Maharashtra: మహరాష్ట్ర కొత్త సీఎం ఎంపికపై కొనసాగుతున్న ఉత్కంఠ..
- మహారాష్ట్ర కొత్త సీఎం ఎంపికపై కొనసాగుతున్న ఉత్కంఠ..
- నేటితో ముగియనున్న ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం గడువు..
- ముఖ్యమంత్రి రేస్ నుంచి ఏక్ నాథ్ షిండే తప్పుకున్నట్లు ప్రచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra: మహారాష్ట్రలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి ఈరోజు (మంగళవారం)తో గడువు ముగియనుంది. కాబట్టి కొత్త సర్కార్ ఏర్పాటుకు మహయుతి కూటమి ప్లాన్ చేస్తుంది. ఈ సమయంలో సీఎం పదవిపై కూటమిలో వాదనలు, ప్రతివాదనలు స్టార్ట్ అయ్యాయి. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ కోసం పట్టుబడుతుండగా.. ఇంకోవైపు ఏక్ నాథ్ షిండేను మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని శివసేన (షిండే) వర్గం డిమాండ్ చేస్తోంది. సీఎం పదవికి సంబంధించి ఢిల్లీలోనే నిర్ణయం తీసుకుంటారని మొదట చర్చ కొనసాగింది. ఈ పరిణామాలన్నింటిలో డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ సోమవారం సాయంత్రం హస్తినకు వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి ముంబైకి వచ్చేశారు. అయితే, ఢిల్లీ వెళ్లిన ఫడ్నవీస్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవకుండానే వచ్చేశారనే చర్చ కొనసాగుతుంది.
Read Also: Gold Price Today: ఇది కదా కావాల్సింది.. తులం బంగారంపై రూ.1310 తగ్గింది!
Also Read
- Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్పోర్టు మసీదు తరలింపు.!
- iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
- Raghav Chadha: రాఘవ్ చద్దాకు కీలక పదవి.. ప్రత్యేక బాధ్యతలు అప్పగించిన రాజ్యసభ ఛైర్మన్
- Sonam Wangchuk: "నేపాల్లో జరిగినట్లే భారత్లో కూడా".. ‘కాక్రోచ్’ ఉద్యమంపై సోనం వాంగ్చుక్ హెచ్చరిక
కాగా, మహరాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు ఎన్డీయే కూటమికి కత్తి మీద సాములా మారింది. మూడు పార్టీల కలయికతో విజయం సాధించిన మహయుతి కూటమిలో ఎవర్ని ముఖ్యమంత్రిని చేయాలని సందిగ్ధం ఇంకా కొనసాగుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అద్భుత ప్రదర్శన చేసింది. దేవేంద్ర ఫడ్నవీస్ నాయకత్వంలో అతి తక్కువ సమయంలో భారీ విజయం సాధించింది. రాష్ట్రంలో బీజేపీ ఇప్పటి వరకు కనీవినీ ఎరుగని రీతిలో 132 స్థానాల్లో గెలుచింది.
Read Also: Occult Worship: మంథని హాస్టల్లో దారుణం.. లక్ష్మీదేవి కటాక్షం పేరుతో విద్యార్థులతో నగ్న పూజలు..!
అయితే, మహాయుతి ముఖ్యమంత్రి పదవిపై ఢిల్లీలోనే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పలువురు హస్తినపై దృష్టి సారించారు. తాజాగా, సీఎం రేసు నుంచి ఏక్ నాథ్ షిండే తప్పుకున్నట్లు సమాచారం. తనకు మద్దతుగా ముంబైకి ఎవరు రావొద్దు.. సమావేశాలు పెట్టొద్దని ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. దీంతో ఆయన ముఖ్యమంత్రి రేస్ నుంచి తప్పుకున్నారనడానికి నిదర్శనమన్న ప్రచారం కొనసాగుతుంది. త్వరలోనే మహారాష్ట్రలో కొత్త సర్కార్ ఏర్పడుతుంది.. రాష్ట్ర అభివృద్ధి కోసం మహాయుతి కూటమి పని చేస్తుందని షిండే పేర్కొన్నారు.
महायुतीच्या प्रचंड विजयानंतर राज्यात पुन्हा एकदा आपले सरकार स्थापन होणार आहे. महायुती म्हणून आपण एकत्रित निवडणूक लढवली आणि आजही एकत्रच आहोत. माझ्यावरील प्रेमापोटी काही मंडळींनी सर्वांना एकत्र जमण्याचे, मुंबईत येण्याचे आवाहन केले आहे. तुमच्या या प्रेमासाठी मी अत्यंत मनापासून ऋणी…
— Eknath Shinde – एकनाथ शिंदे (@mieknathshinde) November 25, 2024
తాజావార్తలు
-
Rahman : ‘పెద్ది’ ఆ కోరిక తీర్చింది!
-
Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
-
AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
-
OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?