మధ్యప్రదేశ్లోని జబల్పూర్లోని ప్రభుత్వ యూనివర్సిటీ క్యాంపస్పై ముసుగు ధరించిన వ్యక్తి రెండు ముడి బాంబులు విసిరాడు. ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది.
Notice to God : ప్రభుత్వ భూములను కబ్జా చేసి నివాసాలు ఏర్పరుచుకోవడం నేరం. అలాంటి స్థలాల నుండి ప్రజలను ఎప్పుడైనా ఖాళీ చేయించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది.
మధ్యప్రదేశ్ లో శివపురి జిల్లాలో ఆరేళ్ల బాలికపై దారుణంగా అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన శుక్రవారం రాత్రి కరేరా పోలీస్ స్టేషన్ పరిధిలోని బడోరా గ్రామంలో చోటు చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. బాలిక తల్లి గుడిలో జరుగుతున్న ఓ కార్యక్రమానికి తీసుకెళ్లింది. అయితే ఆ సమయంలో బాలిక, తల్లి నుంచి విడిపోయింది. బాలిక ఇంటికి వెళ్లి ఉంటుందని తల్లి భావించింది.
దక్షిణాఫ్రికా నుండి 12 చిరుతలతో కూడిన రెండో బ్యాచ్ ఫిబ్రవరి 18న మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్కి చేరుకుంటుందని సీనియర్ అటవీ అధికారి శనివారం తెలిపారు.
మధ్యప్రదేశ్లో నేషనల్ హెల్త్ మిషన్ కింద కాంట్రాక్ట్ నర్సుల నియామకం కోసం నిర్వహిస్తోన్న పరీక్షలో ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు గుర్తించడంతో రద్దు చేయబడింది.
Love Failure Incident: ఇటీవల ప్రేమ వ్యవహారాలు హత్యలు, ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయి. ప్రేమ పేరుతో మోసపోయిన యువతీ యువకులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి, వాడుకుని మోసం చేసి వేరే వారిని వివాహం చేసుకుంటున్న సంఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. ఇదిలా ఉంటే ప్రేమ పేరుతో మోసపోయిన ఓ యువతి మత్తు మందును ఇంజెక్షన్ చేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇండోర్ నగరంలో చోటు చేసుకుంది.
Madhya Pradesh: మధ్యప్రదేశ్లోని ఖర్గోన్ జిల్లాలో దారుణం చోటుచేసుకున్నది. ఓ వృద్ధురాలిని ముగ్గురు వ్యక్తులు తాళ్లతో కట్టేసి కొట్టారు. ఆమెను కులం పేరుతో దూషించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వృద్ధురాలిని కొట్టిన ఘటనపై ఖర్గోన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఓ వృద్ధురాలిని చేతులు కట్టేసి ముగ్గురు వ్యక్తులు ఆమెపై విచక్షణా రహితంగా దాడికిపాల్పడ్డారు. హీరాపూర్కు చెందిన గిరిజన మహిళకు ఓ కుమారుడు ఉన్నాడు. అతడు పొట్టకూటికోసం…
MP govt renames Bhopal's Islam Nagar village as Jagdishpur: ఇటీవల కాలంలో పలు ప్రాంతాల పేర్లను మార్చి కొత్త పేర్లను పెట్టడం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పలు పట్టణాల పేర్లను మార్చివేడయం చూశాం. యోగీ సర్కార్ ఉత్తర ప్రదేశ్ లో కొలువుదీరిన తర్వాత అలహాబాద్ ను ప్రయాగ్ రాజ్ గా, ఫైజాబాద్ జిల్లాను అయోధ్య జిల్లాగా, ముస్తాఫాబాద్ ను రాంపూర్ గా, ఫిరోజాబాద్ ను చంద్రానగర్ గా, మొగల్ సరాయ్…
Huge Fire : మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో ఎగ్జిబిషన్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గ్వాలియర్ ఫెయిర్ పేరుతో జరుగుతున్న వ్యాపార మేళాలో వరుసగా ఉన్న పదుల సంఖ్యలోని దుకాణాలన్నీ అగ్నికి ఆహుతయ్యాయి.