ఏజెన్సీ ప్రాంతాల్లో తమ ప్రాబల్యాన్ని చాటుకునేందకు మావోయిస్టులు ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. అయితే గత సోమవారం సాయంత్రం ములుగు జిల్లాలోని కె.కొండాపురం మాజీ సర్పంచ్ కొర్స రమేశ్ ను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. అయితే ఈ విషయంపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు రమేశ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తాజాగా ఛతీస్గఢ్లోని కొత్తపల్లి సమీపంలో రమేశ్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.
తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో రమేశ్ను మావోయిస్టులు హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అంతేకాకుండా రమేశ్ను ప్రజాకోర్టులో శిక్షించినట్లు మావోయిస్టులు లేఖ కూడా అక్కడ దొరికింది. వెంకటాపురం-వాజేడు ఏరియా కమిటీ కార్యదర్శి పేరుతో ఈ లేఖలో పేర్కొన్నారు. పోలీస్ ఇన్ఫార్మర్గా పనిచేస్తున్నందునే రమేశ్ను చంపినట్లు లేఖలో తెలిపారు. దీంతో ఒక్కసారిగా రమేశ్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.