Bus Accident: రోడ్డుపై గింగిరాలు తిరిగిన బస్సు.. 9 మంది మృతి
- మహారాష్ట్రలోని గోండియా - కొహ్మారా మధ్యలోని రహదారిపై
- రోడ్డుపై గింగిరాలు తిరిగిన బస్సు..
- 9 మంది మృతి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bus Accident: మహారాష్ట్రలోని గోండియా – కొహ్మారా మధ్యలోని రహదారిపై ఖజ్రీ గ్రామ సమీపంలో ఈ బస్సు ప్రమాదం జరిగింది. ఈ బస్సు ప్రమాదంలో 9 మంది మృతి చెందినట్లు నిర్ధారించారు అధికారులు. అయితే ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. అందిన సమాచారం మేరకు భండారా నుంచి సకోలి లఖానీ మీదుగా గోండియా వైపు వెళ్తున్న శివషాహి బస్సుకు అకస్మాత్తుగా బైక్ ఎదురుగా వచ్చింది. బైక్ రైడర్ ను కాపాడే ప్రయత్నంలో బస్సు డ్రైవర్ బస్సును తీవ్రంగా కట్ చేయడంతో బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డుపై బోల్తా గింగిరాలు తిరిగింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో ప్రస్తుతానికి 9 మంది ప్రయాణికులు మృతి చెందగా, పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.
Also read: Vikatakavi: వెబ్ సిరీస్కు వర్క్ చేయటం ఓ డిఫరెంట్ ఎక్స్పీరియెన్స్ : జోశ్యుల గాయత్రి
Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
ప్రమాద స్థలంలో ఉన్న ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. బస్సు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడని తెలిపారు. ఈ ఘటనపై బాటసారులు పోలీసులకు, అంబులెన్స్కు సమాచారం అందించారు. దీంతో పోలీసులు, అంబులెన్స్ విభాగాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఇక బస్సు ప్రమాదం జరిగిన వెంటనే ఆ ప్రాంతంలో గందరగోళం నెలకొంది. చుట్టుపక్కల వారు ఘటనా స్థలానికి చేరుకుని అనేకమంది క్షతగాత్రులను రక్షించారు. బస్సు బోల్తా పడిన తర్వాత క్షతగాత్రులను, ఇతర వ్యక్తులను తరలించే పనులు ప్రారంభించారు. ఇక ఘటనలో గాయపడిన వారిని చికిత్స కోసం గోండియా జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం తర్వాత శివషాహి బస్సును క్రేన్ సాయంతో పైకి లేపారు. ఇక ఈ ఘటనపై రాష్ట్ర తాత్కాలిక డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. ప్రమాద ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని అడ్మినిస్ట్రేటివ్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను సమన్వయం చేస్తున్నారు.
#WATCH | Gondia, Maharashtra | A State transport bus met with an accident after it lost control and overturned near Bindravana Tola village in the Gondia district. So far, 7 people have died. Around 30 people are injured and the injured have been shifted to Gondia District… pic.twitter.com/WZ8mrrv70D
— ANI (@ANI) November 29, 2024
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?