Maharashtra: ఇంకా తేలని మహారాష్ట్ర సీఎం.. హోం మినిస్ట్రీ పైనే శివసేన పంచాయతీ..
- మహారాష్ట్ర సీఎం పదవిపై వీడని సస్పెన్స్..
- సీఎంతో సహా హోంశాఖని కోరుతున్న బీజేపీ..
- తమకు హోం మినిస్ట్రీ ఇవ్వాలంటున్న శివసేన..
Maharashtra: మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వచ్చి వారం గడిచింది. బీజేపీ నేతృత్వంలోని ఏక్ నాథ్ షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీల ‘‘మహాయుతి’’ కూటమి ఘన విజయం సాధించింది. 288 అసెంబ్లీ స్థానాల్లో 233 సీట్లను కైవసం చేసుకుంది. బీజేపీ ఒంటరిగా 132 స్థానాలు సాధించి, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. అయితే, మహాయుతి గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి ఎవరనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
ముఖ్యమంత్రి విషయంలో మహారాజకీయాల్లో చర్చోపచర్చలు నడుస్తున్నాయి. కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో రెండు రోజుల క్రితం షిండే, ఫడ్నవీస్, అజిత్ పవార్ భేటీ అయ్యారు. దీని తర్వాత ఏదైనా ప్రకటన వస్తుందని ఊహించినప్పటికీ అలాటిదేం జరగలేదు. ఏక్నాథ్ షిండే సీఎం పదవి గట్టిగా కోరుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు దేవేంద్ర ఫడ్నవీస్కి సీఎం పోస్ట్ ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది.
Also Read
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం కీలక ప్రకటన..
- Honeymoon murder: హనీమూన్ మర్డర్ కేసులో సోనమ్ రఘువంశీకి బెయిల్..
- Gujarat Local Body Elections: గోధ్రాలో సంచలనం.. ముస్లిం మెజారిటీ ఏరియాలో గెలిచిన హిందూ మహిళ..
- Aadhaar Card: మీకు ఇది తెలుసా? మీ ఆధార్ కార్డు మీ పుట్టిన తేదీకి గ్యారెంటీ కాదట! ఎందుకో తెలుసా..
Read Also: Real Estate: హైదరాబాద్లో వరుసగా మూతపడుతున్న రియల్ ఎస్టేట్ సంస్థలు
ఇదిలా ఉంటే, బీజేపీ సీఎం పోస్టుతో పాటు హోం మినిస్ట్రీ కూడా తన వద్దే ఉంచుకోవాలని భావిస్తోంది. ఇప్పుడు ఇదే బీజేపీ-శివసేన మధ్య పంచాయతీకి దారి తీసింది. శివసేన నేత సంజయ్ శిర్సత్, కొత్త ప్రభుత్వంలో తమ పార్టీ హోంశాఖ కావాలని కోరాడు. “హోం శాఖ పార్టీ (శివసేన) వద్ద ఉండాలి. ఈ శాఖకు సాధారణంగా ఉప ముఖ్యమంత్రి నేతృత్వం వహిస్తారు, అయితే ముఖ్యమంత్రి దానిని కూడా నిర్వహించడం సరికాదు” అని ఔరంగాబాద్ పశ్చిమ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న శిర్సత్ అన్నారు. మరాఠా కోటా ఉద్యమాన్ని షిండే పరిష్కరించాలని ఆయన చెప్పారు. లడ్కీ బహిన్ పథకాన్ని, ఇతర సంక్షేమ చర్యల్ని ఆయన హైలెట్ చేశారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో 288 స్థానాలకు గాను 230 సీట్లని మహాయుతి గెలుచుకుంది. బీజేపీ 132 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించగా, 57 స్థానాలను శివసేన గెలుచుకుంది, ఎన్సీపీ 41 స్థానాల్లో విజయం సాధించింది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
-
UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..
-
Afghanistan: తాలిబన్లకు దొరికిన వేల కోట్ల నిధి.. భారత్కు అత్యంత తక్కువ ధరకే ఆయిల్ సప్లై చేసే ఛాన్స్!
-
Food poisoning: బిర్యానీ, వాటర్మిలన్ కలిపి తింటే ప్రమాదమా..? శరీరంలో ఏం జరుగుతుంది?
-
Dhanush: రామ్ చరణ్ కాదంట.. ధనుష్తో భన్సాలీ సినిమా! అసలు కథ ఇదే..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో