ఇంజినీర్ను కిడ్నాప్ చేసిన మావోయిస్టులు.. అడవికి వెళ్లి విడిపించుకున్న భార్య..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొన్ని సినిమాల్లో చూశాం.. అధికారిగా ఉన్న హీరోను ఉగ్రవాదులు కిడ్నాప్ చేయడం.. అతడిని విడిపించడానికి ప్రభుత్వాలు ప్రయత్నాలు చేసి విఫలం అవ్వడం.. ఇక, నేరుగా భార్యే రంగంలోకి దిగి.. ఉగ్రవాదుల నుంచి తన భర్తను విడిపించుకోవడం.. ఇలాంటి ఘటనే ఒకటి ఇప్పుడు వెలుగు చూసింది.. మావోయిస్టులు కిడ్నాప్ చేసిన తన భర్తను విడిపించడానికి అధికారులు, ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో.. తన కొడుకుతో అడవికి వెళ్లి.. తన భర్తను కాపాడుకుంది ఓ ఇల్లాలు.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ జిల్లా మాంకేలీ సమీపంలోని ఘట్కేర్నీలో రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించేందుకు వెళ్లిన సబ్ ఇంజనీర్ అజయ్రోషన్, అటెండర్ లక్ష్మణ్ను ఈ నెల 11వ తేదీన కిడ్నాప్ చేశారు మావోయిస్టులు.. అయితే, మరుసటి రోజు లక్ష్మణ్ను వదిలిపెట్టినా.. సబ్ ఇంజనీర్ను తమ దగ్గరే పెట్టుకున్నారు.
Read Also: ఏపీలో సముద్ర తీరంలో బంగారం.. ఎగబడుతున్న జనం..!
Also Read
- Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
- Nepal Floods: ఏం ఇళ్లురా ఇది, కట్టిన వాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాల్సిందే.. వరదల్లో చెక్కు చెదరలేదు.. వీడియో వైరల్..
- Karnataka: కర్ణాటక కాంగ్రెస్లో షాక్.. అవినీతి ఆరోపణలు.. కీలక మంత్రి రాజీనామా..
- Ganja Seized: ఒడిశా నుంచి యూపీకి కారులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్..
మరోవైపు ఆ సబ్ ఇంజినీర్ను మావోయిస్టుల చెర నుంచి అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు… దీంతో.. ఆయన భార్యే రంగంలోకి దిగింది.. కొందరు మీడియా ప్రతినిధులతో కలిసి అడవి బాట పట్టింది.. రెండేళ్ల కుమారుడితోపాటు అడవిలో అన్నల వద్ద ఉన్న తన భర్త కొరకు బయల్దేరింది.. ప్రాణాలకు తెగించి భర్త కోసం అడవిని జల్లెడ పట్టింది.. ఈ నెల 13, 14, 15, 16వ తేదీల్లో మీడియా ప్రతినిధులతో కలిసి బైక్పై అటవీ ప్రాంతంలోని ఆదివాసీ గూడేల్లో భర్త కోసం వెతికింది.. రోజుకు 30-40 కిలోమీటర్లు ప్రయాణం సాగించారు.. చివరకు ఐదు రోజులకు మావోయిస్టుల శిబిరానికి చేరుకున్న సబ్ ఇంజినీర్ భార్య అంకిత.. మావోయిస్టులతో చర్చలు జరిపింది.. మీడియా సమక్షంలో జరిగిన ఈ చర్చలు సఫలం అయ్యాయి.. ఇక, ప్రజాకోర్టు నిర్వహించిన మావోయిస్టులు.. అనంతరం సబ్ ఇంజినీర్ అజయ్ను విడిచిపెట్టారు.. తన భర్త ప్రాణాలకు హాని తలపెట్టకుండా విడిచిపెట్టినందుకు మావోయిస్టులకు కృతజ్ఞతలు తెలిపింది అంకిత.. మావోయిస్టులతో చర్చలు జరపడంలో.. స్థానిక మీడియా ప్రతినిధులతో పాటు స్థానికులు కూడా కీలక పాత్ర పోషించారని చెబుతున్నారు. ఇక, తన భర్తను చూసి తీవ్ర ఉద్వేగానికి లోనై.. ఆయన కౌగిట్లో ఒదిగిపోయింది అంకిత.. అయితే, వారం రోజులుగా మావోయిస్టుల చెరలో ఉన్న అజయ్ రోషన్ అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తరలించారు.. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!