Bus Accident: రోడ్డుపై గింగిరాలు తిరిగిన బస్సు.. 9 మంది మృతి
- మహారాష్ట్రలోని గోండియా - కొహ్మారా మధ్యలోని రహదారిపై
- రోడ్డుపై గింగిరాలు తిరిగిన బస్సు..
- 9 మంది మృతి.
Bus Accident: మహారాష్ట్రలోని గోండియా – కొహ్మారా మధ్యలోని రహదారిపై ఖజ్రీ గ్రామ సమీపంలో ఈ బస్సు ప్రమాదం జరిగింది. ఈ బస్సు ప్రమాదంలో 9 మంది మృతి చెందినట్లు నిర్ధారించారు అధికారులు. అయితే ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. అందిన సమాచారం మేరకు భండారా నుంచి సకోలి లఖానీ మీదుగా గోండియా వైపు వెళ్తున్న శివషాహి బస్సుకు అకస్మాత్తుగా బైక్ ఎదురుగా వచ్చింది. బైక్ రైడర్ ను కాపాడే ప్రయత్నంలో బస్సు డ్రైవర్ బస్సును తీవ్రంగా కట్ చేయడంతో బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డుపై బోల్తా గింగిరాలు తిరిగింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో ప్రస్తుతానికి 9 మంది ప్రయాణికులు మృతి చెందగా, పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.
Also read: Vikatakavi: వెబ్ సిరీస్కు వర్క్ చేయటం ఓ డిఫరెంట్ ఎక్స్పీరియెన్స్ : జోశ్యుల గాయత్రి
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
ప్రమాద స్థలంలో ఉన్న ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. బస్సు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడని తెలిపారు. ఈ ఘటనపై బాటసారులు పోలీసులకు, అంబులెన్స్కు సమాచారం అందించారు. దీంతో పోలీసులు, అంబులెన్స్ విభాగాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఇక బస్సు ప్రమాదం జరిగిన వెంటనే ఆ ప్రాంతంలో గందరగోళం నెలకొంది. చుట్టుపక్కల వారు ఘటనా స్థలానికి చేరుకుని అనేకమంది క్షతగాత్రులను రక్షించారు. బస్సు బోల్తా పడిన తర్వాత క్షతగాత్రులను, ఇతర వ్యక్తులను తరలించే పనులు ప్రారంభించారు. ఇక ఘటనలో గాయపడిన వారిని చికిత్స కోసం గోండియా జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం తర్వాత శివషాహి బస్సును క్రేన్ సాయంతో పైకి లేపారు. ఇక ఈ ఘటనపై రాష్ట్ర తాత్కాలిక డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. ప్రమాద ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని అడ్మినిస్ట్రేటివ్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను సమన్వయం చేస్తున్నారు.
#WATCH | Gondia, Maharashtra | A State transport bus met with an accident after it lost control and overturned near Bindravana Tola village in the Gondia district. So far, 7 people have died. Around 30 people are injured and the injured have been shifted to Gondia District… pic.twitter.com/WZ8mrrv70D
— ANI (@ANI) November 29, 2024
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!