Maharashtra Election Results: మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి సునామీ సృష్టిస్తోంది. మహారాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఫలితాలు సాధిస్తోంది. మొత్తం 288 స్థానాల్లో బీజేపీ నేతృత్వంలోని ఏక్నాథ్ షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీల ‘‘మహాయుతి’’ కూటమి ఏకంగా 218 స్థానాల్లో లీడింగ్లో ఉంది. సొంతగా బీజేపీ 124 స్థానాల్లో, షిండే సేన 55 స్థానాలు, అజిత్ పవార్ 34 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ(ఎంవీఏ) కేవలం 58 స్థానాల్లో…
Election Results: మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శిస్తుండగా, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు మాత్రం హోరాహోరీని తలపిస్తున్నాయి. క్షణక్షణానికి ఆధిక్యం చేతులు మారుతోంది. జార్ఖండ్లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి, మ్యాజిక్ ఫిగర్ 41. అయితే, బీజేపీ కూటమి, జేఎంఎం+ కాంగ్రెస్ కూటమి మధ్య లీడ్ మారుతోంది.
Election Results: మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతోంది. ఈ రోజు మొదలైన కౌంటింగ్ ప్రక్రియలో ఇరు రాష్ట్రాల్లో కూడా బీజేపీ ఆధిక్యత ప్రదర్శిస్తోంది. ఎర్లీ ట్రెండ్స్ నుంచి బీజేపీ కూటమి రెండు రాష్ట్రాల్లోనూ లీడింగ్లో ఉంది. తాజాగా ఆధిక్యంలో బీజేపీ కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటింది. మహారాష్ట్రలో స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తున్నప్పటికీ.. జార్ఖండ్లో ఆధిక్యం బీజేపీ, కాంగ్రెస్ కూటముల మధ్య చేతులు మారుతోంది. Read Also: Virender Sehwag: ఆర్యవీర్.. తృటిలో ఫెరీరా కారు…
Election Results: మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. రెండు రాష్ట్రాల్లో ఎర్లీ ట్రెండ్స్లో బీజేపీ కూటమి దూసుకుపోతోంది. బీజేపీతో పాటు దాని మిత్రపక్షాలు సీట్ల సంఖ్య ప్రత్యర్థి పార్టీల కన్నా ఎక్కువగా ఉంది.
BJP: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో వివాదాస్పద ఫత్వా జారీ చేసిన ఇస్లామిక్ మత నాయకుడు మౌలానా సజ్జాద్ నోమానీపై బీజేపీ మైనారిటీ మోర్చా అధ్యక్షుడు జమాల్ సిద్ధిఖీ ఢిల్లీలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్-ఉద్ధవ్ ఠాక్రే-శరద్ పవార్ కూటమికి ఓటేయాలని రాష్ట్రంలో ముస్లింలకు పిలుపునివ్వడంపై వీడియో వైరల్గా మారింది. మహారాష్ట్రలో బీజేపీ ఓటమి కేంద్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచగలదని తాను నమ్ముతున్నానని నోమని అన్నారు. ఈ వీడియోపై మహారాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ, కాంగ్రెస్ మరియు దాని మిత్రపక్షాలు…
Election Results: మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాల కోసం దేశం ఎదురుచూస్తోంది. ఈ రోజు ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. లోక్సభ, హర్యానా ఎన్నికల తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
Maharashtra: శనివారంతో మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసేది ఏ పార్టీనో స్పష్టత రానుంది. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలకు ముందు ఆ రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. బీజేపీకి చెందిన కీలక నేత ఉద్ధవ్ ఠాక్రే శివసేనలో చేరారు.
Maharashtra Elections: మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటర్లు చరిత్ర సృష్టించారు. బుధవారం జరిగిన పోలింగ్లో ఏకంగా 65.1 శాతం ఓటింగ్ శాతం నమోదైంది. 1995 ఎన్నికల్లో 71.5 శాతం నమోదైంది. ఆ తర్వాత ఇప్పుడే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక ఓటింగ్ శాతం నమోదైంది. దశాబ్ధం తర్వాత ఇంతలా ఓటింగ్ శాతం పెరగడం ఇదే తొలిసారి. Read Also: President Droupadi Murmu: కోటి దీపోత్సవంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది: రాష్ట్రపతి 2004, 2014 ఎన్నికల్లో 63.4…
మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు బుధవారం ఓటింగ్ జరగగా, బీడ్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బీడు అసెంబ్లీ స్థానంలో ఓటింగ్ సందర్భంగా ఓ స్వతంత్ర అభ్యర్థి గుండెపోటుతో మృతి చెందారు.
Bitcoin Scam: మహారాష్ట్ర ఎన్నికల సమయంలో ‘‘బిట్కాయిన్ స్కాం’’ సంచలనంగా మారింది. ఎన్సీపీ ఎంపీ, శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే, మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలేపై రిటైర్డ్ ఐపీపీఎస్ అధికారి సంచలన ఆరోపణలు చేశారు. ఈ స్కాంలో ఆడిటింగ్ సంస్థకు చెందిన ఉద్యోగికి సీబీఐ సమన్లు జారీ చేసింది.