Bus Accident: రోడ్డుపై గింగిరాలు తిరిగిన బస్సు.. 9 మంది మృతి
- మహారాష్ట్రలోని గోండియా - కొహ్మారా మధ్యలోని రహదారిపై
- రోడ్డుపై గింగిరాలు తిరిగిన బస్సు..
- 9 మంది మృతి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bus Accident: మహారాష్ట్రలోని గోండియా – కొహ్మారా మధ్యలోని రహదారిపై ఖజ్రీ గ్రామ సమీపంలో ఈ బస్సు ప్రమాదం జరిగింది. ఈ బస్సు ప్రమాదంలో 9 మంది మృతి చెందినట్లు నిర్ధారించారు అధికారులు. అయితే ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. అందిన సమాచారం మేరకు భండారా నుంచి సకోలి లఖానీ మీదుగా గోండియా వైపు వెళ్తున్న శివషాహి బస్సుకు అకస్మాత్తుగా బైక్ ఎదురుగా వచ్చింది. బైక్ రైడర్ ను కాపాడే ప్రయత్నంలో బస్సు డ్రైవర్ బస్సును తీవ్రంగా కట్ చేయడంతో బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డుపై బోల్తా గింగిరాలు తిరిగింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో ప్రస్తుతానికి 9 మంది ప్రయాణికులు మృతి చెందగా, పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.
Also read: Vikatakavi: వెబ్ సిరీస్కు వర్క్ చేయటం ఓ డిఫరెంట్ ఎక్స్పీరియెన్స్ : జోశ్యుల గాయత్రి
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
ప్రమాద స్థలంలో ఉన్న ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. బస్సు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడని తెలిపారు. ఈ ఘటనపై బాటసారులు పోలీసులకు, అంబులెన్స్కు సమాచారం అందించారు. దీంతో పోలీసులు, అంబులెన్స్ విభాగాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఇక బస్సు ప్రమాదం జరిగిన వెంటనే ఆ ప్రాంతంలో గందరగోళం నెలకొంది. చుట్టుపక్కల వారు ఘటనా స్థలానికి చేరుకుని అనేకమంది క్షతగాత్రులను రక్షించారు. బస్సు బోల్తా పడిన తర్వాత క్షతగాత్రులను, ఇతర వ్యక్తులను తరలించే పనులు ప్రారంభించారు. ఇక ఘటనలో గాయపడిన వారిని చికిత్స కోసం గోండియా జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం తర్వాత శివషాహి బస్సును క్రేన్ సాయంతో పైకి లేపారు. ఇక ఈ ఘటనపై రాష్ట్ర తాత్కాలిక డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. ప్రమాద ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని అడ్మినిస్ట్రేటివ్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను సమన్వయం చేస్తున్నారు.
#WATCH | Gondia, Maharashtra | A State transport bus met with an accident after it lost control and overturned near Bindravana Tola village in the Gondia district. So far, 7 people have died. Around 30 people are injured and the injured have been shifted to Gondia District… pic.twitter.com/WZ8mrrv70D
— ANI (@ANI) November 29, 2024
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!