Maharashtra: ఇంకా తేలని మహారాష్ట్ర సీఎం.. హోం మినిస్ట్రీ పైనే శివసేన పంచాయతీ..
- మహారాష్ట్ర సీఎం పదవిపై వీడని సస్పెన్స్..
- సీఎంతో సహా హోంశాఖని కోరుతున్న బీజేపీ..
- తమకు హోం మినిస్ట్రీ ఇవ్వాలంటున్న శివసేన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra: మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వచ్చి వారం గడిచింది. బీజేపీ నేతృత్వంలోని ఏక్ నాథ్ షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీల ‘‘మహాయుతి’’ కూటమి ఘన విజయం సాధించింది. 288 అసెంబ్లీ స్థానాల్లో 233 సీట్లను కైవసం చేసుకుంది. బీజేపీ ఒంటరిగా 132 స్థానాలు సాధించి, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. అయితే, మహాయుతి గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి ఎవరనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
ముఖ్యమంత్రి విషయంలో మహారాజకీయాల్లో చర్చోపచర్చలు నడుస్తున్నాయి. కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో రెండు రోజుల క్రితం షిండే, ఫడ్నవీస్, అజిత్ పవార్ భేటీ అయ్యారు. దీని తర్వాత ఏదైనా ప్రకటన వస్తుందని ఊహించినప్పటికీ అలాటిదేం జరగలేదు. ఏక్నాథ్ షిండే సీఎం పదవి గట్టిగా కోరుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు దేవేంద్ర ఫడ్నవీస్కి సీఎం పోస్ట్ ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది.
Also Read
- Twisha Sharma: తెలుగు నటి మృతి కేసులో బాధిత కుటుంబానికి కోర్టు షాక్.. నెక్ట్స్ ఏంటి?
- Mamata Banerjee: మమత పార్టీలో విభేదాలు.. నిరసనకు 35 మంది ఎమ్మెల్యేలే హాజరు..
- Modi-Meloni: గంటల్లోనే కోట్లలో వ్యూస్.. ఇంటర్నెట్లో ప్రకంపనలు రేపుతున్న మెలోడీ వీడియో
- Suryastra Rocket: శత్రువులకు హెచ్చరికగా.. స్వదేశీ ‘సూర్యాస్త్ర’ రాకెట్ సక్సెస్.. పెరిగిన డిఫెన్స్ పవర్
Read Also: Real Estate: హైదరాబాద్లో వరుసగా మూతపడుతున్న రియల్ ఎస్టేట్ సంస్థలు
ఇదిలా ఉంటే, బీజేపీ సీఎం పోస్టుతో పాటు హోం మినిస్ట్రీ కూడా తన వద్దే ఉంచుకోవాలని భావిస్తోంది. ఇప్పుడు ఇదే బీజేపీ-శివసేన మధ్య పంచాయతీకి దారి తీసింది. శివసేన నేత సంజయ్ శిర్సత్, కొత్త ప్రభుత్వంలో తమ పార్టీ హోంశాఖ కావాలని కోరాడు. “హోం శాఖ పార్టీ (శివసేన) వద్ద ఉండాలి. ఈ శాఖకు సాధారణంగా ఉప ముఖ్యమంత్రి నేతృత్వం వహిస్తారు, అయితే ముఖ్యమంత్రి దానిని కూడా నిర్వహించడం సరికాదు” అని ఔరంగాబాద్ పశ్చిమ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న శిర్సత్ అన్నారు. మరాఠా కోటా ఉద్యమాన్ని షిండే పరిష్కరించాలని ఆయన చెప్పారు. లడ్కీ బహిన్ పథకాన్ని, ఇతర సంక్షేమ చర్యల్ని ఆయన హైలెట్ చేశారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో 288 స్థానాలకు గాను 230 సీట్లని మహాయుతి గెలుచుకుంది. బీజేపీ 132 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించగా, 57 స్థానాలను శివసేన గెలుచుకుంది, ఎన్సీపీ 41 స్థానాల్లో విజయం సాధించింది.
తాజావార్తలు
-
Twisha Sharma: తెలుగు నటి మృతి కేసులో బాధిత కుటుంబానికి కోర్టు షాక్.. నెక్ట్స్ ఏంటి?
-
KKR Vs MI: ఈడెన్ గార్డెన్స్లో హైవోల్టేజ్ పోరు: టాస్ గెలిచిన కేకేఆర్.. ముంబై బ్యాటింగ్..
-
iQOO 15T: ఐకూ 15T విడుదల.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్
-
RBI: ఈఎంఐ కట్టలేదని ఫోన్ బ్లాక్ చేస్తున్నారా..? బ్యాంకులకు ఆర్బీఐ వార్నింగ్.. ఇకపై అలా చేస్తే కుదరదు..
-
TGPSC : నిరుద్యోగులకు డబుల్ బెనిఫిట్.. వయోపరిమితి పెంపు.. తెలుగులో ఎగ్జామ్..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!