Paper Leak: స్టాఫ్నర్సుల రిక్రూట్మెంట్ ప్రశ్నాపత్రం లీక్.. పరీక్ష రద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nurse Recruitment Exam Paper Leak: మధ్యప్రదేశ్లో నేషనల్ హెల్త్ మిషన్ కింద కాంట్రాక్ట్ నర్సుల నియామకం కోసం నిర్వహిస్తోన్న పరీక్షలో ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు గుర్తించడంతో రద్దు చేయబడింది. ప్రశ్నాపత్రం కాపీలను తీసుకెళ్తున్న ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నర్సుల నియామకం కోసం రెండు భాగాలుగా పరీక్షను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. రెండో రౌండ్లు పరీక్షను నిర్వహిస్తుండగా.. పేపర్ లీక్ అయినట్లు తేలడంతో పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది పెద్ద రాకెట్లో భాగమేనని పోలీసులు అనుమానిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పరీక్ష నిర్వహించే పనిలో ఉన్న కంపెనీ ద్వారా ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు గుర్తించామని పోలీసులు వెల్లడించారు. అరెస్టయిన వారిలో ముగ్గురు గ్వాలియర్కు చెందినవారు, ఇద్దరు ప్రయాగ్రాజ్, మరో ఇద్దరు హర్యానాకు చెందినవారు కాగా.. ఒకరు బీహార్కు చెందినవారు. ప్రధాన సూత్రధారి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ నివాసి, పరారీలో ఉన్నట్లు తెలిసింది
ఉదయం మొదటి రౌండ్ పరీక్ష జరిగింది. మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కావాల్సిన పరీక్ష రద్దు చేయబడింది. నేషనల్ హెల్త్ మిషన్ కింద 2,284 కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి ఈ పరీక్ష జరిగింది. దాదాపు 45,000 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. సోమవారం రాత్రి పక్కా సమాచారం మేరకు పోలీసులు గ్వాలియర్ జిల్లా శివార్లలోని టేకాన్పూర్ ప్రాంతంలోని ఓ హోటల్పై దాడి చేశారు. లోపల ఉన్న ఎనిమిది మంది నుంచి పరీక్ష పేపర్ కాపీలు లభ్యమయ్యాయి.
Also Read
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్పై 1-0తో విజయం.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
BJP: కాంగ్రెస్పై బీజేపీ ఎదురుదాడి.. అదానీతో ఉన్న రాబర్ట్ వాద్రా ఫొటోలు విడుదల
వారి వద్ద 80 మంది అభ్యర్థుల ఒరిజినల్ డాక్యుమెంట్లు కూడా లభించాయని పోలీసు సూపరింటెండెంట్ అమిత్ సంఘీ వెల్లడించారు. అలాగే 39 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా ప్రశ్నాపత్రాల కోసం సుమారు రూ.2 నుంచి 3 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలిపారు. మోసం చేశారని ఆరోపిస్తూ వారిపై పోలీసు కేసు నమోదైంది. వీరిపై మధ్యప్రదేశ్ రికగ్నైజ్డ్ ఎగ్జామినేషన్ యాక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద కూడా అభియోగాలు మోపినట్లు తెలిసింది.
తాజావార్తలు
-
Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్లో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంతంటే?
-
Manisha Koirala: భారత్, చైనా అండగా ఉండాలి.. నేపాల్ వరదలపై కన్నీళ్లు పెట్టుకున్న మనీషా కొయిరాలా..
-
GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
-
Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’కు టాలీవుడ్ సినిమాల సెగ.. రిలీజ్ డేట్ మారుతుందా?
-
Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్పై 1-0తో విజయం.!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!