Maharashtra: ఇంకా తేలని మహారాష్ట్ర సీఎం.. హోం మినిస్ట్రీ పైనే శివసేన పంచాయతీ..
- మహారాష్ట్ర సీఎం పదవిపై వీడని సస్పెన్స్..
- సీఎంతో సహా హోంశాఖని కోరుతున్న బీజేపీ..
- తమకు హోం మినిస్ట్రీ ఇవ్వాలంటున్న శివసేన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra: మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వచ్చి వారం గడిచింది. బీజేపీ నేతృత్వంలోని ఏక్ నాథ్ షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీల ‘‘మహాయుతి’’ కూటమి ఘన విజయం సాధించింది. 288 అసెంబ్లీ స్థానాల్లో 233 సీట్లను కైవసం చేసుకుంది. బీజేపీ ఒంటరిగా 132 స్థానాలు సాధించి, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. అయితే, మహాయుతి గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి ఎవరనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
ముఖ్యమంత్రి విషయంలో మహారాజకీయాల్లో చర్చోపచర్చలు నడుస్తున్నాయి. కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో రెండు రోజుల క్రితం షిండే, ఫడ్నవీస్, అజిత్ పవార్ భేటీ అయ్యారు. దీని తర్వాత ఏదైనా ప్రకటన వస్తుందని ఊహించినప్పటికీ అలాటిదేం జరగలేదు. ఏక్నాథ్ షిండే సీఎం పదవి గట్టిగా కోరుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు దేవేంద్ర ఫడ్నవీస్కి సీఎం పోస్ట్ ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది.
Also Read
Read Also: Real Estate: హైదరాబాద్లో వరుసగా మూతపడుతున్న రియల్ ఎస్టేట్ సంస్థలు
ఇదిలా ఉంటే, బీజేపీ సీఎం పోస్టుతో పాటు హోం మినిస్ట్రీ కూడా తన వద్దే ఉంచుకోవాలని భావిస్తోంది. ఇప్పుడు ఇదే బీజేపీ-శివసేన మధ్య పంచాయతీకి దారి తీసింది. శివసేన నేత సంజయ్ శిర్సత్, కొత్త ప్రభుత్వంలో తమ పార్టీ హోంశాఖ కావాలని కోరాడు. “హోం శాఖ పార్టీ (శివసేన) వద్ద ఉండాలి. ఈ శాఖకు సాధారణంగా ఉప ముఖ్యమంత్రి నేతృత్వం వహిస్తారు, అయితే ముఖ్యమంత్రి దానిని కూడా నిర్వహించడం సరికాదు” అని ఔరంగాబాద్ పశ్చిమ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న శిర్సత్ అన్నారు. మరాఠా కోటా ఉద్యమాన్ని షిండే పరిష్కరించాలని ఆయన చెప్పారు. లడ్కీ బహిన్ పథకాన్ని, ఇతర సంక్షేమ చర్యల్ని ఆయన హైలెట్ చేశారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో 288 స్థానాలకు గాను 230 సీట్లని మహాయుతి గెలుచుకుంది. బీజేపీ 132 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించగా, 57 స్థానాలను శివసేన గెలుచుకుంది, ఎన్సీపీ 41 స్థానాల్లో విజయం సాధించింది.
తాజావార్తలు
-
WhatsApp: మెటాకు కేంద్రం షాక్.. కొత్త ఫీచర్ నిలిపివేయాలని ఆదేశం
-
Blood Sugar Test Timing: తిన్న ఎంతసేపటి తర్వాత షుగర్ చెక్ చేయాలి? చాలామంది చేసే పెద్ద తప్పు ఇదే!
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Sanae Takaichi: ఢిల్లీ చేరుకున్న జపాన్ ప్రధాని సనే తకైచి.. 3 రోజులు పర్యటన
-
Trump: ఇరాన్తో చర్చలు బాగున్నాయి.. ఖతార్ భేటీపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!