చెప్పకుండా దాటేశారు. మొదట తెలిపిన టైమ్ కు కేవలం పోస్టర్ ను మాత్రం విడుదల చేశారు.…
”సినిమా రంగానికి చెందిన 24 శాఖల కార్మికులు నివసిస్తున్న చిత్రపురి కాలనీలో హాస్పిటల్ నిర్మించి ఇస్తానని మెగాస్టార్ చిరంజీవి మాటిచ్చారని చిత్రపురి కాలనీ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ తెలిపారు. ఆదివారం చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా చిత్రపురి కాలనీలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మైటీ స్టార్ శ్రీకాంత్ అతిథిగా హాజరయ్యారు. బ్లడ్ డొనేషన్ చేసిన వారికి ప్రోత్సాహక బహుమతులను శ్రీకాంత్ చేతుల మీదుగా కమిటీ సభ్యులు అందజేశారు. ఈ…